చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.
ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నం
కొండలు, గుట్టలు ఎక్కి.. నదుల్లో ప్రయాణించి..
దిల్లీ: దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఏ ఒక్క ఓటరునూ వదిలిపెట్టకుండా వారు ఓటేసే అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం పోలింగ్ సిబ్బంది అడవుల్లో ప్రయాణిస్తారు.. మంచు పర్వతాలను ఎక్కుతారు.. నదులను లైఫ్ జాకెట్లతో దాటుతారు.. మైళ్లకొద్దీ కొండలు, గుట్టలపై ట్రెక్కింగ్ చేస్తారు.. ఈవీఎంలను గుర్రాలు, ఏనుగులపై తరలిస్తారు.. అది సముద్ర మట్టానికి 15,000 అడుగులకుపైగా ఎత్తులో ఉండే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రమైనా.. సముద్రంలోని దీవుల్లో ఓడల కంటెయినర్లలోనైనా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది.
94 ప్రత్యేక పోలింగ్ బూత్లు
మణిపుర్లో ఘర్షణల కారణంగా ప్రత్యేక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి కోసం ఎన్నికల సంఘం 94 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది. పునరావాస శిబిరాల్లోని దాదాపు 50,000 మంది ఈ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు.
హిమాచల్లో అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్లోని తాషీగంగ్లో ఉంది. ఇది 15,256 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామంలో 52 మంది ఓటర్లున్నారు.
హిమాచల్ ప్రదేశ్లో 10,000 నుంచి 12,000 అడుగుల ఎత్తులో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 12,000 అడుగులకుపైగా ఎత్తులో 20 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
మేఘాలయలో ఎంతో కష్టం
మేఘాలయలోని పశ్చిమ జైంతియా జిల్లాలోని కాంసింగ్ గ్రామానికి పోలింగ్ సిబ్బంది లైఫ్ జాకెట్లను ధరించి వెళ్తుంటారు. వారికి డైవర్లు సహకరిస్తుంటారు. ఈ గ్రామ ప్రజలు తమలపాకులను పండిస్తారు. సోలార్ విద్యుత్తే వారికి ఆధారం. జిల్లా కేంద్రమైన జోవాయ్కి 69 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామానికి వాహనాలు వెళ్లే అవకాశం లేదు. ఈ గ్రామానికి వెళ్లాలంటే నాటు పడవలే దిక్కు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే గంటపాటు పడవలో ప్రయాణించాలి. ఇక్కడ 35 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 20 మంది పురుషులు, 15 మంది మహిళలు.
గిర్ అడవుల్లో..
గిర్ అడవుల్లోని బనెజ్లో ప్రత్యేక పోలింగ్ స్టేషన్ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. 2007లో ఇక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు ఒకే ఒక ఓటరు ఉండేవారు. అక్కడి బనేశ్వర్ మహాదేవ్ శివాలయంలో మహంత్ హరిదాస్జీ ఉదాసీన్ ఒక్కరే ఉండేవారు. ఆయన ఒక్కరి కోసం స్థానిక అటవీశాఖ కార్యాలయంలో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసేవారు. 10 మంది పోలింగ్ సిబ్బంది వెళ్లేవారు. దీనికోసం వారు అడవిలో 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. 2019లో హరిదాస్ ఉదాసీన్ మరణించారు.
అరుణాచల్లోనూ..
అరుణాచల్ ప్రదేశ్లోని మాలోగామ్కు సమీపంలోని హయులియాంగ్లో ఒకే ఓటరు ఉంటారు. ఆమె కోసం ఎన్నికల సిబ్బంది 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అందులోనూ 39 కిలోమీటర్లు కొండల్లో నడవాలి. చైనా సరిహద్దులో ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ సోకెలా తయాంగ్ అనే 44 ఏళ్ల ఓటరు ఒక్కరే ఉంటారు. మిగిలిన వారంతా మాలోగామ్లో ఓటేసేందుకు వచ్చినా ఆమె రారు. దీంతో పోలింగ్ సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది.
ఆఫ్రికా వలసదారుల కోసం..
తూర్పు ఆఫ్రికా నుంచి 14, 17 శతాబ్దాల్లో మన దేశానికి వలస వచ్చిన సిద్దీల వారసుల కోసం సోమనాథ్ జిల్లాలోని గిర్ అడవుల్లోని తలాలా ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఇక్కడ 3,500 మంది ఓటర్లున్నారు. 17వ శతాబ్దంలో సిద్దీలు మురుద్లోని జంజీరా ద్వీపాన్ని పాలించారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా, గుజరాత్లోని జఫ్రాబాద్, కఠియవాడ్ ప్రాంతాలు వారి ఆధీనంలో ఉండేవి. జంబూర్ ప్రాంతంలో సిద్దీలు అధికంగా ఉండేవారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారి కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో సిద్దీలు స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దించారు.
- గుజరాత్కు అత్యంత పొడవైన 1,600 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ ఉండే పలు దీవుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. 2022లో అలియాబెట్లో ఈసీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 217 మంది ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేసింది.
- రాజులా నియోజకవర్గంలోని సియాల్బెట్ ద్వీపంలో 5 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. దీంతో 4,757 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటివల్ల వారు 15 కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగి రావాల్సిన అవసరం తప్పింది.
తూర్పు తీరంలో..
తూర్పు తీరంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో 9 మంది ఓటర్ల కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ను 2019లో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్లో..
2022లో ఉత్తరాఖండ్లోని ఛమోలీ జిల్లా దుమాక్, కాల్గోత్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సీఈసీ రాజీవ్ కుమార్ సందర్శించారు. ఇందుకోసం ఆయన 3 రోజుల్లో 8 కిలోమీటర్ల దూరం కొండలపై ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ఆయన ఈ ప్రాంతాల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఇచ్చే పారితోషికాన్ని రెట్టింపు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?