చెరకు గిట్టుబాటు ధర పెంపు
చెరకు గిట్టుబాటు ధరను కేంద్రం పెంచింది. గతంతో పోలిస్తే క్వింటాల్కు రూ.25 పెంచి రూ.340 చేసింది. మహిళల రక్షణ కోసం రూ.1,179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
మహిళల రక్షణ కోసం రూ.1,179 కోట్లతో పథకం
అంతరిక్ష రంగంలోకి 100% ఎఫ్డీఐలకు అనుమతి
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
రైతులతో చర్చలకు సిద్ధమని ప్రకటన
ఈనాడు, దిల్లీ: చెరకు గిట్టుబాటు ధరను కేంద్రం పెంచింది. గతంతో పోలిస్తే క్వింటాల్కు రూ.25 పెంచి రూ.340 చేసింది. మహిళల రక్షణ కోసం రూ.1,179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గుర్రాలు, గాడిదలు, ఒంటెల పరిరక్షణను ప్రోత్సహించాలని, అంతరిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) అనుమతించాలని తీర్మానించింది. కనీస మద్దతు ధరలపై రైతులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. కేంద్ర కేబినెట్ బుధవారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమై ఈ నిర్ణయాలను తీసుకుంది. అన్నదాతల ఆందోళనతో దిల్లీ సరిహద్దు ఉద్రిక్తంగా మారిన తరుణంలో ఈ నిర్ణయాలు వెలువడటం గమనార్హం. సమావేశానంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.
- 2024-25 సీజనుకు సంబంధించి చెరకు ఎఫ్ఆర్పీ (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్) ధరను క్వింటాల్కు రూ.340గా కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2023-24తో పోలిస్తే ఇది 8% అధికం. ఈ సవరించిన ధరలు 2024 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి.
- మహిళల రక్షణ కోసం చేపట్టే అంబ్రెల్లా పథకానికి రూ.885 కోట్లను కేంద్ర హోంశాఖ తన బడ్జెట్ నుంచి అందిస్తుంది. మిగిలిన రూ.294 కోట్లను నిర్బయ నిధి ద్వారా సమకూరుస్తుంది. ఈ పథకం కింద 112 అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ 2.0ను కొనసాగిస్తారు. మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరిగే సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక దాడులకు సంబంధించిన కేసులను దర్యాప్తు, ప్రాసిక్యూట్ చేసే అధికారుల సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు చేపడతారు. అలాగే మహిళా సహాయ కేంద్రాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు.
- దేశంలో గాడిదలు, గుర్రాలు, ఒంటెల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్స్టాక్ మిషన్లో మార్పులు చేసింది. వీటి సంరక్షణ కోసం ఔత్సాహికులను ప్రోత్సహించడానికి 50% మూలధన సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, ఎఫ్సీవోలు, సెక్షన్ 8 కంపెనీలు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.50 లక్షల వరకూ ఇందులో సబ్సిడీ అందిస్తారు. గాడిదలు, గుర్రాలు, ఒంటెల సంరక్షణకు వీలుగా వీర్య కేంద్రాలు, పునరుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10కోట్ల వరకూ ఆర్థిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. పాడి పశువుల బీమా కార్యక్రమాన్నీ సరళీకరించింది. ప్రస్తుతం లబ్ధిదారులు చెల్లించాల్సిన 20, 30, 40, 50% ప్రీమియంను 15%కి తగ్గించింది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40నిష్పత్తిలో పంచుకుంటాయి. బీమా చేయదగ్గ పశువుల సంఖ్యనూ 5 నుంచి 10కి పెంచింది.
- అంతరిక్ష రంగంలో ఎఫ్డీఐ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇందులో 100% వరకూ ఎఫ్డీఐలకు అనుమతిచ్చింది.
మార్చి 3న కేంద్ర మంత్రి మండలి భేటీ
సార్వత్రిక ఎన్నికలకు మార్చి రెండో వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. దిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్లో ఈ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందు కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి