మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇంట్లో సీబీఐ సోదాలు

కిరు హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి కేసులో జమ్మూ కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌సహా ఆయన సన్నిహితుల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది.

Published : 23 Feb 2024 04:29 IST

దిల్లీ: కిరు హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి కేసులో జమ్మూ కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌సహా ఆయన సన్నిహితుల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచే దాదాపు 100 మంది సీబీఐ అధికారులు దిల్లీసహా 30 నగరాల్లో సోదాలు జరిపారు. దిల్లీలోని ఆర్‌కే పురం, ఏషియన్‌ గేమ్స్‌ విలేజ్‌లో మాలిక్‌తో సంబంధం ఉన్న ప్రాంగణాలతోపాటు గురుగ్రామ్‌, బాగ్‌పట్‌లలోనూ తనిఖీలు నిర్వహించారు. తన నివాసాల్లో సోదాల సందర్భంగా సత్యపాల్‌ మాలిక్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. తాను కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ‘నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవరు, సహాయకుడిని వేధిస్తున్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను రైతులకు అండగా నిలుస్తాను’ అని స్పష్టం చేశారు. రూ.2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్రాజెక్టు పనుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలొచ్చాయి. దీంతో 2022 ఏప్రిల్‌లో మాలిక్‌సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని