కుంగిపోలేదు.. కెరటంలా లేచాడు
ఒక్కోసారి ఎలాంటి తప్పు చేయకున్నా కొందరు కేసుల్లో ఇరుక్కొని.. జైలు పాలై.. తీవ్రంగా కుంగిపోతుంటారు. చివరకు ఒత్తిడిలోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటారు.
జంటహత్యల నిందతో జైలుపాలై.. ‘లా’ చదివి నిర్దోషిగా బయటపడ్డ మేరఠ్ యువకుడు
ఒక్కోసారి ఎలాంటి తప్పు చేయకున్నా కొందరు కేసుల్లో ఇరుక్కొని.. జైలు పాలై.. తీవ్రంగా కుంగిపోతుంటారు. చివరకు ఒత్తిడిలోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అమిత్ చౌధరి(30) కథ దీనికి పూర్తి భిన్నం. తన చుట్టూ అల్లుకున్న చిక్కుముళ్లను తానే ఛేదించుకొని నిర్దోషిగా బయటపడి జీవితాన్ని గెలిచిన స్ఫూర్తిగాథ ఇది. అమిత్ చౌధరి చేయని నేరానికి.. 12 ఏళ్ల క్రితం మేరఠ్లో జరిగిన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యకేసులో అరెస్టయ్యాడు. గ్యాంగ్స్టర్ ముద్ర కూడా వేశారు. వాస్తవానికి హత్యలు జరిగిన సమయంలో అమిత్ మేరఠ్లోనే లేడు. శామ్లీ పట్టణంలోని తన సోదరి ఇంట్లో ఉన్నాడు. అయినప్పటికీ ఈ కేసులో అరెస్టయిన 17 మందిలో అమిత్ను కూడా చేర్చారు. కైల్ అనే వ్యక్తికి చెందిన ముఠాలో సభ్యుడిగా ఉంటూ హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. దీంతో అమిత్ రెండేళ్లపాటు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.
సంక్షోభాన్ని సదవకాశంగా తీసుకొని..
తన జీవితంలో అనుకోకుండా తలెత్తిన ఈ తుపానును సదవకాశంగా మార్చుకోవాలని అమిత్ నిర్ణయించుకున్నారు. ఓ రైతు కొడుకైన ఈయన.. జైలు జీవితం గడుపుతున్న సమయంలో ఎందరో నేరస్థులు వారి ముఠాల్లో చేరాలని ప్రలోభపెట్టినా అమిత్ తలొగ్గలేదు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఓ జైలరు సహకరించారు. అమిత్ను గ్యాంగ్స్టర్లు ఉండే బ్యారక్లలో కాకుండా వేరే చోటుకు మార్చారు. ఇలా రెండేళ్ల జైలు జీవితం తర్వాత 2013లో అమిత్ బెయిలు మీద విడుదలయ్యారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం ద్వారా తన కుటుంబం తిరిగి తలెత్తుకొని తిరిగేలా చేయాలని అమిత్ నిశ్చయించుకున్నారు. కుంగుబాటు ఆలోచనలను పక్కన పెట్టి.. బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. బార్ కౌన్సిల్ పరీక్షలోనూ ఉత్తీర్ణులయ్యాక.. చట్టపరమైన అంశాలపై వచ్చిన పట్టుతో తన కేసును తానే చేపట్టారు.
లాయర్గా చూసి.. గుర్తుపట్టని పోలీసు అధికారి
పోలీసులు మొదట్లో ఎలాంటి స్టేట్మెంట్లు, ఆధారాలు సేకరించకపోవడంతో ఈ కేసు నత్తనడకన సాగిందని అమిత్ తెలిపారు. తాను పూర్తిగా ఈ కేసుపైనే దృష్టి సారించి కోర్టులో వాదనలు వినిపించినట్లు చెప్పారు. విచారణలో భాగంగా ఓసారి ఆయనను అరెస్టుచేసిన పోలీసు అధికారి బోనులో నిలబడాల్సి వచ్చింది. న్యాయవాదిగా కేసు వాదిస్తున్న తనను ఆ అధికారి గుర్తుపట్టకపోవడం జడ్జిని ఆశ్చర్యానికి గురిచేసిందని అమిత్ వెల్లడించారు. దీంతో ఈ కేసులో నిందితుల పేర్లను ఎంత గుడ్డిగా చేర్చారో న్యాయమూర్తికి అర్థమైందన్నారు. జంటహత్యల్లో తన ప్రమేయం ఉన్నట్లుగా నిరూపించే ఒక్క ఆధారాన్నీ పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారని అమిత్ తెలిపారు. ఆయనతోపాటు మొత్తం 13 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
పీవోకేపై భారత్ పట్టు కోల్పోయేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతే కారణమని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ విమర్శలు గుప్పించారు. -
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయపన్ను విభాగం జరిపిన సోదాల్లో(Tax raids) లెక్కలోకి రాని కోట్లాది రూపాయల సొత్తు బయటపడింది. -
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. -
సీబీఐకి కొత్తగా ఇద్దరు అదనపు డైరెక్టర్ల నియామకం
సీబీఐకి ఇద్దరు అదనపు డైరెక్టర్లను కేంద్రం నియమించింది. -
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
ED arrests: మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణ చేపడితే ఆ కేసులో నిందితులను ఈడీ అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై జరిగిన దాడి గురించి మీడియా ప్రశ్నించగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల మహిళలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ వారికి ఆప్ నేత ఎదురుప్రశ్న వేశారు. -
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై బయట ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టులో ఈడీ లేవనెత్తింది. దానిపై కోర్టు స్పందించింది. -
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
పౌరసత్వ సవరణ చట్టం-2019పై అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. -
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
Mumbai hoarding collapse: ముంబయిలో హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో.. 48 గంటల తర్వాత కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM