11న 370 అధికరణం రద్దుపై సుప్రీం తీర్పు

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది.

Published : 08 Dec 2023 06:00 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో ఉంచిన కేసుల జాబితా పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వివాదంపై తీర్పు వెలువరించనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సుర్యకాంత్‌ ఇతర సభ్యులుగా ఉన్నారు. 370 అధికరణం రద్దు అంశంపై 16 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం సెప్టెంబరు 5న ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది. ఆగస్టు 5, 2019లో 370 అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని