మూడంచెల భద్రత కళ్లుగప్పి
దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న పార్లమెంటు నిలువెత్తు ప్రజాస్వామ్య దేవాలయం. దేశంలోని అత్యంత భద్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. అలాంటి పార్లమెంటులో బుధవారం చోటుచేసుకున్న ఘటన అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది.
అడుగడుగునా తనిఖీలను ఏమార్చి..
పార్లమెంటులోకి గ్యాస్ క్యాన్లను తెచ్చిన దుండగులు
ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న పార్లమెంటు నిలువెత్తు ప్రజాస్వామ్య దేవాలయం. దేశంలోని అత్యంత భద్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. అలాంటి పార్లమెంటులో బుధవారం చోటుచేసుకున్న ఘటన అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది. అది కూడా 22ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగిన డిసెంబరు 13నే కావడం సంచలనంగా మారింది. తాజా ఘటనతో పార్లమెంటులో భద్రతా వ్యవస్థపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో అసలు ఎలాంటి భద్రత ఉంటుంది? ఎవరెవర్ని అనుమతిస్తారో తెలుసుకుందాం..
నాటి ఉగ్ర దాడితో ఆంక్షలు..
సరిగ్గా 22 ఏళ్ల క్రితం 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్ భారతం ఉలిక్కిపడింది. అప్పటి నుంచి పార్లమెంటులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రాంగణంలోకి ప్రవేశించడంపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఎంపీలు, సరైన గుర్తింపు కార్డు కలిగిన అధికారులు, జర్నలిస్టులు, టెక్నీషియన్లు, సహాయకులు మినహా ఎవరికీ అనుమతి లేదు. సందర్శకులు రావాలంటే తప్పనిసరిగా పార్లమెంటు సభ్యుల ద్వారా సెక్యూరిటీ క్లియరెన్స్ పొంది విజిటర్స్ పాస్లు తీసుకోవాలి. సందర్శకుల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పాస్లను ఇస్తుంటారు. వీరి ప్రవర్తనకు సంబంధించి ఆయా పార్లమెంటు సభ్యులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
పటిష్ఠమైన భద్రత ఉన్నా..
ఇక పార్లమెంటు భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంటుకు వచ్చే సిబ్బంది, సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంటు ప్రాంగణంలోని ప్రవేశ ద్వారంవద్ద సందర్శకులను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పార్లమెంటు భవనం వద్ద ఉన్న ఎంట్రీ గేట్వద్ద మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. చివరగా విజిటర్స్ గ్యాలరీకి వెళ్లే మార్గంలోని కారిడార్లో మూడోసారి తనిఖీ చేస్తారు. పార్లమెంటులో పని చేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకూ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంటులో పని చేసే ప్రతి సిబ్బందినీ గుర్తించేలా ఉంటారు. పార్లమెంటులో పని చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీ కార్డులు ధరించాలి. సమయానుసారం సిబ్బందిని తనిఖీ చేస్తారు. మెటల్ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు, ఫుల్ బాడీ స్కానర్ల వంటి అధునాతన పరికరాలతో పార్లమెంటు పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేశారు.
వలయాన్ని దాటుకుని లోపలికి ఎలా?
ఇంత కట్టుదిట్టమైన భద్రత నడుమ బుధవారం నాటి ఘటన ఎలా జరిగిందన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. లోక్సభలో సందర్శకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు దుండగులు సభలో గందరగోళం సృష్టించారు. పార్లమెంటు భవనం వెలుపల మరో ఇద్దరు ఈ పొగ గొట్టాలతో కలకలం రేపారు. మెటల్ డిటెక్టర్లు, మూడంచెల తనిఖీలను దాటుకుని దుండగులు పార్లమెంటు భవనం లోపలికి ఆ రంగుల పొగ గొట్టాలను ఎలా తీసుకొచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ముందు రోజే దరఖాస్తు చేసుకుంటే ఒక్కో ఎంపీకి రోజుకు ఇద్దరు, అదే రోజు దరఖాస్తు చేసుకుంటే ఒక సందర్శకుడికి అనుమతి ఇస్తున్నారు. వీళ్లు రిసెప్షన్ నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది. అక్కడే స్కానింగ్ మిషన్తోపాటు మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపుతారు. సెల్ఫోన్లు, తాళాలు, పర్సులు, దువ్వెనలు, చేతి రుమాళ్లు ఏవి ఉన్నా బయటపెట్టి పోవాల్సిందే. ప్రతి సందర్శకుడిని రిసెప్షన్లోకి ప్రవేశించేటప్పుడు, పార్లమెంటు భవనంలోకి అడుగు పెట్టేటప్పుడు, గ్యాలరీలోకి ప్రవేశించే ముందు మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి పంపుతారు. సందర్శకులు గ్యాలరీలోకి ప్రవేశించిన తర్వాత ప్రతి వరుసకు ఆ చివర, ఈ చివర భద్రతా సిబ్బంది కూర్చుని అందర్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరూ సభలోకి తొంగి చూడకుండా ఉండటానికి గ్యాలరీ మొదటి వరుసలో భద్రతా సిబ్బందిని తప్పితే సందర్శకులను అనుమతివ్వరు. ఇంతటి పకడ్బందీ ఏర్పాట్లున్నా ఒక వ్యక్తి దూకడం, మరో వ్యక్తి రైలింగ్ పట్టుకుని దూకడానికి కొంతసేపు పెనుగులాడి మరొకరి సాయంతో లోపలికి ప్రవేశించడం అన్నది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్లోని స్థానిక నర్సింగ్ హోంలో చేరారు. -
ముంబయి విమానాశ్రయంలో రూ.13.56 కోట్ల బంగారం పట్టివేత
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13.56 కోట్లు విలువ చేసే బంగారం పట్టుబడింది. -
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. -
‘సిజేరియన్’ శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
కేజ్రీవాల్కు ఇచ్చినట్లే నాకూ బెయిలివ్వండి
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
వీవీప్యాట్ స్లిప్పుల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్
లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీయం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిస్థాయిలో సరిపోల్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఏప్రిల్ 26నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
త్రిపురకు వెళ్లి ఏనుగులను కాపాడిన అంబానీ ‘వన్ తారా’బృందం
గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకు ఏకంగా 3,500 కి.మీ. ప్రయాణించారు. -
ముంబయిలో గాలివాన బీభత్సం
కొన్నిరోజులుగా వేడి వాతావరణంతో సతమతమవుతోన్న ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. -
56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు
రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న 56 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం మెయిల్ రూపంలో ఈ సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. -
మోదీ మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
దర్యాప్తునకు పనికొచ్చే సమాచారం అందించని కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ (45) హత్య కేసు దర్యాప్తునకు తోడ్పడే నిర్దిష్ట సమాచారమేదీ కెనడా నుంచి భారత దర్యాప్తు సంస్థలకు అందలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం తెలిపారు. -
భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ‘ఎక్సర్సైజ్ శక్తి’ ప్రారంభం
భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ‘ఎక్సర్సైజ్ శక్తి’ సంయుక్త సైనిక శిక్షణ సోమవారం మేఘాలయలోని ఉమ్రోయ్లో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైందని రక్షణ శాఖ తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (3)
దిల్లీలోని ఒక పెట్రోల్ పంపు వద్ద దాడికి పాల్పడిన ఘటనలో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్, అతని కుమారుడు అనాస్ అహ్మద్పై సోమవారం బెయిల్కు వీల్లేని వారెంట్ జారీ అయినట్లు పోలీసులు తెలిపారు. -
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
Rahul gandhi: రాహుల్తో చర్చించేందుకు భాజపా సిద్ధమైంది. ఓ యువ నాయకుడికి అవకాశం ఇచ్చింది.