పార్లమెంటులో అలజడి ఘటన వెనుక పెద్ద వ్యక్తులు?
పార్లమెంటులో అలజడి ఘటనపై నిందితుల కుటుంబాలు స్పందించాయి. తమ పిల్లలు నిజంగా తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని కోరాయి.
నిందితుల తల్లిదండ్రులు, బంధువుల అనుమానం
దిల్లీ, కోల్కతా: పార్లమెంటులో అలజడి ఘటనపై నిందితుల కుటుంబాలు స్పందించాయి. తమ పిల్లలు నిజంగా తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని కోరాయి. ఈ కుట్ర వెనుక పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు దాగి ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశాయి. తమవారు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు వెల్లడించాయి.
సాగర్ను కుట్రలోకి లాగారేమో..
‘సాగర్ను ఈ కుట్రలోకి లాగారు. ఈ కుట్రలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వ్యక్తుల హస్తం ఉండి ఉంటుంది. ఆ పెద్ద వ్యక్తులే సాగర్ను ఇరికించి ఉంటారు. చిన్న వ్యక్తులే ఇరుక్కుంటారు. పెద్ద వ్యక్తులు తప్పించుకుంటారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరపాలి. నా సోదరికి సాగర్ ఒక్కడే కుమారుడు. సాగర్ బయట తిరిగే వ్యక్తి కాడు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లోనే ఇతర నిందితులతో పరిచయం ఏర్పడి ఉంటుంది. సాగర్ వంటి చిన్న వ్యక్తులవద్ద రాష్ట్రాలు దాటి తిరగడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి’ అని సాగర్ మేనమామ ప్రదీప్ శర్మ అభిప్రాయపడ్డారు.
‘మనోరంజన్కు నేర నేపథ్యం లేదు’
పార్లమెంటులో అలజడి ఘటన నిందితుడైన మనోరంజన్కు ఎలాంటి నేర నేపథ్యం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్తో అతడికి సంబంధం ఉన్నట్లు తేలిందని వెల్లడించాయి. మనోరంజన్కు విప్లవ భావాలు ఉన్నాయని పేర్కొన్నాయి.
‘సైనిక నియామక శిక్షణకు నెలకు రూ.4వేలు కావాలన్నాడు’
పార్లమెంటు వెలుపల పొగ వదిలిన కేసులో అరెస్టైన అమోల్ శిందే సైనిక నియామకాల్లో పాల్గొన్నాడు. దీని కోసం అస్సాం వరకూ వెళ్లివచ్చాడు. ఎంపిక కాకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. శిక్షణ తీసుకునేందుకు నెలకు రూ.4వేలు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడిగాడు. వారు తమవద్ద లేవని చెప్పారు. ఆ తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ‘లాతూర్ వెళ్లి శిక్షణ తీసుకోవాలని అమోల్ మమ్మల్ని డబ్బు అడిగాడు. నెలకు రూ.4వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అంత డబ్బు సర్దలేమని మేం చెప్పాం. ఇప్పటికే చదువులకు చాలా ఖర్చవడంతో అంత డబ్బు తేలేమని తెలిపాం’ అని అమోల్ తల్లి వెల్లడించారు.
లలిత్ ఝా బెంగాల్వాసి
పార్లమెంటులో అలజడి ఘటనకు మాస్టర్మైండ్గా ఉన్న లలిత్ ఝా కోల్కతాలోని బుర్రాబజార్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. కోల్కతా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడి వెళ్లి ఇంటి యజమానిని లలిత్ ఝా గురించి అడిగారు. అతడు సమయానికి అద్దె చెల్లించేవాడు కాదని, స్థానికులతో అంతగా పరిచయాలు లేవని యజమాని చెప్పారు. ఎక్కువగా ఎవరితోనూ లలిత్ మాట్లాడేవాడు కాదని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో ఉన్న ఓ ఎన్జీవోలో లలిత్ ఝా పనిచేసేవాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. -
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కు గనిలో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోల్కతాకు చెందిన ఓ విజిలెన్స్ అధికారి మృతి చెందారు. -
ఆమెపై కుట్ర చేస్తున్నారు.. సంజయ్సింగ్ది నటన: స్వాతీమాలీవాల్ మాజీ భర్త ఆరోపణలు
ఒక కుట్రలో భాగంగానే స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై దాడి జరిగిందని ఆమె మాజీ భర్త ఆరోపించారు. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
‘న్యూస్క్లిక్’(NewsClick) వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
Jaishankar: భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాకు జైశంకర్ చురకలంటించారు. 200 ఏళ్ల సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే
తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
మళ్లీ బెదిరింపు ఈ-మెయిళ్లు
దేశ రాజధాని దిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిహాడ్ జైలుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దిల్లీ మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ‘ఆప్’!
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు మంగళవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతా శర్మకు ఈడీ నివేదించింది. -
ఐటీవో సీఆర్ భవనంలో అగ్నిప్రమాదం
సెంట్రల్ దిల్లీలోని ఐటీవోలో ఆదాయపుపన్ను సెంట్రల్ రెవెన్యూ (సీఆర్) భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తూర్పు దిల్లీకి చెందిన 46 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. -
లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా?
ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి
గాజాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) తరఫున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతి చెందారు. -
‘ఎన్నికల బాండ్లపై దర్యాప్తు’ పిటిషన్లను సత్వరమే విచారించండి
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చిన ‘ఎన్నికల బాండ్ల’పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను సత్వరమే విచారణకు చేపట్టాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది. -
క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట!
చికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతమవుతుంటుంది. దీన్ని అడ్డుకునే సామర్థ్యమున్న మూడు రకాల మందులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
విదేశీయులకు విద్యానంతరం రెండేళ్ల వీసా కొనసాగించాలి
విదేశీ విద్యార్థులకు తమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యావకాశాలు కల్పించడం, అందుకోసం జారీచేసే గ్రాడ్యుయేట్ వీసాల వల్ల కలిగే లాభనష్టాల గురించి అధ్యయనం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నియమించిన రివ్యూ కమిటీ కీలక సూచనలు చేసింది. -
ప్రభుత్వ లాంఛనాలతో సుశీల్ మోదీ అంత్యక్రియలు
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం పట్నాలో పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. -
రాగి గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు
రాజస్థాన్లోని నీమ్కా థానా జిల్లాలో రాగి గనుల్లో మంగళవారం ప్రమాదం సంభవించింది. సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే లిఫ్ట్ కుప్పకూలింది. -
ఎల్టీటీఈపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు
శ్రీలంకకు చెందిన ఉగ్ర సంస్థ ఎల్టీటీఈపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరో ఐదేళ్లు పొడిగించింది. -
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
విట్ వ్యవస్థాపకుడు విశ్వనాథన్కు న్యూయార్క్ వర్సిటీ డాక్టరేట్
తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) వ్యవస్థాపకుడు, ఛాన్స్లర్ అయిన డాక్టర్ జి.విశ్వనాథన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ (ఎస్యూఎన్వై) నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. -
అంబేడ్కర్ పేరును కేజ్రీవాల్ వినియోగించకుండా అడ్డుకోవాలంటూ పిల్
జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను రాజకీయ నాయకులు ఎవరూ స్వప్రయోజనాలకు వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
-
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
-
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
-
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్