సంక్షిప్త వార్తలు (8)
ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక శుక్రవారం లోక్సభ ముందుకు రానుంది.
నేడు లోక్సభకు మొయిత్రాపై నైతిక విలువల కమిటీ నివేదిక
దిల్లీ: ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక శుక్రవారం లోక్సభ ముందుకు రానుంది. ఆమెను లోక్సభ నుంచి బహిష్కరించాలని కమిటీ తన నివేదికలో సిఫార్సు చేసింది. ఈ నెల 4వ తేదీనే సభలో ఆ నివేదికను ప్రవేశపెడతారని భావించినప్పటికీ విపక్ష సభ్యులు విస్తృత చర్చ జరపాల్సి ఉంటుందని తెలపడంతో ఆగిపోయింది. ఈ నివేదికను సభ ఆమోదించినట్లయితే మహువా మొయిత్రా లోక్సభ నుంచి బహిష్కరణకు గురవుతారు.
‘అఖిల భారత న్యాయసేవ’ అంశంలో ఏకాభిప్రాయం లేదు: కేంద్రం
దిల్లీ: అఖిల భారత న్యాయసేవ (ఆలిండియా జుడీషియల్ సర్వీసు) ఏర్పాటు విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని గురువారం రాజ్యసభలో కేంద్రం తెలిపింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని హైకోర్టులు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా లేవని పేర్కొంది. ‘‘కొన్ని ప్రభుత్వాలు ఇందుకు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని లేవు. మరి కొందరు కేంద్రం ప్రతిపాదించిన ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు’’ అని ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు.
హైకోర్టుల్లో 324 జడ్జీ పోస్టులు ఖాళీ
దిల్లీ: దేశంలోని అన్ని హైకోర్టులలో 324 జడ్జీల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని, వీటిలో 112 మంది న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియ వివిధ దశల్లో ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ తెలిపారు. హైకోర్టులలో మంజూరైన మొత్తం జడ్జీల పోస్టులు 1,114 కాగా 790 మంది న్యాయమూర్తులు పని చేస్తున్నారని గురువారం మంత్రి రాజ్యసభకు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి సుప్రీంకోర్టు 34 మంది జడ్జీలు ఉన్నారని, ప్రస్తుతం అక్కడ ఖాళీలేవీ లేవన్నారు.
కేరళ సిరో - మలబార్ చర్చి మేజర్ ఆర్చ్బిషప్ రాజీనామా
కొచిన్: కేరళలోని సిరో - మలబార్ చర్చి అధిపతి కార్డినల్ జార్జి ఎలెన్చెరీ గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏకరీతిగా హోలీ మాస్ నిర్వహణతోపాటు చర్చి భూముల వ్యవహారంలో కొనసాగుతున్న విభేదాల నడుమ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ పరిణామాలతో కలతకు గురైన పోప్ ఫ్రాన్సిస్ క్రైస్తవ మతాధికారులు అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుతూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. క్రిస్మస్ ముందు అందరూ కలిసి నడవాలని, ప్రార్థనలకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని పోప్ కోరారు.
రాజ్పూత్ నేత హత్యకేసులో ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
జైపుర్, ఇందౌర్: రాజస్థాన్ రాజధాని నగరమైన జైపుర్లో రాష్ట్రీయ రాజ్పూత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్సింగ్ గోగామేడీని కాల్చి చంపిన కేసుకు సంబంధించి శ్యాంనగర్ స్టేషన్ హౌస్ అధికారితోపాటు మరో బీట్ కానిస్టేబుల్ను పోలీస్ కమిషనర్ సస్పెండు చేశారు. కాగా, సుఖ్దేవ్సింగ్ భార్య శీలా షెకావత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజస్థాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, డీజీపీల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుఖ్దేవ్సింగ్ హత్యకు కుట్ర జరుగుతోందని ఈ ఏడాది ఫిబ్రవరి 14న పంజాబ్ పోలీసులు రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసినా, ప్రభుత్వ పెద్దలు కావాలనే తగిన భద్రత కల్పించలేదన్నారు. రాజ్పూత్ నేత హత్యకు నిరసనగా గురువారం మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నగరంలో కర్ణిసేన కార్యకర్తలు ఇందౌర్ - ఉజ్జయిని రహదారి దిగ్బంధనం చేసి ఆందోళనకు దిగారు.
భారీ ప్లాట్ఫామ్ను జారవిడిచిన సి-17 విమానం
దిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ భారీ ప్లాట్ఫామ్ను భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన సి-17 రవాణా విమానం ఆగ్రాలోని ఓ మిలిటరీ జోన్లో గగనతలం నుంచి గురువారం విజయవంతంగా జారవిడిచింది. గరిష్ఠంగా 16 టన్నుల వరకూ బరువులను మోయగల సామర్థ్యం ఆ ప్లాట్ఫామ్కు ఉందని అధికారులు తెలిపారు. అంతటి సామర్థ్యమున్న ప్లాట్ఫామ్ను ఐఏఎఫ్ విమానమొకటి విజయవంతంగా జారవిడవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
మణిపుర్లో ఇక మద్యం అమ్మకాలు చట్టబద్ధం
ఇంఫాల్: మణిపుర్లో మద్యం విక్రయాలు, వినియోగంపై 30 ఏళ్లకు పైగా కొనసాగుతున్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై గ్రేటర్ ఇంఫాల్తోపాటు జిల్లా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, హోటళ్లలో మద్యం అమ్మకాలను చట్టబద్ధం చేసింది. ఈ మేరకు బుధవారం గెజిట్ను విడుదల చేసింది. 1991లో తీసుకొచ్చిన మద్య నిషేధ చట్టం పైన పేర్కొన్న ప్రాంతాల్లో వర్తించదని స్పష్టం చేసింది. మద్యం అమ్మకాలతో రాష్ట్రానికి ఏటా కనీసం రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఓ అధికారి వెల్లడించారు.
పన్నూ బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్నాం: భారత్
దిల్లీ: డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్పై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ‘ఆ బెదిరింపులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారాన్ని అమెరికా, కెనడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఒక అంశంపై మీడియా కవరేజీని కోరుకుంటారు. అలాంటి హెచ్చరికలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిపై భారత ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకుంటాయి’ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్