సంక్షిప్త వార్తలు (6)
జాతుల మధ్య ఘర్షణల వల్ల నిరాశ్రయులైన 284 మంది మణిపుర్ విద్యార్థులకు రక్షణగా సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. వారి చదువుల కొనసాగింపునకు అవకాశం కల్పించింది.
284 మంది మణిపుర్ విద్యార్థుల చదువులకు రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు
దిల్లీ: జాతుల మధ్య ఘర్షణల వల్ల నిరాశ్రయులైన 284 మంది మణిపుర్ విద్యార్థులకు రక్షణగా సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. వారి చదువుల కొనసాగింపునకు అవకాశం కల్పించింది. మణిపుర్ విశ్వవిద్యాలయం నిర్వహించే ఆన్లైన్ తరగతులకు హాజరుకావడం లేదా సిల్చార్లోని అస్సాం విశ్వవిద్యాలయం లేదా షిల్లాంగ్లోని నార్త్ఈస్ట్ హిల్ విశ్వవిద్యాలయంలో కానీ వారు కోరుకున్న చోట చదువుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న ఆ విద్యార్థుల తరఫున దాఖలైన ఓ పిటిషన్పై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువరించింది. రెండు వారాల్లోగా విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. దీనికి గాను నోడల్ అధికారిని నియమించాలని మణిపుర్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో ఏర్పడిన కమిటీ ఈ విషయాలనూ పర్యవేక్షిస్తుందని విద్యార్థులకు ధర్మాసనం భరోసానిచ్చింది. ఈ కమిటీని సర్వోన్నత న్యాయస్థానం నియమించిన విషయం తెలిసిందే.
మహిళాధికారులకు పదోన్నతులపై సమాలోచనలు
సుప్రీంకోర్టుకు తెలిపిన సైన్యం
దిల్లీ: మహిళాధికారులకు కర్నల్ ర్యాంక్ నుంచి బిగ్రేడియర్ హోదా పదోన్నతిని కల్పించేందుకు అవసరమైన విధాన రూపకల్పనపై సమాలోచనలు జరుగుతున్నాయని భారత ఆర్మీ సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సీనియర్ న్యాయవాది ఆర్.బాలసుబ్రమణియన్ నివేదించిన ఈ విషయాన్ని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నోట్ చేసుకుంది. పదోన్నతి విధాన ఖరారుకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు గడువునిచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను అదే ఏడాది ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర సభ్యులుగా ఉన్నారు. ఆర్మీ, నేవీలలో మహిళాధికారుల పదోన్నతుల విషయంలో వివక్ష కొనసాగుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై 2020 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు చారిత్రక తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే.
నిలుపుదల ఉత్తర్వుల తీర్పు సమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు
దిల్లీ: సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన నిలుపుదల (స్టే) ఉత్తర్వులను ప్రత్యేకించి పొడిగించని పక్షంలో ఆరు నెలల తర్వాత వాటంతట అవే రద్దవుతాయంటూ 2018లో వెలువరించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమీక్షించనుంది. దీనికోసం ఏర్పాటు చేయదలచిన రాజ్యాంగ ధర్మాసనంలోని అయిదుగురు సభ్యుల పేర్లను సుప్రీంకోర్టు వెబ్సైట్ సోమవారం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్ర సభ్యులుగా ఉంటారని పేర్కొంది.
సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగింపు
దిల్లీ: మనీలాండరింగ్ కేసులో దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు మంజూరైన మధ్యంతర బెయిల్ గడువును ఈ నెల 11 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. వైద్యపరమైన కారణాలతో మే 26న తొలుత ఆరు వారాలకు ఇచ్చిన బెయిల్ను న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది.
సుప్రీంకోర్టులో పిటిషన్ను ఉపసంహరించుకున్న సీఎఫ్డీ
ఎన్నికల విధుల నుంచి వాలంటీర్ల తొలగింపు వ్యాజ్యం
ఈనాడు, దిల్లీ: ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఉపసంహరించుకుంది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. దిల్లీ హైకోర్టులో ఇటువంటి పిటిషన్ విచారణలో ఉండడం, గతంలో ఇటువంటి పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు దిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో తాము పిటిషన్ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం.. పిటిషన్ ఉపసంహరణకు అనుమతించింది.
ఏకపక్ష ఫలితాలు ఆందోళనకరం
ఇటీవలి ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో పోటీ హోరాహోరీగా ఉంటుందని భావించారు. కానీ మూడు రాష్ట్రాల్లో ఏకపక్షంగా ఒకేపార్టీకి అనుకూల ఫలితాలు రావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో పార్టీలు ఘోరంగా విఫలమైనట్లు కనిపిస్తోంది. దీనిపై లోతుగా సమాలోచనలు జరిపి పరిష్కారాన్ని కనుగొనాలి.
మాయావతి
మా ఓట్ల శాతం ఆశాజనకం
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు నిరాశపరిచింది. మా అంచనాల కన్నా చాలా తక్కువ సీట్లు సాధించాం. కానీ ఓట్ల శాతం విషయంలో మాత్రం మేము భాజపాకు సమీపంలోనే ఉన్నాం. మేము మళ్లీ మెరుగైన పనితీరుతో అధికారాన్ని చేజిక్కించుకుంటామని విశ్వసిస్తున్నాం.
జైరాం రమేశ్
ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడు
తాజా ఎన్నికల్లో భాజపా మూడు రాష్ట్రాల్లో తిరుగులేని ఫలితాలు సాధించింది. ఇది ప్రధాని మోదీకి భారత ప్రజలు ఇచ్చిన గొప్ప కానుక. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సాధించబోయే విజయానికి ఇవి నాంది పలికాయి. భారత్-అమెరికా సంబంధాలను మరింత మెరుగుపరచగల ఉత్తమ నాయకుడు మోదీ.
మేరీ మిల్బెన్ (అమెరికా గాయని)
బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురు బాలికల్లో ఒకరికి 18 ఏళ్లు నిండక ముందే వివాహం చేస్తున్నారు. కొన్ని దేశాల్లో 40 శాతం మంది బాలికలకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. బాల్య వివాహాలు కచ్చితంగా హక్కుల ఉల్లంఘనే. దీనికి అడ్డుకట్ట వేయడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి.
ఐక్యరాజ్య సమితి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్