విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం

విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Published : 09 Dec 2023 05:17 IST

మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, పెర్నాడ్‌ రికార్డ్‌ ఇండియా ప్రతినిధి బినోయ్‌ బాబు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థల వ్యవహార శైలిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘నిందితులుగా ఉన్న వ్యక్తులను విచారణకు ముందు ఎక్కువ కాలం జైలులో ఉంచడం సరైంది కాదు. నిందితులపై ఈడీ, సీబీఐ చేసిన ఆరోపణల మధ్య వ్యత్యాసం ఉంది. ఈ విచారణ ఎలా సాగుతుందో ఇప్పటికీ తెలియడం లేదు’’ అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బినోయ్‌ బాబు గత 13 నెలలుగా జైలులో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన తరపు న్యాయవాది హరీశ్‌ సాల్వే...  ధర్మాసనానికి తెలియజేశారు. బినోయ్‌ బాబు బెయిల్‌ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాల ఆధారంగా ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని