పార్లమెంటులో అలజడి ఘటన వెనుక పెద్ద వ్యక్తులు?
పార్లమెంటులో అలజడి ఘటనపై నిందితుల కుటుంబాలు స్పందించాయి. తమ పిల్లలు నిజంగా తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని కోరాయి.
నిందితుల తల్లిదండ్రులు, బంధువుల అనుమానం
దిల్లీ, కోల్కతా: పార్లమెంటులో అలజడి ఘటనపై నిందితుల కుటుంబాలు స్పందించాయి. తమ పిల్లలు నిజంగా తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని కోరాయి. ఈ కుట్ర వెనుక పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు దాగి ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశాయి. తమవారు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు వెల్లడించాయి.
సాగర్ను కుట్రలోకి లాగారేమో..
‘సాగర్ను ఈ కుట్రలోకి లాగారు. ఈ కుట్రలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వ్యక్తుల హస్తం ఉండి ఉంటుంది. ఆ పెద్ద వ్యక్తులే సాగర్ను ఇరికించి ఉంటారు. చిన్న వ్యక్తులే ఇరుక్కుంటారు. పెద్ద వ్యక్తులు తప్పించుకుంటారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరపాలి. నా సోదరికి సాగర్ ఒక్కడే కుమారుడు. సాగర్ బయట తిరిగే వ్యక్తి కాడు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లోనే ఇతర నిందితులతో పరిచయం ఏర్పడి ఉంటుంది. సాగర్ వంటి చిన్న వ్యక్తులవద్ద రాష్ట్రాలు దాటి తిరగడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి’ అని సాగర్ మేనమామ ప్రదీప్ శర్మ అభిప్రాయపడ్డారు.
‘మనోరంజన్కు నేర నేపథ్యం లేదు’
పార్లమెంటులో అలజడి ఘటన నిందితుడైన మనోరంజన్కు ఎలాంటి నేర నేపథ్యం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్తో అతడికి సంబంధం ఉన్నట్లు తేలిందని వెల్లడించాయి. మనోరంజన్కు విప్లవ భావాలు ఉన్నాయని పేర్కొన్నాయి.
‘సైనిక నియామక శిక్షణకు నెలకు రూ.4వేలు కావాలన్నాడు’
పార్లమెంటు వెలుపల పొగ వదిలిన కేసులో అరెస్టైన అమోల్ శిందే సైనిక నియామకాల్లో పాల్గొన్నాడు. దీని కోసం అస్సాం వరకూ వెళ్లివచ్చాడు. ఎంపిక కాకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. శిక్షణ తీసుకునేందుకు నెలకు రూ.4వేలు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడిగాడు. వారు తమవద్ద లేవని చెప్పారు. ఆ తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ‘లాతూర్ వెళ్లి శిక్షణ తీసుకోవాలని అమోల్ మమ్మల్ని డబ్బు అడిగాడు. నెలకు రూ.4వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అంత డబ్బు సర్దలేమని మేం చెప్పాం. ఇప్పటికే చదువులకు చాలా ఖర్చవడంతో అంత డబ్బు తేలేమని తెలిపాం’ అని అమోల్ తల్లి వెల్లడించారు.
లలిత్ ఝా బెంగాల్వాసి
పార్లమెంటులో అలజడి ఘటనకు మాస్టర్మైండ్గా ఉన్న లలిత్ ఝా కోల్కతాలోని బుర్రాబజార్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. కోల్కతా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడి వెళ్లి ఇంటి యజమానిని లలిత్ ఝా గురించి అడిగారు. అతడు సమయానికి అద్దె చెల్లించేవాడు కాదని, స్థానికులతో అంతగా పరిచయాలు లేవని యజమాని చెప్పారు. ఎక్కువగా ఎవరితోనూ లలిత్ మాట్లాడేవాడు కాదని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో ఉన్న ఓ ఎన్జీవోలో లలిత్ ఝా పనిచేసేవాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు