సంక్షిప్త వార్తలు (6)
జైలులో ఉన్న ఆప్ నేత మనీశ్ సిసోదియా అనారోగ్యంతో ఉన్న భార్యను పరామర్శించడానికి అయిన ఖర్చును ఆయన నుంచి వసూలు చేయవద్దంటూ శనివారం దిల్లీ కోర్టు ఆదేశించింది.
ఆ ఖర్చును సిసోదియా నుంచి వసూలు చేయకండి: దిల్లీ కోర్టు
దిల్లీ: జైలులో ఉన్న ఆప్ నేత మనీశ్ సిసోదియా అనారోగ్యంతో ఉన్న భార్యను పరామర్శించడానికి అయిన ఖర్చును ఆయన నుంచి వసూలు చేయవద్దంటూ శనివారం దిల్లీ కోర్టు ఆదేశించింది. పూర్తిగా మానవతా ప్రతిపాదికన ఈ ఆదేశాలను జారీచేసినట్లు ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.నాగ్పాల్ స్పష్టంచేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను తన సొంత ఖర్చులతో వారానికోసారి పరమర్శించడానికి ఫిబ్రవరి 5 సిసోదియాకు దిల్లీకోర్టు వీలు కల్పించిన విషయం తెలిసిందే. సిసోదియా ఒక్కో పరామర్శకు రూ.40 వేలు, నెలకు రూ.2 లక్షల ఖర్చును అధికారులు చూపుతున్నారని, దీనిని సవరించాలని నిందితుని తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థనను పరిశీలించిన కోర్టు సిసోదియా పరామర్శ ఖర్చును రాష్ట్ర ఖజానా నుంచి తీసుకోవాలని స్పష్టంచేసింది. సిసోదియాతోపాటు సంజయ్సింగ్కు ఈ నెల 7 వరకు పొలీసు కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది.
అమిత్షాపై రాహుల్ అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ 13కు వాయిదా
సుల్తాన్పుర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన 2018 నాటి పరువునష్టం కేసు విచారణ ఈనెల 13కు వాయిదా పడింది. భారత్ జోడో న్యాయ్ యాత్రతో రాహుల్ బిజీగా ఉన్నారని, ఆయనకు మరికొంత సమయం కావాలంటూ ఆయన తరఫు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా కోరడంతో న్యాయస్థానం విచారణను వాయిదావేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి 20న హాజరైన రాహుల్ గాంధీకి సుల్తాన్పుర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి వాదనలు ఈ నెల 2న వింటామని చెప్పింది. 2018లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ..‘రాజకీయాల్లో స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటామని చెప్పుకునే భాజపా.. ఓ హత్య కేసులో నిందితుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది’ అని ఆరోపించారు. ఆ సమయంలో అమిత్షా భాజపా జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో రాహుల్పై భాజపా నేత విజయ్ మిశ్రా పరువునష్టం దావా వేశారు.
రెమిషన్ రద్దుపై సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో దోషుల పిటిషన్
దిల్లీ: సంచలనాత్మకమైన బిల్కిస్ బానో కేసులో ముద్దాయిలుగా ఉన్నవారిలో ఇద్దరు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. తమ శిక్షాకాలాన్ని తగ్గించడం (రెమిషన్ ఇవ్వడం) చెల్లదంటూ జనవరి 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాధేశ్యాం భగవాన్దాస్ షా, రాజూభాయ్ బాబూలాల్ సోని సవాల్ చేశారు. ఇలాంటి వివాదాలను తుది తీర్పు నిమిత్తం విస్తృత ధర్మాసనానికి నివేదించాలని 2002లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఇది ఉందని పేర్కొన్నారు. రెమిషన్కు తాము గతంలో చేసిన దరఖాస్తును పరిశీలించాలని ఒక ధర్మాసనం, శిక్ష తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్రకే తప్పితే గుజరాత్కు లేదని మరో ధర్మాసనం తీర్పు చెప్పాయన్నారు.
దక్షిణాఫ్రికాలో ఎన్ఐఏకు చిక్కిన గ్యాంగ్స్టర్
దిల్లీ: భారత్లో మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో ఒకరైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) గ్యాంగ్స్టర్ మహ్మద్ గౌస్ నియాజీ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. దక్షిణాఫ్రికాలో అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇతడు 2016లో బెంగళూరుకు చెందిన రాష్టీయ్ర స్వయంసేవక్ సంఘ్(అరెస్సెస్) నేత రుద్రేష్ను హత్య చేశాడు. అప్పటినుంచి విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. అతడి కదలికలపై నిఘా ఉంచిన గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక బృందం నియాజీ జాడను గుర్తించి ఎన్ఐఏకు సమాచారమిచ్చింది. 2016లో సంఘ్ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళుతున్న రుద్రేష్ను బెంగళూరులోని శివాజీనగర్లో దుండగులు హత్య చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ నియాజీని పట్టించినవారికి రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టయ్యారు.
ఖర్గే, జైరాం రమేశ్లకు గడ్కరీ లీగల్ నోటీసులు
నాగ్పుర్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్లకు కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు పంపారు. ఓ వీడియో ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యల్లో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురద్దేశంతో ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా గందరగోళం సృష్టించి భాజపాలో విభజన తెచ్చేలా వారి చర్య ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుంచి 24 గంటల్లో ఆ వీడియోను తొలగించి, లిఖితపూర్వంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ‘ఇప్పుడు గ్రామాల్లో సరైన రోడ్లు, తాగు నీటి సౌకర్యం, ఆసుపత్రులు, పాఠశాలలు లేవు. రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని గడ్కరీ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది.
భారత్లో తయారీపై ఉదాసీనత
‘భారత్లో తయారీ’ కలను సాకారం చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేసినట్లు భాజపా నేతలు గొప్పలు చెప్పుకొంటున్నా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. 2020 కల్లా ఆ రంగంలో 10 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైంది? కీలక రంగాల్లో ఉత్పత్తికి కేటాయించిన నిధులను కూడా ఎందుకు వినియోగించలేక పోయారు? ఇప్పటికీ చైనా నుంచి దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయి?
మల్లికార్జున ఖర్గే
మహిళా కార్మికులపై వివక్ష ఎందుకు?
అభివృద్ధి చెందు తున్న దేశాల్లో వ్యవ సాయ కార్మికుల్లో 43 శాతం మంది మహిళలే ఉన్నారు. కానీ ప్రపంచ సంపద, భూముల యాజమాన్యంలో వారి వాటా చాలా తక్కువగా ఉంది. ఈ అసమానత తొలగాలి. మహిళల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి. వారికి సంపదపై హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వాల చొరవ ఒక్కటే సరిపోదు. సమాజ దృక్పథంలోనూ మార్పు రావాలి. మహిళల సాధికారతతోనే సమగ్ర ప్రగతి సాధ్యం.
ఐరాస అభివృద్ధి కార్యక్రమం
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సూత్రాలివీ..
మిమ్మల్ని ఇతరులు బలవంతంగా మార్చక ముందే మీరే మారండి. మిమ్మల్ని మీరు బాగా తెలుసుకోవడానికి సమ యాన్ని వెచ్చించండి. ఓపిక, పట్టుదలతో పని చేయండి. గడువులోపు పని పూర్తిచేయడాన్ని అలవర్చుకోండి. మీరు ఒకటి పొందాలంటే, మరొకటి ఇవ్వాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కష్టపడి పనిచేసేవారినే అదృష్టం వరిస్తుంది. ఏ విషయాన్నైనా నేర్చుకోవాలంటే శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోండి.
హర్ష్ గోయెంకా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు