General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది.
తొలి లోక్సభ ఎన్నికల్లో సొంత పేర్లు చెప్పని మహిళా ఓటర్లు
1951-52లో ఎన్నికల కమిషన్కు ఎదురైన విచిత్ర పరిస్థితి
28 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగింపు
దిల్లీ: భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. ఓటర్ల జాబితాలు తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేర్లు చెప్పకుండా ఫలానా వ్యక్తి భార్యననో, కుమార్తెననో చెప్పసాగారు. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలే ఈ పరిస్థితికి కారణం. ఇలాంటి కేసులన్నీ బిహార్, ఉత్తర్ప్రదేశ్, మధ్య భారత్, రాజస్థాన్, వింధ్య ప్రదేశ్లలోనే ఎదురయ్యాయి. అప్పట్లో దేశంలోని మహిళా ఓటర్ల సంఖ్య 8 కోట్లు కాగా, వారిలో 28 లక్షల మంది సొంత పేర్లు చెప్పకుండా భర్తలు, తండ్రుల పేర్లు చెప్పడంతో వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారు. దానికి ముందు సొంత పేర్లు చెప్పడానికి మహిళా ఓటర్లకు నెల రోజుల వ్యవధి ఇచ్చారు. దీన్ని బిహార్లో చాలామంది సద్వినియోగం చేసుకోగా, రాజస్థాన్ మహిళలు మాత్రం పేర్లు చెప్పడానికి ముందుకురాలేదు. దీంతో అలాంటి మహిళలు మొత్తం 28 లక్షల మంది పేర్లను గడువు ముగిసిన తరవాత తొలగించారు.
నేడు పురుషులను మించి..
పితృస్వామ్య సమాజం నీడ నుంచి స్త్రీలను విముక్తం చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రాధాన్యమివ్వడం వల్లనే మహిళా ఓటర్లు సొంత పేర్లు చెప్పాలని పట్టుబట్టింది. 1950లో భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడానికి ఒక రోజు ముందు ఏర్పడిన ఎన్నికల సంఘం ఇంతవరకు 17 లోక్సభ ఎన్నికలు నిర్వహించింది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేటప్పుడు భౌగోళిక, జనవర్గ పరంగా పలు సవాళ్లను ఎదుర్కొంది. అప్పట్లో అత్యధిక జనాభా నిరక్షరాస్యులు కావడం పెద్ద సమస్య. నాడు పేరు చెప్పడానికే సంకోచించిన మహిళా ఓటర్లు నేడు పురుషులను మించి పోలింగ్లో పాల్గొంటున్నారు.
12 రాష్ట్రాల్లో ‘ఆమె’దే ఆధిక్యం
1951-52 లోక్సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ మినహా యావత్ దేశంలో 17.3 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 45 శాతం మంది మహిళా ఓటర్లే. 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 91.1 కోట్లకు చేరగా, వారిలో మహిళల సంఖ్య 43.85 కోట్లు, పురుష ఓటర్ల సంఖ్య 47.34 కోట్లు. తొలి లోక్ సభ ఎన్నికల్లో మహిళల కోసం 27,527 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 67.4 శాతం మంది ఓటర్లు పాల్గొనగా, వారిలో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువ. ఆ ఎన్నికల్లో 67.18 శాతం మంది స్త్రీలు, 67.01 శాతంమంది పురుషులు ఓటు వేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో 47.1 కోట్లమంది మహిళా ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే కాస్త ఎక్కువ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.