చైనాతో చర్చలు.. సైన్యంలో కీలక మార్పులు

సరిహద్దుల విషయంలో భారత్‌ చురుగ్గా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖవద్ద లద్దాఖ్‌ సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు కొనసాగిస్తూనే.. భారత్‌ తన సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది.

Updated : 22 Feb 2024 06:07 IST

దిల్లీ: సరిహద్దుల విషయంలో భారత్‌ చురుగ్గా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖవద్ద లద్దాఖ్‌ సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు కొనసాగిస్తూనే.. భారత్‌ తన సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా భారత్‌, చైనా మధ్య 21వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశం జరిగింది. దీనిని చుషూల్‌-మాల్డో సరిహద్దుల్లో భారత్‌వైపు మీటింగ్‌ పాయింట్‌వద్ద నిర్వహించారు. పూర్తి స్థాయిలో బలగాల ఉపసహరణే లక్ష్యంగా ఇవి జరిగాయి. ఇరుపక్షాలు సైనిక, దౌత్య సంబంధాలను కొనసాగించేందుకు అంగీకరించాయి. ఆ సమయంలో క్షేత్ర స్థాయిలో ప్రశాంతత నెలకొనేలా చూడాలని నిర్ణయించాయి. గత చర్చల్లో దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌ వద్ద పరిష్కారం కోసం భారత్‌ ప్రతినిధులు చైనాపై ఒత్తిడి తెచ్చారు. గల్వాన్‌ ఘర్షణ తర్వాత మొదలైన కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో పలు కీలక అంశాలను పరిష్కరించారు.సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేలా భారత సైన్యంలో కీలక మార్పులు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సెంట్రల్‌ కమాండ్‌ అధీనంలో సరికొత్త కోర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిని స్వయం సత్తాక దళాల్లా తీర్చిదిద్దేలా శతఘ్ని, వైమానిక, ఇంజినీరింగ్‌ వంటి విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వీటిని 18 కోర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఒక డివిజన్‌ 3 స్వతంత్ర బ్రిగేడ్లు ఉండనున్నాయి. వీటికి వాస్తవాధీన రేఖవద్ద కొన్ని ప్రాంతాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని