ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర
సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో చిరస్మరణీయ తీర్పుల్లో న్యాయవాదిగా ఫాలీ ఎస్ నారీమన్ ప్రముఖ పాత్ర పోషించారు.
న్యాయ వ్యవస్థలో ఫాలీ ఎస్ నారీమన్ కీలకపాత్ర
ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో చిరస్మరణీయ తీర్పుల్లో న్యాయవాదిగా ఫాలీ ఎస్ నారీమన్ ప్రముఖ పాత్ర పోషించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు లేదని 1967లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో భాగస్వామిగా ఉన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థకు ప్రాణం పోస్తూ 1993లో సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ‘సెకండ్ జడ్జెస్’ తీర్పులోనూ ఆయన భూమిక కనిపిస్తుంది. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులోనూ ఆయన పాత్ర ఉంది. ఆర్టికల్ 30కింద మైనారిటీల హక్కులను ఖరారు చేస్తూ టీఎంఏ పాయ్ ఫౌండేషన్ కేసులో 11 మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనూ ఫాలీ నారిమన్ వాదనలు నిబిడీకృతమై ఉన్నాయి. ఆయన చివరగా సుప్రీంకోర్టులో అమరావతి రైతుల తరఫున వాదనలను వినిపించారు. నారీమన్ అనేక ప్రతిష్ఠాత్మక కేసుల్లో తన వాదనలను వినిపించారు. భోపాల్ గ్యాస్ విపత్తు కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీకి అనుకూలంగా నారీమన్ వాదించారు. ఆ తర్వాత తన తప్పును అంగీకరించి నష్ట పరిహారం విషయంలో బాధితులకు, కంపెనీకి మధ్య ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల అధికరణం 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన విమర్శించారు. జయలలిత అక్రమాస్తుల కేసునూ వాదించారు.
పలువురి నివాళి
అజరామర సేవలతో అజాత శత్రువుగా పేరు పొందిన నారీమన్ మరణంపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశం గర్వించదగ్గ అత్యుత్తమ న్యాయ కోవిదులు, మేధావుల్లో నారీమన్ ఒకరు. సామాన్య పౌరులకు న్యాయం చేసేందుకు ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మరణం నన్ను ఎంతో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థలో ఒక దిగ్గజాన్ని కోల్పోవడం ఎంతో బాధిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు. నారీమన్ మృతి పట్ల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘స్వాతంత్య్రానికి ముందు, తర్వాత దేశం ఎదుర్కొన్న ఆటుపోట్లను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. చివరి శ్వాసవరకూ రాజ్యాంగ విలువలను కాపాడటానికి కట్టుబడి పని చేశారు. స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించే వ్యక్తి. న్యాయస్థానాల్లో వాదనలు, పత్రికల్లో వ్యాసాలు, బహిరంగ ప్రసంగాలు, పార్లమెంటులో ప్రసంగాలు, టీవీల్లో ఇంటర్వ్యూల ద్వారా కొన్నితరాలపాటు న్యాయవాదులతోపాటు సాధారణ ప్రజలనూ చైతన్యవంతుల్ని చేసిన మహనీయుడు. నైతిక దిగ్గజంగా ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అని జస్టిస్ ఎన్.వి.రమణ కొనియాడారు. రాజ్యాంగ పవిత్రతను నిలబెట్టేందుకు అనేక తరాల న్యాయ నిపుణులకు ఫాలీ నారీమన్ స్ఫూర్తినిచ్చారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కొనియాడారు. నారీమన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారీమన్ మరణం న్యాయ వ్యవస్థకు తీరని లోటని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సంతాపం తెలిపారు. నారీమన్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
అమరావతి రాజధాని, హైకోర్టు తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకుంటూ అమరావతి రైతులు, దళిత, మైనారిటీలు కలిసి చేసిన న్యాయ పోరాటానికి దిశా నిర్దేశం చేసి న్యాయస్థానాల్లో వారికి న్యాయం దక్కేలా చేసిన ఆ మహనీయుడి మరణం తమకు తీరని లోటని అమరావతి జేఏసీ కన్వీనర్ ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ.. నారీమన్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణంతో ఒక యుగం ముగిసిందని ఎక్స్లో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ, ప్రజా జీవితంలో ఉన్నవారి మనసుల్లో నారీమన్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు. భారత్ గొప్ప న్యాయవాదిని కోల్పోయిందని, నారీమన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు