అంతరిక్షంలోకి భారత దూతలు వీరే..!
భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
‘గగన్యాన్’ వ్యోమగాములను పరిచయం చేసిన మోదీ
ఈసారి కౌంట్డౌన్, రాకెట్ మనవే
140 కోట్ల మంది ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళతారు: ప్రధాని
తిరువనంతపురం: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. రోదసిలోకి వెళ్లనున్నారు. భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు. లేచి నిలబడి కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. వారికి ‘ఆస్ట్రోనాట్ వింగ్స్’ అమర్చారు. ఈ వ్యోమగాములు నలుగురు వ్యక్తులు కారని.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళ్లే ‘నాలుగు శక్తులు’ అని కొనియాడారు. నాలుగు దశాబ్దాల తర్వాత భారతీయుడు అంతరిక్షంలోకి పయనమవుతున్నాడని తెలిపారు. ‘‘ఈసారి కౌంట్డౌన్ మనదే.. టైమింగ్ మనదే.. రాకెట్ మనదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రాకేశ్ శర్మ 1984లో రికార్డు సృష్టించారు. అయితే ఆయన రష్యా ప్రయోగకేంద్రం నుంచి వెళ్లిన వ్యోమనౌకలో ఈ ఘనత సాధించారు.
స్వయం సమృద్ధికి తార్కాణం
గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ భాగాలను భారత్లోనే తయారుచేయడం.. అంతరిక్ష రంగంలో దేశ స్వయంసమృద్ధికి నిదర్శనమని మోదీ తెలిపారు. ‘‘శిక్షణ సమయంలో వ్యోమగాములు ఎంతో అంకితభావం ప్రదర్శించారు. యోగానూ అభ్యసించారు. సవాళ్లను అధిగమించే సత్తా, తిరుగులేని నిబద్ధతకు నిదర్శనమైన భారతీయ ‘అమృత్ తరానికి’ వీరు ప్రతినిధులు. అంతరిక్ష రంగంలో మన విజయాలు.. యువతలో శాస్త్రీయ జిజ్ఞాసను పెంచుతున్నాయి. 21వ శతాబ్దంలో అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు మన దేశానికి ఊతమిస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘చందమామ నుంచి నమూనాలను తెచ్చేందుకు మళ్లీ వ్యోమనౌకను పంపుతాం. 2035 నాటికి రోదసిలో మన అంతరిక్ష కేంద్రం సిద్ధమవుతుంది. చందమామపైకి మన రాకెట్లో వ్యోమగామిని పంపుతాం’’ అని తెలిపారు. ఈ రంగంలో భారత నారీశక్తి కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్, గగన్యాన్ వంటి మిషన్లను ఊహించుకోలేమని తెలిపారు.
అంతకుముందు ప్రధాని.. తిరువనంతపురం నుంచి అంతరిక్ష రంగానికి సంబంధించిన రూ.1,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. అందులో శ్రీహరికోటలోని పీఎస్ఎల్వీ అనుసంధాన కేంద్రం, తమిళనాడులోని మహేంద్రగిరిలో సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ, తిరువనంతపురంలోని విక్రమ్సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ట్రైసోనిక్ విండ్ టన్నెల్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఏమిటీ గగన్యాన్?
గగన్యాన్ యాత్ర 2025లో జరగనుంది. ఇందులో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. ఇందుకోసం ఎల్వీఎం-మార్క్3 రాకెట్ను ఉపయోగించనున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక సముద్రజలాల్లో ల్యాండ్ అవుతుంది. శిక్షణలో భాగంగా శారీరక దృఢత్వం, సాంకేతిక విభాగాల్లో వ్యోమగాములు పట్టు సాధించారు. ఈ యాత్ర విజయవంతమైతే మానవసహిత అంతరిక్ష యాత్రల సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
అద్భుత ప్రతిభావంతులు..
భారత తొలి అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు.. యుద్ధవిమాన పైలట్లుగా వాయుసేనలో అద్భుత ప్రతిభను చాటారు. వారికి 2 వేల నుంచి 3 వేల గంటల గగనవిహార అనుభవం ఉంది. నలుగురూ పుణెకు సమీపంలోని ఖడక్వాస్లాలో ఉన్న ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)కి ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకొని, పైలట్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీకి వెళ్లారు. అగ్రశ్రేణి యుద్ధవిమానాలైన సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29, మిగ్-21, జాగ్వార్, డోర్నియర్, హాక్ జెట్లతోపాటు డోర్నియర్, ఏఎన్-32 వంటి రవాణా విమానాలను నడిపిన అనుభవం వీరి సొంతం. ఈ నలుగురు.. 13 నెలల పాటు రష్యాలో వ్యోమగామి శిక్షణ పొందారు. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంది.
ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్: 1976లో కేరళలో జన్మించారు. ఎయిర్ఫోర్స్ అకాడమీలో అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి.. ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ దక్కించుకున్నారు. 1998 డిసెంబరులో వాయుసేనలో ఫైటర్ పైలట్గా చేరారు. 3వేల గంటల ఫ్లయింగ్ అనుభవాన్ని సాధించారు. ‘కేటగిరీ-ఏ’ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ హోదాను పొందారు. అమెరికాలోని యూఎస్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ తీసుకున్నారు.
అజిత్ కృష్ణన్: 1982లో చెన్నైలో జన్మించారు. ఎయిర్ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి బంగారు పతకం, స్వోర్డ్ ఆఫ్ ఆనర్ గెల్చుకున్నారు. శిక్షణ అనంతరం 2003 జూన్లో వాయుసేనలో ఫైటర్ పైలట్గా చేరారు. యుద్ధవిమానాల చోదకుడిగా 2,900 గంటల గగనవిహార అనుభవాన్ని గడించారు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ హోదాను సాధించారు.
అంగద్ ప్రతాప్: 1982లో ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జన్మించారు. 2004 డిసెంబరులో ఫైటర్ పైలట్గా వాయుసేనలోకి ప్రవేశించారు. దాదాపు 2వేల గంటల ఫ్లయింగ్ అనుభవం ఆయన సొంతం.
శుభాన్షు శుక్లా: 1985లో యూపీలోని లఖ్నవూలో జన్మించారు. 2006 జూన్లో ఫైటర్ విమానాల పైలట్గా చేరారు. దాదాపు 2వేల గంటల గగనవిహార అనుభవం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్