కొవిడ్‌ వేళ ప్రధాని సాయపడ్డారు: సీజేఐ

కొవిడ్‌ సమయంలో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి అందిన మందులు తనకు ఎంతగానో ఉపకరించాయని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వెల్లడించారు.

Published : 23 Feb 2024 04:06 IST

దిల్లీ: కొవిడ్‌ సమయంలో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి అందిన మందులు తనకు ఎంతగానో ఉపకరించాయని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయుష్‌ హోలిస్టిక్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమైన దగ్గరి నుంచి ఆయుష్‌తో అనుబంధం మొదలైందన్నారు. ‘‘ప్రధాని మోదీ ఫోన్‌ చేసి...కొవిడ్‌ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనుకుంటున్నాను. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఒక వైద్యుడు. ఒకసారి మీతో మాట్లాడమని చెప్తాను. మీకు అవసరమైన మందులు పంపుతారు’’ అని చెప్పారన్నారు. ‘ఆయుష్‌ నుంచి వచ్చిన మందులు తీసుకున్నాను. తర్వాత మళ్లీ కొవిడ్‌ బారినపడినా.. నేను ఎలాంటి అల్లోపతి మందులు వేసుకోలేదు’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ వెల్లడించారు. న్యాయమూర్తులతో పాటు వారి కుటుంబాలు, సిబ్బంది అందరికీ సంపూర్ణ జీవనశైలి ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని