పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే
కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు.
నెహ్రూ తప్పిదాలతోనే కశ్మీర్కు ఈ దుస్థితి: అమిత్ షా
కశ్మీర్ అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం
పీవోకేకు 24 స్థానాలు రిజర్వు
దిల్లీ: కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. మొత్తం కశ్మీర్ను గెలుచుకోకుండా కాల్పుల విరమణను ప్రకటించడం, అక్కడి ప్రజల బాధలను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లకపోవడం ఆ తప్పిదాలని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మన దేశంలో భాగమేనని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, జమ్మూ కశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లులను కేంద్రం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. వాటిని సభ ఆమోదించింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ‘నెహ్రూ సరైన చర్యలు తీసుకుని ఉంటే కశ్మీర్లోని పెద్ద భూభాగం పాక్ ఆక్రమిత కశ్మీర్గా ఉండేది కాదు. అది మన దేశంలో భాగంగా ఉండేది. అప్పటి ఆయన చర్యలవల్లే ఇప్పటికీ కశ్మీర్ ఇబ్బందులు పడుతోంది. సైన్యం యుద్ధంలో గెలిచి పంజాబ్ను చేరుకోగానే కాల్పుల విరమణను నెహ్రూ ప్రకటించారు. దీంతో పీవోకే ఏర్పడింది. ఆ కాల్పుల విరమణను మూడు రోజుల తర్వాత ప్రకటించి ఉంటే పీవోకే భారత్లో భాగమయ్యేది’ అని అమిత్ షా పేర్కొన్నారు. మన దేశానికి చెందిన ఎంతో భూభాగాన్ని కోల్పోయామని, ఇది చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పొరపాటు జరిగిందని నెహ్రూ అంగీకరించారని, కానీ అది పొరపాటు కాదని, అతి పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. ఆయన ఈ విమర్శలు చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. వాకౌట్ చేశాయి. ఆ తర్వాత తిరిగి వచ్చాయి. హిమాలయన్ బ్లండర్ గురించీ అమిత్ షా మాట్లాడాలని బిజూ జనతాదళ్ ఎంపీ భర్తృహరి మెహతాబ్ కోరారు. నెహ్రూ చర్యలవల్ల 1962లో చైనాతో యుద్ధానికి దారితీసిన పరిస్థితులే హిమాలయన్ బ్లండర్ అని తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలు ఎవరినో కించపరచడానికి కాదని, సందర్భాన్ని బట్టి చేసినవని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.
2024లో మళ్లీ మోదీయే
ఆర్టికల్ 370 తాత్కాలికంగా తీసుకొచ్చిందని, దాని రద్దు నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లేది లేదని, ప్రధాని మోదీ ఈ విషయంలో ధైర్యం ప్రదర్శించారని అమిత్ షా తెలిపారు. జమ్మూ కశ్మీర్లో తీవ్రవాదం వల్ల 45,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, 2026కల్లా తీవ్రవాద ఘటనలను సున్నా స్థాయికి తీసుకొస్తామని చెప్పారు. 2024లోనూ మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే
బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సేనని అమిత్ షా స్పష్టం చేశారు. మోదీ పేద కుటుంబంలో పుట్టారని, బీసీల కష్టాలన్నీ ఆయన అనుభవించారని, ఇప్పుడు ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. అందుకే బీసీల సంక్షేమం కోసం పని చేస్తున్నారని తెలిపారు. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసినప్పుడూ మోదీ హయాంలో బీసీలకు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించామని తెలిపారు.
కశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపు
గతంలో జమ్మూ కశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. తాజా బిల్లులో 90కి పెంచారు. ఇంతకు ముందు కశ్మీర్ డివిజన్లో 46, జమ్ము డివిజన్లో 37 స్థానాలు ఉండేవి. తాజా బిల్లులో కశ్మీర్ డివిజన్లో 47కు, జమ్ము డివిజన్లో 43కు పెంచినట్లు అమిత్ షా వెల్లడించారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్కు 24 స్థానాలను రిజర్వు చేసినట్లు ప్రకటించారు. దీంతో మొత్తం స్థానాల సంఖ్య 114గా ఉంటుంది. ఇక కశ్మీర్లో రెండు స్థానాలను అక్కడి నుంచి వలస వెళ్లినవారికి, ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వు చేసినట్లు అమిత్ షా తెలిపారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు 9 స్థానాలను కేటాయించినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్