సంక్షిప్త వార్తలు(5)
కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీతోపాటు ఇతర డిమాండ్లను పరిష్కరించే వరకూ దిల్లీ చలో ఆగబోదని, తమ తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని రైతు నేతలు తెలిపారు.
దిల్లీ చలో ఆగదు
రేపు తదుపరి కార్యాచరణ: రైతు నేతలు
చండీగఢ్: కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీతోపాటు ఇతర డిమాండ్లను పరిష్కరించే వరకూ దిల్లీ చలో ఆగబోదని, తమ తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని రైతు నేతలు తెలిపారు. శంభు, ఖనౌరీలవద్ద తమ బలాన్ని మరింత పెంచుకుంటామని, దబ్వాలీలో రైతులు ధర్నా చేస్తారని చెప్పారు. శంభు సరిహద్దు వద్ద శుక్రవారం రైతు నేతలు మంజీత్ సింగ్ రాయ్, జశ్వీందర్ సింగ్ లోంగోవాల్ మీడియాతో మాట్లాడారు. శాంతియుత నిరసనలపై కేంద్రం, హరియాణా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయని ఆరోపించారు. బాష్పవాయు గోళాలు, లాఠీఛార్జిలతో తమకు ఇబ్బంది లేదని, కానీ విష వాయువులను భద్రతా సిబ్బంది ప్రయోగిస్తున్నారని, దానివల్లే యువ రైతు శుభకరణ్ సింగ్ మరణించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో తుపాకీ గుళ్లను ప్రయోగించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. ‘మా ఆందోళన కొనసాగుతుంది. అది విజయం సాధించడం ఖాయం. మా పిల్లలను తుపాకీ గుళ్ల నుంచి కాపాడుకుంటాం’ అని స్పష్టం చేశారు.
పార్లమెంటు భద్రత విభాగ అధిపతిగా అనురాగ్ అగర్వాల్
దిల్లీ: పార్లమెంటు భద్రత విభాగ అధిపతిగా ఐపీఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన జాయింట్ సెక్రటరీ(సెక్యూరిటీ) పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు మునుపు జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించిన రఘుబీర్ లాల్ తిరిగి ఆయన కేడర్కు వెళ్లడంతో అక్టోబర్ 20 నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. అస్సాం-మేఘాలయ కేడర్కు చెందిన అనురాగ్.. 1998 బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్నారు. డిసెంబరు 13న లోక్సభలో ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి పొగగొట్టాలతో గందరగోళం సృష్టించిన తర్వాత పార్లమెంటు ప్రాంగణ భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో అనురాగ్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
లోపభూయిష్ట పట్టణీకరణతో అక్రమ నిర్మాణాలు
దిల్లీ: పట్టణీకరణ విధానాల్లో లోపాలున్నాయని, ప్రజలకు అందుబాటు ధరలకు గృహ వసతి కల్పనలో ప్రభుత్వ వైఫల్యం అక్రమ నిర్మాణాలకు దారితీస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పట్టణాలకు పెరుగుతున్న వలసలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా బలహీనవర్గాలకు గృహ వసతి కల్పించలేకపోతున్నామని గుర్తు చేసింది. దిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థకు (డీడీఏ) తన భూముల్లో 60-70 శాతం ఎక్కుడున్నాయో తెలియదని, అవన్నీ కబ్జా అయ్యాయని సుప్రీం పేర్కొంది. లఖ్నవూలోని అక్బర్నగర్లో వాణిజ్య సముదాయాలను కూల్చి వేయడంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. వాణిజ్య భవనాలతోపాటు ఇళ్లనూ కూల్చి వేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. నదీ తీరంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని, ఫిబ్రవరి 27న ప్రారంభమైన కూల్చివేత కార్యక్రమంపై స్టే ఇవ్వడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించిందని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ సుప్రీంకు వివరించారు. అయితే హైకోర్టు తన తీర్పును నిలిపి ఉంచిందని తెలియజేశారు. హైకోర్టు తీర్పు వెలువడేవరకూ కూల్చివేతను ఆపాలని సుప్రీంకోర్టు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తండ్రీకూతుళ్ల బంధాన్ని చెడగొట్టాలనుకోవడం క్రూరత్వమే: దిల్లీ హైకోర్టు
దిల్లీ: భర్తపై ద్వేషంతో తండ్రీ కూతుళ్ల బంధాన్ని దూరం చేసేలా భార్య ప్రవర్తించడం క్రూరత్వం కిందకే వస్తుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఓ కేసులో భర్తకు విడాకులు మంజూరు చేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య ఎంతటి విభేదాలున్నా అందులోకి పిల్లలను లాగకూడదని తెలిపింది. ‘‘ఒక వ్యూహంతో తన కుమార్తెతో పాటు భర్త ఇంటికి భార్య వెళ్లింది. భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు చేసింది. తండ్రిపై కుమార్తె మనసులో విషబీజాలు నాటేలా చేసింది’’ అని న్యాయస్థానం పేర్కొంది.
మన ప్రయాణానికి మరింత బలం
దేశంలో మూడు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. సాంకేతిక రంగంలో సాధికారత సాధన దిశగా మన పరివర్తనాత్మక ప్రయాణాన్ని ఈ యూనిట్లు మరింత బలోపేతం చేస్తాయి. అంతర్జాతీయ సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా భారత్ అవతరించేందుకు దోహదపడతాయి.
నరేంద్ర మోదీ
యూపీలో ఇదీ పరిస్థితి!
ఉత్తర్ప్రదేశ్లో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు ఇచ్చేవన్నీ ఆటవిక రాజ్యం గ్యారంటీలే. యూపీలోని ఐఐటీ-బీహెచ్యూ ప్రాంగణంలో ఓ మహిళపై భాజపా సభ్యులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆ రాష్ట్రంలో ఇటీవల ఓ మహిళా జడ్జి.. న్యాయం జరగక బలవన్మరణానికి పాల్పడ్డారు. పదో తరగతి పరీక్ష రాసి వస్తూ ఓ దళిత విద్యార్థిని హత్యకు గురైంది. తాజాగా ఇద్దరు అత్యాచార బాధిత బాలికలు విగతజీవులై చెట్టుకు వేలాడుతూ కనిపించారు. ఇదీ.. ఉత్తర్ప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి!
రాహుల్ గాంధీ
పదేళ్ల అన్యాయ కాలం!
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) తుది పరిష్కార క్లెయిముల తిరస్కరణ రేటు పెరిగిపోతోంది. అది 2017-18లో దాదాపు 13 శాతంగా ఉండగా, 2022-23లో 34 శాతానికి చేరుకుంది. ఇది తీవ్ర ఆందోళనకరం. గత పదేళ్ల ‘అన్యాయ కాలం’లో ఏ ఒక్క వర్గానికీ సముచిత లబ్ధి చేకూరలేదు. మహిళలకు ఉద్యోగాలు లేవు. యువతకు ఉపాధి కరవైంది. రైతుల పంటలకు తగిన ధరలు లభించడం లేదు. ఉద్యోగులు తాము కష్టపడి సంపాదించుకున్న పీఎఫ్ నిధులనూ సులువుగా పొందలేకపోతున్నారు.
జైరాం రమేశ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్