కాలచక్రం మనవైపు మారింది
కాలచక్రం మనదేశం వైపు మారిందని, కొత్త శకం తలుపులు తడుతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ అనే ఆలయాన్ని పునర్నిర్మించే కర్తవ్యాన్ని దైవం తనకు అప్పగించిందని చెప్పారు.
ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తున్నాం
‘భారతాలయ’ పునర్నిర్మాణ కర్తవ్యాన్ని దైవం నాకు ఇచ్చింది
యూపీలో కల్కి ధామ్ ఆలయ శంకుస్థాపనలో ప్రధాని వెల్లడి
రెడ్టేప్ స్థానంలో రెడ్ కార్పెట్ సంస్కృతి వచ్చిందని వ్యాఖ్య
రూ.10 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన
సంభల్ (యూపీ), లఖ్నవూ: కాలచక్రం మనదేశం వైపు మారిందని, కొత్త శకం తలుపులు తడుతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ అనే ఆలయాన్ని పునర్నిర్మించే కర్తవ్యాన్ని దైవం తనకు అప్పగించిందని చెప్పారు. మన ప్రాచీన శిల్పాలను విదేశాల నుంచి తీసుకొస్తున్నామని, రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయని వెల్లడించారు. ఇతరులను అనుసరించే స్థితి నుంచి అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి తొలిసారిగా ఎదిగామని చెప్పారు. ఉత్తర్ప్రదేశ్లోని సంభల్ జిల్లాలో కల్కిధామ్ ఆలయానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేసి ప్రసంగించారు. లఖ్నవూలో మరో కార్యక్రమంలో రూ.10 లక్షల కోట్ల విలువైన 14,500 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. రెండుచోట్లా ప్రసంగించారు. భారతీయ విశ్వాసానికి మరో గొప్ప కేంద్రంగా కల్కిధామ్ ఆవిర్భవిస్తుందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.
ఉద్దేశం మంచిదైతే ఎవరూ అడ్డుకోలేరు
‘‘దేశంలో తీర్థక్షేత్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆలయాలతో పాటు వైద్య కళాశాలలు కొత్తగా వస్తున్నాయి. ఉత్తర్ప్రదేశ్లో ఏడేళ్లుగా నడుస్తున్న ‘డబుల్ ఇంజిన్’ సర్కారుతో పెట్టుబడిదారులకు రెడ్టేప్ (అలసత్వ) సంస్కృతి బదులు రెడ్కార్పెట్ (ఎర్రతివాచీతో స్వాగతం) కనిపిస్తోంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ఉపాధి అవకాశాలు యూపీలో ఉంటాయని ఏడెనిమిదేళ్ల క్రితం ఎవరూ ఊహించలేదు. అప్పట్లో నేరాలు, అల్లర్లు నిత్యకృత్యం. యూపీ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఎవరిలోనూ లేదు. కేంద్రంలో, యూపీలో భాజపా సర్కారు వచ్చాక పరిస్థితులు మారాయి. ఉద్దేశం మంచిదైతే అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని రుజువైంది’’ అని ప్రధాని చెప్పారు.
వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాం
వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కి, ప్రకృతి సేద్యంపై, చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించేలా ప్రభుత్వం చేయూత అందిస్తోందని మోదీ తెలిపారు. భారతదేశ ఆహార ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా డైనింగ్ టేబుళ్లపై కనిపించాలని ఆకాంక్షించారు. పవిత్ర నదుల పరిశుభ్రతకు హాని కలిగించకుండా ఆహారశుద్ధి పరిశ్రమలు పనిచేయాలని సూచించారు. నవకల్పనలకు, డిజిటల్ సాంకేతికతకు కేంద్రంగా మన దేశం గుర్తింపు పొందుతోందన్నారు. కల్కి ధామ్ పుణ్యక్షేత్రాన్ని 108 అడుగుల ఎత్తున అయిదెకరాల్లో నిర్మించనున్నారు. ఈ దేవాలయంలో 10వ గర్భగుడిలో కల్కి అవతారం ఉంటుంది. మోదీ మంగళవారం జమ్మూలో రూ.30,500 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?