రాజ్యాంగం సవివర పరిష్కార సూచిక కాదు
అనిశ్చితి, సందిగ్ధత నెలకొన్నప్పుడు పార్లమెంటు, సుప్రీంకోర్టు లేదా ఎన్నికల సంఘం ఆ పరిస్థితులకు అనుగుణంగా స్పందించి పనిచేసినప్పుడే ప్రజలకు రాజ్యాంగంపై గురి కుదురుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఉద్ఘాటించారు.
అదో మార్గదర్శక నమూనా మాత్రమే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యలు
ఢాకా: అనిశ్చితి, సందిగ్ధత నెలకొన్నప్పుడు పార్లమెంటు, సుప్రీంకోర్టు లేదా ఎన్నికల సంఘం ఆ పరిస్థితులకు అనుగుణంగా స్పందించి పనిచేసినప్పుడే ప్రజలకు రాజ్యాంగంపై గురి కుదురుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఉద్ఘాటించారు. శనివారం ఆయన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో రెండు రోజుల న్యాయ సదస్సు ముగింపు సమావేశంలో భాగంగా ‘దక్షిణాసియాలో వలస పాలన అనంతర రాజ్యాంగ పరిణామాలు’ అనే అంశంపై ప్రసంగించారు. రాజ్యాంగమనేది అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవడానికి సవివర పరిష్కార సూచిక కాదనీ, అది ఒక మార్గదర్శక నమూనాగానే పనిచేస్తుందని స్పష్టంచేశారు. అసలు సిసలు అధికార ప్రదాతలైన ప్రజల వద్దకు రాజ్యాంగాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వాలను, దుర్విచక్షణ రహిత సమాజాన్నీ, చట్టబద్ధ ప్రక్రియలను ప్రజలకు అందించగలిగితే న్యాయస్థానాలు తమ బాధ్యతను నెరవేర్చినట్లేనని స్పష్టంచేశారు.
భారత్, బంగ్లాదేశ్ న్యాయవ్యవస్థలు ఇంటర్నెట్ సృష్టించిన డిజిటల్ అఖాతాన్ని అధిగమించడానికి, ప్రజలందరికీ న్యాయ సేవలు అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. టెక్నాలజీ అనేది ఉన్నత వర్గాలకే పరిమితం కారాదనీ, అది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. భారత న్యాయవ్యవస్థకు ఒక టెక్నాలజీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.7,000 కోట్లు కేటాయించిందని చెప్పారు. భారత్లో.. జాతీయ న్యాయ సమాచార నిధిని ఏర్పాటు చేశామని, దేశంలోని ప్రతి కేసు వివరాలు అందులో నిక్షిప్తమవుతాయని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. సుప్రీంకోర్టు నివేదికల డిజిటల్ ప్రతులు భారత పౌరులకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనివారు కూడా కోర్టు సేవలను పొందడానికి వీలుగా అన్ని కోర్టులలో ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కూడా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్..
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!