నిరసనల్లో హింస
అన్నదాతల ఆందోళనతో పంజాబ్-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ బుధవారం యుద్ధ భూమిని తలపించింది. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, అన్నదాతలు రాళ్లు రువ్వడంలాంటి ఘటనలతో ఒక్కసారిగా హింస చెలరేగింది.
యువ రైతు మృత్యువాత
పోలీసులే చంపేశారంటున్న అన్నదాతలు
ఖనౌరీ వద్ద యుద్ధ వాతావరణం
బాష్పవాయు గోళాల ప్రయోగంతో శంభు వద్ద ఉద్రిక్తతలు
రెండు రోజులపాటు ‘దిల్లీ చలో’ నిలిపివేత
చండీగఢ్, దిల్లీ: అన్నదాతల ఆందోళనతో పంజాబ్-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ బుధవారం యుద్ధ భూమిని తలపించింది. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, అన్నదాతలు రాళ్లు రువ్వడంలాంటి ఘటనలతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో తలకు తీవ్ర గాయమై ఓ యువరైతు ప్రాణాలు వదిలాడు. పోలీసు కాల్పుల వల్లే తమ సహచరుడు మరణించాడని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఘర్షణల్లో మరో ఇద్దరు రైతులూ గాయపడ్డారు. 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. శంభు వద్ద కూడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతు నాయకులు అప్రమత్తమయ్యారు. ‘దిల్లీ చలో’ నిరసనను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తమ భవిష్యత్ కార్యాచరణను శుక్రవారం సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు. అప్పటివరకు అన్నదాతలు శంభు, ఖనౌరీ శిబిరాల్లోనే కొనసాగనున్నారు. మరోవైపు- శాంతియుతంగా సమస్యల్ని పరిష్కరించుకుందామంటూ రైతులకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించింది.
పరుగులు తీసిన రైతన్నలు
మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో ‘దిల్లీ చలో’ ఆందోళనను తలపెట్టిన అన్నదాతలు ఈ నెల 13 నుంచి పంజాబ్-హరియాణా రాష్ట్రాల సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల వద్ద వేల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. నాలుగు దఫాల చర్చలు విఫలం కావడంతో.. తమ డిమాండ్లపై బుధవారం ఉదయం 11 గంటల కల్లా స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వారు మంగళవారం డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. సర్కారు నుంచి తగిన స్పందన లేకపోవడంతో బుధవారం ‘దిల్లీ చలో’ నిరసనను పునఃప్రారంభించారు. శంభు, ఖనౌరీల్లో బహుళ అంచెల బారికేడ్లను దాటి దిల్లీ దిశగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు హరియాణా పోలీసులు పలు దఫాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో ఆ ప్రాంతాలను భారీఎత్తున పొగ కమ్మేసింది. తమను తాము కాపాడుకునేందుకు రైతన్నలు పరుగులు తీశారు. బాష్పవాయువు ప్రభావాన్ని తప్పించునేందుకు పలువురు అన్నదాతలు మాస్కులు, కళ్లద్దాలు ధరించి కనిపించారు.
రబ్బరు తూటాల ప్రయోగం!
ఖనౌరీ వద్ద ఘర్షణల్లో శుభ్కరణ్ సింగ్ అనే యువ రైతు కన్నుమూశాడు. ఆయన వయసు 21 ఏళ్లు. పంజాబ్లోని బఠిండా జిల్లావాసి. ఖనౌరీలో పోలీసులతో ఘర్షణల్లో ముగ్గురు రైతులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరైన శుభ్కరణ్ మరణించాడని రైతు నాయకులు తెలిపారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని పటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్.ఎస్.రేఖి తెలిపారు. తమ ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుభ్కరణ్ మరణించాడని చెప్పారు. ఆయన తలకు తూటా గాయాన్ని గుర్తించామన్నారు. మరిన్ని వివరాలు శవపరీక్షలో తెలుస్తాయని పేర్కొన్నారు. హరియాణా పోలీసులు తమపైకి బాష్పవాయు గోళాలతో పాటు రబ్బరు తూటాలనూ ప్రయోగించారని ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొన్న రైతులు తెలిపారు. ‘దిల్లీ చలో’ ఆందోళన ప్రారంభమయ్యాక ఘర్షణల్లో చోటుచేసుకున్న తొలి మరణం ఇదే కావడం గమనార్హం. మరోవైపు- నిరసనకారులు తమపైకి రాళ్లు రువ్వడంతో 12 మంది సిబ్బంది గాయపడ్డారని హరియాణా పోలీసులు పేర్కొన్నారు. వారు లాఠీలతోనూ దాడి చేశారన్నారు. బలగాలను చుట్టుముట్టి.. పంటవ్యర్థాలపై కారం చల్లి నిప్పంటించారని కూడా పేర్కొన్నారు. ఆ పొగ వల్ల సిబ్బందికి శ్వాస, కంటిచూపు సంబంధిత సమస్యలు తలెత్తాయని తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో హరియాణాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
శాంతంగా ఉండాలంటూ రైతు నాయకుల పిలుపు
సరిహద్దుల్లో శాంతంగా ఉండాలంటూ నిరసనకారులకు రైతు నాయకులు పిలుపునిచ్చారు. బారికేడ్లను దాటి ముందుకెళ్లొద్దంటూ యువ రైతులకు పలువురు వాలంటీర్లు (రైతుసంఘాలు నియమించినవారు) సూచిస్తుండటం శంభు, ఖనౌరీల్లో కనిపించింది. రైతు నాయకుడు జగ్జీత్సింగ్ దల్లేవాల్ శంభు వద్ద నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొన్ని విద్రోహ శక్తులు నిరసనల్లో చొరబడి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయని, వాటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ‘మీరు గెలవాలనుకుంటున్నారా? లేదా’ అని రైతులను ఉద్దేశించి ప్రశ్నించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. దిల్లీ వైపు తాము శాంతియుతంగానే సాగుతామన్నారు. ఎవరైనా ఎక్స్కేవేటర్లను తీసుకొస్తే అడ్డుకుంటామని స్పష్టంచేశారు. అన్నదాతల డిమాండ్లపై కేంద్రం కాలయాపన వ్యూహాన్ని ప్రయోగిస్తోందంటూ మండిపడ్డారు. మరో రైతు నాయకుడు శర్వాణ్సింగ్ పంధేర్ శంభు వద్ద విలేకర్లతో మాట్లాడుతూ.. ఖనౌరీలో చోటుచేసుకున్న పరిణామాలపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు. తాజా ఉద్రిక్తతలకు ప్రభుత్వానిదే బాధ్యత అని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆరోపించింది. గురువారం తమ సంఘం భేటీ కానున్నట్లు తెలిపింది. రైతు మృతిని పంజాబ్ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఘటనపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. పంజాబ్లో రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. మరోవైపు నిరసనకారులకు పంజాబ్ సర్కారు అండగా నిలుస్తోందని కేంద్రం, హరియాణా ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. తాజా పరిణామాలు పొరుగురాష్ట్రాలైన పంజాబ్-హరియాణాల మధ్య ఓ రకంగా ఉద్రిక్తతల్ని రాజేస్తున్నాయి.
మరోసారి చర్చిద్దాం రండి: కేంద్రం
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సహా అన్ని అంశాలపై మరోసారి (అయిదో దఫా) తమతో చర్చలకు రావాలని రైతులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఆహ్వానించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని వారికి విన్నవించారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల డిమాండ్లపై విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ముండా దిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ