ఆ పిల్లలకు చట్టబద్ధత కల్పించే చట్టాలేంటి?
వైవాహిక బంధానికి వెలుపల జన్మించిన సంతానానికి చట్టబద్ధత కల్పించే చట్టం ఏమిటన్నది సుప్రీంకోర్టు శుక్రవారం తెలుసుకోగోరింది.
వివాహ బంధానికి వెలుపల జన్మించిన సంతానంపై ‘సుప్రీం’ ప్రశ్న
దిల్లీ: వైవాహిక బంధానికి వెలుపల జన్మించిన సంతానానికి చట్టబద్ధత కల్పించే చట్టం ఏమిటన్నది సుప్రీంకోర్టు శుక్రవారం తెలుసుకోగోరింది. అద్దె గర్భం (సరోగసీ) నిబంధనలు-2022, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) చట్టం-2021లోని పలు అంశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ఈ ప్రశ్న సంధించింది. సరోగసీ నిబంధనల కింద ప్రయోజనం పొందడానికి వివాహ బంధం ద్వారా గర్భధారణకు ప్రయత్నించాలంది. ‘‘వివాహ బంధం ద్వారా గర్భం ధరించాక పుట్టే సంతానాన్ని చట్టబద్ధ సంతానంగా పేర్కొంటారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం చూసినా.. చెల్లుబాటుకాని పెళ్లి అయినా జరిగి ఉండాలి. అప్పుడే ఆ సంతానానికి చట్టబద్ధత వస్తుంది. పిల్లలకు చట్టబద్ధత కల్పించే చట్టాలు ఇంకేమైనా ఉన్నాయా.. ఎవరైనా దీనిపై స్పష్టత ఇవ్వండి’’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, సరోగసీ నిబంధనలను సవాల్ చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది.
అయితే, చట్టవిరుద్ధ సంతానమనే భావనే లేదని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో అది తొలగిపోయిందని ఐశ్వర్య పేర్కొన్నారు. ఈ అంశంపై ఒక అభిప్రాయానికి వచ్చేలా కోర్టుకు తాము సహకరిస్తామని చెప్పారు. సరోగసీ అనేది సంతానం పొందడానికి చిట్టచివరి అవకాశమని పేర్కొన్నారు. జీవిత భాగస్వాముల్లో ఎవరో ఒకరికి వైద్యపరమైన ఇబ్బందులు ఉన్న సందర్భాల్లో దాత నుంచి అండం లేదా వీర్యాన్ని ఉపయోగించుకునేలా సరోగసి నిబంధనలు-2022కు మార్పులు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 21న నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో ధర్మాసనం అనేక పిటిషన్లను పరిష్కరించింది. అయితే అవివాహిత మహిళలు సరోగసీ చట్టం కింద ప్రయోజనం పొందే అంశంపై దాఖలైన పిటిషన్లను పరిష్కరించడంలేదని ధర్మాసనం తెలిపింది. దీనిపై లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఐశ్వర్యకు సూచించింది.
‘కాందీశీకుల ఆస్తులకు కేంద్రం యజమాని కాదు’
మన దేశంలో కాందీశీకులు వదిలిపెట్టి వెళ్లిన ఆస్తులకు కేంద్ర ప్రభుత్వం యజమాని కాదని, సంరక్షణ అధికారాలు మాత్రమే ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. అటువంటి ఆస్తుల యాజమాన్యాన్ని ఇతరులకు బదిలీ చేయజాలదని పేర్కొంది. ఇంటి పన్ను, నీటి పన్ను, మున్సిపల్ సెస్ తదితరాలను చెల్లించకుండా మినహాయింపు కోరలేదని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. కాందీశీకుల ఆస్తులను తమ అధీనంలో ఉంచుకున్న వ్యక్తుల నుంచి పన్ను వసూళ్లను నిలిపివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును లఖ్నవూ మున్సిపల్ కార్పొరేషన్ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
కాందీశీకులు వదిలి వెళ్లిన ఆస్తిలోని కొంత భాగంలో ‘కొహ్లీ బ్రదర్స్ కలర్ ల్యాబ్’... వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఇంటి, నీటి పన్ను వసూళ్ల కోసం నోటీసులివ్వగా ఆ వ్యాపార సంస్థ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కాందీశీకుల ఆస్తిని తన స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ దానికి యజమాని కాలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆస్తి స్వాధీన హక్కు కేంద్రానికి గానీ, కేంద్రం నియమించిన ధర్మకర్తకు కానీ సంక్రమించబోదని పేర్కొంది. ఆ ఆస్తికి పన్నుల నుంచి మినహాయింపు కోరే హక్కు కేంద్రానికి కూడా లేదని తెలిపింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!