కుదిపేస్తున్న దిల్లీ మద్యం కుంభకోణం
మద్యం కుంభకోణం ఇప్పుడు దిల్లీ, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నికల ముంగిట భారాస ఎమ్మెల్సీ కవిత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ల అరెస్టుతో దేశం దృష్టి దీనిపైకి మళ్లింది.
ఈనాడు, దిల్లీ: మద్యం కుంభకోణం ఇప్పుడు దిల్లీ, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నికల ముంగిట భారాస ఎమ్మెల్సీ కవిత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ల అరెస్టుతో దేశం దృష్టి దీనిపైకి మళ్లింది. చిల్లర, టోకు వర్తకులు అధిక లాభాలు పొందేలా 2021-22 ఆర్థిక సంవత్సరంలో దిల్లీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తయారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై 2022 ఆగస్టు 17న సీబీఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. అందులో అప్పటి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాపై ‘అవినీతి నిరోధక చట్టం’ కింద కేసు దాఖలైంది. కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ పాయ్ ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసు నమోదుచేసింది. సిసోదియా, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపికృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ, సహాయ కమిషనర్ పంకజ్ భట్నాగర్లు కలిసి- ముడుపులు ఇచ్చిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చడానికి మద్యం విధానాన్ని రూపొందించినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ఇందులో ఎమ్మెల్సీ కవితను ప్రధాన కుట్రదారుగా చూపింది.
అనుకూలంగా చేయించుకున్నారన్న దర్యాప్తు సంస్థలు
సౌత్గ్రూప్లోని శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డిలతో కలిసి కుట్రపన్ని ఆప్ అగ్రనేతలకు ముడుపుల రూపంలో రూ.100 కోట్లు ఇచ్చి, దిల్లీ మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా తయారుచేయించుకున్నారని ఈడీ, సీబీఐలు పేర్కొన్నాయి. కేజ్రీవాల్తో కవిత ఒప్పందం చేసుకున్న తర్వాత మధ్యవర్తులు, దళారుల ద్వారా అప్పటి ఎక్సైజ్ మంత్రి సిసోదియాకు ముడుపులు ముట్టజెప్పినట్లు రిమాండ్ నివేదికలో ఈడీ పేర్కొంది. ముడుపులు ముట్టజెప్పినందుకుగాను ఆప్ నేతలు ఆమెకు మద్యం విధాన రూపకల్పనలోని అంశాలను చెప్పడంతోపాటు, అందులో ఆమెకు అనుకూలమైన నిబంధనలు పొందుపరచడానికి అంగీకరించినట్లు ఈడీ తెలిపింది. అరుణ్ పిళ్లై ద్వారా ఆమె ఇండోస్పిరిట్స్ సంస్థలో వాటా పొందడంతోపాటు, దేశంలో అతిపెద్ద మద్యం వ్యాపార సంస్థ అయిన పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన మద్యం పంపిణీ వ్యాపారంలోనూ భాగస్వామ్యం పొందారని పేర్కొంది. అది దిల్లీ మద్యం వ్యాపారంలో ఇండోస్పిరిట్స్ సంస్థకు అత్యధిక లాభాలు పొందేలా చేసిందన్నది అభియోగం. ఆప్ నేతలకు చెల్లించిన ముడుపులను వీరు లాభాల రూపంలో తిరిగి రాబట్టుకున్నారని ఈడీ చెబుతోంది.
ఖజానాకు రూ.2,873 కోట్ల నష్టం
మద్యం వ్యాపారులంతా దొడ్డిదారిలో సిండికేట్గా ఏర్పడి టోకు వర్తకులు 12%, చిల్లర వర్తకులు 185% లాభం పొందేలా విధానాన్ని రూపొందించినట్లు సీబీఐ పేర్కొంది. టోకు వర్తకులు పొందే 12% లాభాల్లో 6% మొత్తాన్ని ముడుపుల రూపంలో ఆప్ నేతలకు తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపించింది. టోకు వ్యాపారులకు 5% మార్జిన్ ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినా దాన్ని 12%కి పెంచడంవల్ల దిల్లీ ఖజానాకు రూ.581 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీబీఐ లెక్కతేల్చింది. దిల్లీలోని రిటైల్జోన్ల కేటాయింపునకు నిర్వహించిన వేలంలో రూ.7,029 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.5,037 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపింది. మద్యం విధానంలో లోపాలవల్ల ఖజానాకు మొత్తంగా రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఇప్పటివరకు 31 మంది నిందితులపై 5 ఛార్జిషీట్లు, ఆరు అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. 16 మందిని అరెస్టు చేసింది. సీబీఐ కూడా అయిదుగురిని అరెస్టు చేసింది.
కేజ్రీవాల్ వారసత్వం ఎవరికి దక్కేనో!
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆప్ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ సారథ్యాన్ని వహించేది ఎవరు, ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరు చేపడతారు అనేది చర్చనీయాంశమైంది. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారిణి అయిన కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, దిల్లీ కేబినెట్ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్ల పేర్లు వినిపిస్తున్నాయి. 2012లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కన్వీనర్గా ఉంటున్న కేజ్రీవాల్ ఇప్పటివరకు మూడుసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఒంటిచేత్తో పార్టీని నడిపించి దేశంలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీ స్థాయికి ఆప్ని తీసుకువెళ్లారు. లోక్సభ ఎన్నికల ముంగిట ఆయన అరెస్టు కావడంతో వారసత్వ పగ్గాలు కొంత సంక్లిష్టంగా మారాయి. కేసులో ఒకవేళ అరెస్టయితే కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయాలా అని గత డిసెంబరులోనే ఆప్ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. రాజీనామా అవసరం లేదని, ఎక్కడినుంచైనా ఆయనే పాలన సాగించాలని 90% మంది అభిప్రాయపడ్డారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ గత దశాబ్దకాలం నుంచి కేంద్ర సర్కారును ఢీకొంటున్నారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తోనూ పలుమార్లు ఘర్షణ పడ్డారు. ఆయనకు విశ్వసనీయంగా ఉండే సంజయ్సింగ్, సిసోదియాలు మద్యం కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నారు. సత్యేందర్ జైన్ మరో కేసులో జైలుకు వెళ్లారు.
పదవిలో ఉండగా అరెస్టయిన తొలి సీఎం
ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగా అరెస్టయిన తొలి సీఎం కేజ్రీవాల్ కావడం గమనార్హం. సీఎం పదవి నుంచి వైదొలగిన తర్వాత అరెస్టయినవారి జాబితాలో లాలూ ప్రసాద్ యాదవ్ (బిహార్), జయలలిత (తమిళనాడు), ఓం ప్రకాశ్ చౌటాలా (హరియాణా); మధు కోడా, హేమంత్ సోరెన్ (ఝార్ఖండ్) వంటి నేతలు ఉన్నారు.
లాలు ప్రసాద్ యాదవ్: 1990-1997 మధ్య బిహార్ ముఖ్యమంత్రిగా లాలు ప్రసాద్ యాదవ్ ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో ఆయనతోపాటు మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రను 2013లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. అనంతరం జైలుకు వెళ్లిన లాలు.. బెయిల్పై బయటకు వచ్చారు.
జయలలిత: 1991-2016 మధ్య పలుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కలర్ టీవీల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో 1996 డిసెంబరు 7న అరెస్టయ్యారు. అప్పుడు నెలరోజుల పాటు జైలులో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో న్యాయస్థానం ఆమెను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ఓంప్రకాశ్ చౌటాలా: 1989-2005 మధ్య హరియాణా ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో 2013లో ఆయన దోషిగా తేలడంతో పదేళ్ల శిక్ష పడింది. అనంతరం అక్రమాస్తుల కేసులో 2022లో కోర్టు ఆయనకు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది.
మధు కోడా: 2006-2008 మధ్య ఝార్ఖండ్ సీఎంగా చేసిన మధు కోడా.. మైనింగ్ కేసులో 2009లో అరెస్టయ్యారు.
హేమంత్ సోరెన్: 2013-2024 మధ్య ఝార్ఖండ్ సీఎంగా పనిచేసిన హేమంత్ సోరెన్.. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన ఈ ఏడాది జనవరి 31న అరెస్టయ్యారు. అంతకుముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో జేఎంఎం సీనియర్ నేత, చంపయీ సోరెన్ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్