ఆర్థిక స్థోమత లేని ఖైదీల విడుదలకు ప్రామాణిక నిబంధనలు పాటించాలి
పూచీకత్తులు, జరిమానాలు చెల్లించలేక జైళ్లలో మగ్గుతున్న విచారణ, ఇతర ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
ఈనాడు, దిల్లీ: పూచీకత్తులు, జరిమానాలు చెల్లించలేక జైళ్లలో మగ్గుతున్న విచారణ, ఇతర ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అందులో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన ప్రామాణిక నిబంధనలను నిర్దేశించింది. పేద ఖైదీలను ఆదుకొనేందుకు కేంద్ర నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు పేద ఖైదీల విడుదలకు అవసరమైన మొత్తాన్ని సదరు నోడల్ ఏజెన్సీ నుంచి తీసుకొని సంబంధిత కోర్టుకు బదిలీచేయాలని తెలిపింది. ఈ వ్యవహారం పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, ఎస్పీ, జైలు సూపరింటెండెంట్ /డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా జడ్జి ప్రతినిధి (జైలును పర్యవేక్షించే న్యాయాధికారి)తో ప్రతి జిల్లాకు ఒక సాధికార కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సాధికార కమిటీ ప్రతి కేసుకు బెయిల్ పూచీకత్తు, జరిమానా చెల్లించడానికి ఎంత అవుతుందో లెక్కించాలని, దాని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆ మొత్తాన్ని సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఖాతా నుంచి డ్రా చేయాలని పేర్కొంది.
అలాగే రాష్ట్రస్థాయిలో హోం /జైళ్ల శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, జైళ్ల శాఖ డీజీ/ఐజీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరళ్లతో ఒక పర్యవేక్షక కమిటీ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని పరిమితులకు మించిన అంశాలకు ఈ కమిటీ ఆమోదముద్ర వేయాలని స్పష్టంచేసింది.
విచారణ ఖైదీల విడుదలకు అనుసరించాల్సిన ప్రామాణిక నిబంధనలు
- బెయిల్ వచ్చిన ఏడు రోజుల్లోపు విచారణ ఖైదీలు జైలు నుంచి విడుదల కాకపోతే జైలు అధికారులు ఆ విషయాన్ని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శికి చెప్పాలి.
- బెయిల్ పొందిన సదరు విచారణ ఖైదీకి పూచీకత్తులు సమర్పించేంత ఆర్థిక స్థోమత ఉందా? లేదా? అన్న విషయాన్ని సదరు డీఎల్ఎస్ఏ కార్యదర్శి విచారించాలి. ఇందుకోసం సదరు కార్యదర్శి పౌరసమాజ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవచ్చు. ఈ మొత్తం కసరత్తును పది రోజుల్లోపు పూర్తిచేయాలి.
- ప్రతి 2-3 వారాలకోసారి ఇలాంటి కేసుల వివరాలను డీఎల్ఎస్ఏ కార్యదర్శి జిల్లా స్థాయి సాధికార కమిటీ ముందు ఉంచాలి.
- సదరు కమిటీ ఇలాంటి కేసులను పరిశీలించిన తర్వాత పేద ఖైదీలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పూచీకత్తులు సమర్పించలేకపోతున్నారని భావిస్తే ‘సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీం’ కింద వారికి ఆర్థిక ప్రయోజనాల కోసం సిఫార్సు చేయొచ్చు. అలాంటి సమయంలో ఒక్కో ఖైదీకి రూ.40వేల వరకు సాయం చేయొచ్చు. ఈ మొత్తాన్ని డ్రా చేసి కోర్టుకు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనో, వేరే విధానం ప్రకారమో అందజేయొచ్చు.
- అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టం, ఎన్డీపీఎస్, యూఏపీఏ కేసుల్లో అరెస్ట్ అయిన వారికి ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయకూడదు.
- బెయిల్ పూచీకత్తు కింద చెల్లించాల్సిన మొత్తం రూ.40వేల కంటే ఎక్కువ ఉంటే డీఎల్ఎస్ఏ కార్యదర్శి తన విచక్షణను ఉపయోగించి ఆ మొత్తాన్ని చెల్లించవచ్చని సాధికార కమిటీకి సిఫార్సు చేయొచ్చు. లేదంటే ఆ పూచీకత్తు మొత్తాన్ని తగ్గించమని లీగల్ ఎయిడ్ న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించవచ్చు. అయితే రూ.40వేలకు మించిన మొత్తం చెల్లింపు ప్రతిపాదనకు రాష్ట్రస్థాయి పర్యవేక్షక కమిటీ ఆమోదముద్ర వేయాలి.
శిక్ష పడ్డ ఖైదీల విషయంలో...
- శిక్ష పడ్డ ఖైదీలు జరిమానా చెల్లించలేని కారణంగా జైలు నుంచి విడుదలకాలేకపోతే సదరు జైలు సూపరింటెండెంట్ ఏడు రోజుల్లోపు ఆ విషయాన్ని జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యదర్శికి తెలపాలి.
- ఆ ఖైదీ ఆర్థిక పరిస్థితులపై సదరు కార్యదర్శి ఏడు రోజుల్లోపు జిల్లా సామాజిక కార్యకర్త, ఎన్జీవో, రెవెన్యూ అధికారుల్లో ఎవరో ఒకరితో విచారించుకోవాలి.
- ఆ తర్వాత సదరు ఖైదీ విడుదల కోసం జిల్లా సాధికార కమిటీ రూ.25వేలు మంజూరు చేయాలి. ఒకవేళ చెల్లించాల్సిన జరిమానా రూ.25వేలకు మించి ఉంటే సదరు ప్రతిపాదనను రాష్ట్రస్థాయి పర్యవేక్షక కమిటీ ఆమోదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత