విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత
ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, న్యాయరంగంలో భీష్మ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫాలీ శామ్ నారీమన్ (95) ఇకలేరు.
దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ
70 ఏళ్లపాటు సేవలు
ప్రధాని, సీజేఐతోపాటు పలువురి సంతాపం
ఈనాడు, దిల్లీ: ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, న్యాయరంగంలో భీష్మ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫాలీ శామ్ నారీమన్ (95) ఇకలేరు. భారతీయ న్యాయ వ్యవస్థలోని ‘కేశవానంద భారతి’లాంటి ఎన్నో కీలక కేసుల్లో పాలు పంచుకున్న ఆయన బుధవారం ఉదయం దిల్లీలో కన్నుమూశారు. గుండె జబ్బుతోపాటు వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. నారీమన్కు కుమారుడు రోహింటన్ నారీమన్ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), కుమార్తె అనహీత ఉన్నారు. ఆయన సతీమణి బాప్సీ నారీమన్ 2020లో మరణించారు. ఖాన్ మార్కెట్ సమీపంలోని పార్శీ ఆరంగాలో గురువారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు బహదూర్షా జఫర్ మార్గ్లోని పార్శీ అంజుమన్లో ప్రార్థనా సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. నారీమన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణసహా పలువురు సంతాపం తెలిపారు.
న్యాయ వ్యవస్థలో మేటి
ఫాలీ ఎస్ నారీమన్ 1929 జనవరి 10న మయన్మార్లోని రంగూన్లో (ప్రస్తుతం యాంగూన్) జన్మించారు. ఆయనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు మయన్మార్ను జపాన్ ఆక్రమించుకోవడంతో భారత్కు కుటుంబంతోసహా వలస వచ్చారు. సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో ఎకనామిక్స్ అండ్ హిస్టరీలో బీఏ పూర్తి చేశారు. 1950లో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి లా పట్టా అందుకున్నారు. బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1961లో అక్కడ సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 22 ఏళ్లపాటు ముంబయిలో ప్రాక్టీసు చేసిన తర్వాత 1972లో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. అనంతరం న్యాయ వ్యవస్థలో 70 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. న్యాయవాదిగా, రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా దేశానికి ఆయన అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 1991లో పద్మ భూషణ్, 2007లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందించి గౌరవించింది. సగటు ఎత్తుతో చూపరులకు సాధారణంగా కనిపించే ఆయన తన గంభీరమైన స్వరంతో దశాబ్దాలపాటు న్యాయస్థానాల్లో వాదనలు వినిపించారు. తండ్రి ఆయనను బ్యూరోక్రాట్గా చూడాలనుకున్నా.. న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో న్యాయ వ్యవస్థను సుసంపన్నం చేసిన ప్రఖ్యాత రాజ్యాంగ న్యాయ నిపుణులు హెచ్ఎం సీర్వాయ్, నానీ పాల్కీవాలా, సోలీ సొరాబ్జీ, పరాశరణ్ల సరసన చేరారు. భారత న్యాయ చరిత్రలో అత్యున్నత న్యాయవాదిగా నిలిచారు. న్యాయస్థానాల్లో ఎంత గట్టిగా వాదనలు వినిపించేవారో బయట ప్రభుత్వాలకు వ్యతిరేకంగానూ అంతే గట్టిగా మాట్లాడిన వ్యక్తిగా నారీమన్ గుర్తింపు పొందారు. 1972లో అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులైన ఆయన 1975 జూన్ 26న దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు నిరసనగా మరుసటి రోజే రాజీనామా చేశారు. నర్మదా ప్రాజెక్టు పునరావాసం కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన అక్కడ క్రైస్తవులను వేధిస్తున్నారని తెలిసి ఆ కేసు నుంచి వైదొలిగారు. మనసుతో ఆలోచిస్తూనే హృదయంతో న్యాయం చేయాలన్నది ఆయన భావన. 1991 నుంచి 2010 వరకూ దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు నారీమన్ అధ్యక్షుడిగా పని చేశారు. 1999 నుంచి 2005 వరకూ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ‘బిఫోర్ ద మెమరీ ఫేడ్స్, ద స్టేట్ ఆఫ్ ద నేషన్, ఇండియాస్ లీగల్ సిస్టం: కెన్ ఇట్ బి సేవ్డ్?, గాడ్ సేవ్ ద హానరబుల్ సుప్రీంకోర్టు’ పుస్తకాలను నారీమన్ రచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు