ష్‌.. పేరెంట్‌ - టీచర్‌ మాట్లాడుకొంటున్నారు!

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. తన పోస్టుల్లో చమత్కారం ఉంటుంది. తాజాగా స్మృతి నెట్టింట్లో చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది.

Published : 09 Dec 2023 05:29 IST

 మోదీతో తన తండ్రి భేటీపై స్మృతీ ఇరానీ పోస్ట్‌ వైరల్‌

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. తన పోస్టుల్లో చమత్కారం ఉంటుంది. తాజాగా స్మృతి నెట్టింట్లో చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఆమె తండ్రి అజయ్‌కుమార్‌ మల్హోత్రా ఇటీవల ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి భేటీని స్మృతి పేరెంట్‌ - టీచర్‌ మీటింగుతో పోల్చారు. ‘‘మన బాస్‌, తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చున్నారంటే మనకు కంగారొచ్చేస్తుంది. వారిద్దరూ కలిసి మనపై పోటీపడి ఫిర్యాదులు చెప్పకూడదని ప్రార్థించుకోవాలి’’ అని ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ఈ సమావేశం తాలూకు చిత్రాలు షేర్‌ చేస్తూ.. బిజీ షెడ్యూలులో కూడా తమకు సమయం కేటాయించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై ప్రముఖ టీవీ నిర్మాత ఏక్తాకపూర్‌, నటుడు సోనూసూద్‌తోపాటు పలువురు నెటిజన్లు స్పందించారు. ‘‘మీరు మంచి విద్యార్థి.. బాగా కష్టపడతారు’’ అని రాసుకొచ్చారు. టీవీ నటిగా తన కెరీర్‌ మొదలుపెట్టిన స్మృతి.. భాజపాలో కీలక నేతగా, కేంద్ర మంత్రిగా ఎదిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని