ప్రపంచంలో మన పరపతి పెరిగింది
తమ పదేళ్ల పాలనలో భారతదేశ పరపతి అన్నివిధాలా పెరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు ముందుకు వస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.
పెట్టుబడులకు విదేశాలు ముందుకు వస్తున్నాయి
మూడో అతిపెద్ద వ్యవస్థను చేయడమే ధ్యేయం
మధ్యప్రదేశ్లో మోదీ వెల్లడి
భోపాల్: తమ పదేళ్ల పాలనలో భారతదేశ పరపతి అన్నివిధాలా పెరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు ముందుకు వస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలబెట్టే ధ్యేయంతో ఈసారి లోక్సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. గురువారం మధ్యప్రదేశ్లో రూ.17,551 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీడియో సదస్సు ద్వారా ప్రసంగించారు. తమ పాలనలో సాధించిన అభివృద్ధితో ప్రపంచదేశాలన్నీ భారత్తో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాయని చెప్పారు. భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడా ఎంతో మర్యాద పొందుతున్నారని, పెట్టుబడుల రూపంలో దేశానికి అది ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా పర్యాటక రంగం ప్రయోజనం పొందుతోందన్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల మార్కును దాటేస్తుందనే మాట ప్రతిచోటా వినిపిస్తోందని, ఇప్పుడది ప్రజా నినాదంగా మారిపోయిందని చెప్పారు.
సంప్రదాయ రంగాలను భ్రష్టు పట్టించారు
యూపీయే పదేళ్లలో 40 లక్షల హెక్టార్ల సాగుభూములకు నీరందిస్తే తాము 90 లక్షల హెక్టార్లకు ఇచ్చామని మోదీ తెలిపారు. ఆటవస్తువుల తయారీ నుంచి సంప్రదాయ రంగాలను యూపీయే సర్కారు భ్రష్టుపట్టించిందని, తాము దానిని సరిచేశామని చెప్పారు. కుటీర పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచ దేశాధినేతలకు కానుకగా ఇస్తూ తాను వాటికి ప్రచారం కల్పిస్తున్నానని వివరించారు. రాబోయే అయిదేళ్లలో మహిళల సాధికారత అనూహ్య స్థాయికి చేరుతుందని విశ్వాసం వ్యక్తపరిచారు. ప్రపంచంలో తొలిసారిగా.. భారతీయ పంచాంగం ప్రకారం పనిచేసే ‘విక్రమాదిత్య వైదిక గడియారా’న్ని ఉజ్జయిని నగరంలో ఆయన ప్రారంభించారు. రెవెన్యూ న్యాయస్థానం తీర్పులు ఈమెయిల్, వాట్సప్ ద్వారా లభ్యమయ్యేలా ‘సైబర్ తహసీల్’ ప్రాజెక్టును కూడా ఆవిష్కరించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ జయంతిని పురస్కరించుకుని మోదీ ఆయనకు నివాళులర్పించారు. నిజాయతీ, నిరాడంబర జీవితానికి ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
భారత్కు సహజ భాగస్వామి మారిషస్
భారత్ సమకూర్చిన నిధులతో మారిషస్లో నిర్మించిన వైమానిక స్థావరం, జెట్టీ, ఇతర ప్రాజెక్టులను ఆ దేశ ప్రధాని ప్రవిండ్ జగన్నాథ్తో కలిసి మోదీ ప్రారంభించారు. భారత్కు మారిషస్ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో ఎదురవుతున్న సవాళ్లపై భారత ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. తమదేశ సార్వభౌమత్వ హక్కులను వదులుకునేందుకు గానీ, భూభాగాన్ని సైనిక స్థావరంగా వాడుకునేందుకు గానీ అనుమతించేది లేదని ప్రవిండ్ స్పష్టంచేశారు.
నేడు, రేపు మరిన్ని ప్రారంభోత్సవాలు
ప్రధాని మోదీ శుక్రవారం పశ్చిమ బెంగాల్లో రూ.22,200 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనుల్ని, ఝార్ఖండ్లో రూ.35,700 కోట్ల పనుల్ని; శనివారం బిహార్లో రూ.1.83 లక్షల కోట్ల పనుల్ని ప్రారంభిస్తారు. రెండు చోట్లా బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.
వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో పీఎం కిసాన్లో కొత్తగా 90 లక్షల మంది లబ్ధి పొందినట్లు, ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు