ముంబయి పేలుళ్ల కీలక సూత్రధారి మృతి

ముంబయి ఉగ్రదాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా మృతి చెందాడు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ నగరంలో అతడు గుండెపోటుతో మృతిచెందినట్లు నిఘా వర్గాలు శనివారం వెల్లడించాయి.

Published : 03 Mar 2024 06:06 IST

ఇస్లామాబాద్‌: ముంబయి ఉగ్రదాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా మృతి చెందాడు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ నగరంలో అతడు గుండెపోటుతో మృతిచెందినట్లు నిఘా వర్గాలు శనివారం వెల్లడించాయి. మల్కాన్‌వాలాలో అజామ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపాయి. 26/11 పేలుళ్లతోపాటు.. 2006లో ముంబయి రైలు పేలుళ్ల వెనుకా అతని హస్తం ఉంది. ఈ ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 800ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2008 ముంబయి తాజ్‌హోటల్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడనే కారణంగా అమెరికా అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జాబితాలో చేర్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని