సంక్షిప్త వార్తలు (7)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియాపై నెట్ఫ్లిక్స్ రూపొందించిన ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ డాక్యుమెంటరీ సిరీస్ విడుదలకు అడ్డంకులు తొలిగాయి.
ఇంద్రాణీ డాక్యుమెంటరీపై స్టే విధించలేం
బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియాపై నెట్ఫ్లిక్స్ రూపొందించిన ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ డాక్యుమెంటరీ సిరీస్ విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఈ కేసులో విచారణ పూర్తయ్యేవరకూ డాక్యుమెంటరీ విడుదలపై స్టే విధించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది. విచారణ ప్రక్రియకు వ్యతిరేకంగా అందులో ఎలాంటి దృశ్యాలూ లేవని డాక్యుమెంటరీని ప్రత్యేకంగా వీక్షించిన ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణ కొనసాగుతున్న కేసుల గురించి మీడియాలో చర్చించడం కొత్తేమీ కాదని, వాటిపై సెన్సార్ విధించలేమని పేర్కొంది.
అతి స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం
దిల్లీ: అత్యాధునిక ‘అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ’ క్షిపణిని భారత్ తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపుర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి బుధ, గురువారాల్లో ఈ ప్రయోగ పరీక్షల్ని నిర్వహించినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అధిక వేగంతో దూసుకెళ్తున్న మానవరహిత లక్ష్యాలను ఈ క్షిపణులు కచ్చితత్వంతో ఛేదించాయని తెలిపింది.
దిల్లీలో అత్యుత్తమ వాయునాణ్యత
దిల్లీ: తొమ్మిదేళ్లలో ఈసారి ఫిబ్రవరి నెలలో దిల్లీ అత్యుత్తమ వాయు నాణ్యతను నమోదు చేసినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక వెల్లడించింది. ఈ ఫిబ్రవరిలో ఎక్కువరోజులపాటు ఈ నాణ్యత సూచీ 200 కంటే దిగువనే ఉందని తెలిపింది. దిల్లీలో ఫిబ్రవరిలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, 2013 నుంచి ఇదే అత్యధికమని తెలిపింది.
సీబీఐ విచారణకు అఖిలేశ్ గైర్హాజరు
లఖ్నవూ: అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణకు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గైర్హాజరయ్యారు. ఆ కేసులో సాక్ష్యం చెప్పేందుకు గురువారం దిల్లీలోని తమ కార్యాలయానికి రావాల్సిందిగా సీబీఐ నోటీసు జారీ చేసింది. ‘‘ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా అఖిలేశ్ విచారణకు హాజరుకాలేకపోయారు’ అని సమాజ్వాదీ వర్గాలు తెలిపాయి.
మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం 14 మంది మృతి
దిండోరి: మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్ అదుపు తప్పి లోతైన లోయలో పడిపోవడంతో 14 మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. బాధితులంతా మసుర్ఘర్గీలో జరిగిన ఓ వేడుక నుంచి అమ్హాయి దేవ్రీ గ్రామానికి తిరిగి వస్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
రైతు మరణంపై హత్య కేసు
చండీగఢ్: పంజాబ్, హరియాణా సరిహద్దులోని ఖనౌరీవద్ద ఫిబ్రవరి 21వ తేదీన జరిగిన ఘర్షణల్లో రైతు శుభకరణ్ సింగ్ మృతి చెందడంపై గురువారం పంజాబ్ ప్రభుత్వం హత్య కేసు నమోదు చేసింది. ఆ రోజున రైతులకు, భద్రతా బలగాలకు జరిగిన ఘర్షణలో బఠిండాకు చెందిన 21ఏళ్ల శుభకరణ్ చనిపోగా 12 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆందోళనల సందర్భంగా విధ్వంసానికి పాల్పడ్డ రైతుల పాస్పోర్టులను, వీసాలను రద్దు చేయించాలని హరియాణా పోలీసులు చూస్తున్నారు.
సెనెగల్లో మునిగిన బోటు
24 మంది వలస జీవుల మృతి
డాకర్(సెనెగల్): పశ్చిమాఫ్రికా దేశం సెనెగల్లో వలస జీవులు వెళ్తున్న బోటు మునిగిపోవడంతో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు గాయపడినట్లు పేర్కొన్నారు. స్పెయిన్కు వెళ్తుండగా సెయింట్ లూయిస్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి