చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.
ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నం
కొండలు, గుట్టలు ఎక్కి.. నదుల్లో ప్రయాణించి..
దిల్లీ: దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఏ ఒక్క ఓటరునూ వదిలిపెట్టకుండా వారు ఓటేసే అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం పోలింగ్ సిబ్బంది అడవుల్లో ప్రయాణిస్తారు.. మంచు పర్వతాలను ఎక్కుతారు.. నదులను లైఫ్ జాకెట్లతో దాటుతారు.. మైళ్లకొద్దీ కొండలు, గుట్టలపై ట్రెక్కింగ్ చేస్తారు.. ఈవీఎంలను గుర్రాలు, ఏనుగులపై తరలిస్తారు.. అది సముద్ర మట్టానికి 15,000 అడుగులకుపైగా ఎత్తులో ఉండే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రమైనా.. సముద్రంలోని దీవుల్లో ఓడల కంటెయినర్లలోనైనా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది.
94 ప్రత్యేక పోలింగ్ బూత్లు
మణిపుర్లో ఘర్షణల కారణంగా ప్రత్యేక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి కోసం ఎన్నికల సంఘం 94 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది. పునరావాస శిబిరాల్లోని దాదాపు 50,000 మంది ఈ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు.
హిమాచల్లో అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్లోని తాషీగంగ్లో ఉంది. ఇది 15,256 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామంలో 52 మంది ఓటర్లున్నారు.
హిమాచల్ ప్రదేశ్లో 10,000 నుంచి 12,000 అడుగుల ఎత్తులో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 12,000 అడుగులకుపైగా ఎత్తులో 20 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
మేఘాలయలో ఎంతో కష్టం
మేఘాలయలోని పశ్చిమ జైంతియా జిల్లాలోని కాంసింగ్ గ్రామానికి పోలింగ్ సిబ్బంది లైఫ్ జాకెట్లను ధరించి వెళ్తుంటారు. వారికి డైవర్లు సహకరిస్తుంటారు. ఈ గ్రామ ప్రజలు తమలపాకులను పండిస్తారు. సోలార్ విద్యుత్తే వారికి ఆధారం. జిల్లా కేంద్రమైన జోవాయ్కి 69 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామానికి వాహనాలు వెళ్లే అవకాశం లేదు. ఈ గ్రామానికి వెళ్లాలంటే నాటు పడవలే దిక్కు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే గంటపాటు పడవలో ప్రయాణించాలి. ఇక్కడ 35 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 20 మంది పురుషులు, 15 మంది మహిళలు.
గిర్ అడవుల్లో..
గిర్ అడవుల్లోని బనెజ్లో ప్రత్యేక పోలింగ్ స్టేషన్ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. 2007లో ఇక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు ఒకే ఒక ఓటరు ఉండేవారు. అక్కడి బనేశ్వర్ మహాదేవ్ శివాలయంలో మహంత్ హరిదాస్జీ ఉదాసీన్ ఒక్కరే ఉండేవారు. ఆయన ఒక్కరి కోసం స్థానిక అటవీశాఖ కార్యాలయంలో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసేవారు. 10 మంది పోలింగ్ సిబ్బంది వెళ్లేవారు. దీనికోసం వారు అడవిలో 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. 2019లో హరిదాస్ ఉదాసీన్ మరణించారు.
అరుణాచల్లోనూ..
అరుణాచల్ ప్రదేశ్లోని మాలోగామ్కు సమీపంలోని హయులియాంగ్లో ఒకే ఓటరు ఉంటారు. ఆమె కోసం ఎన్నికల సిబ్బంది 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అందులోనూ 39 కిలోమీటర్లు కొండల్లో నడవాలి. చైనా సరిహద్దులో ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ సోకెలా తయాంగ్ అనే 44 ఏళ్ల ఓటరు ఒక్కరే ఉంటారు. మిగిలిన వారంతా మాలోగామ్లో ఓటేసేందుకు వచ్చినా ఆమె రారు. దీంతో పోలింగ్ సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది.
ఆఫ్రికా వలసదారుల కోసం..
తూర్పు ఆఫ్రికా నుంచి 14, 17 శతాబ్దాల్లో మన దేశానికి వలస వచ్చిన సిద్దీల వారసుల కోసం సోమనాథ్ జిల్లాలోని గిర్ అడవుల్లోని తలాలా ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఇక్కడ 3,500 మంది ఓటర్లున్నారు. 17వ శతాబ్దంలో సిద్దీలు మురుద్లోని జంజీరా ద్వీపాన్ని పాలించారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా, గుజరాత్లోని జఫ్రాబాద్, కఠియవాడ్ ప్రాంతాలు వారి ఆధీనంలో ఉండేవి. జంబూర్ ప్రాంతంలో సిద్దీలు అధికంగా ఉండేవారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారి కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో సిద్దీలు స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దించారు.
- గుజరాత్కు అత్యంత పొడవైన 1,600 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ ఉండే పలు దీవుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. 2022లో అలియాబెట్లో ఈసీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 217 మంది ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేసింది.
- రాజులా నియోజకవర్గంలోని సియాల్బెట్ ద్వీపంలో 5 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. దీంతో 4,757 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటివల్ల వారు 15 కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగి రావాల్సిన అవసరం తప్పింది.
తూర్పు తీరంలో..
తూర్పు తీరంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో 9 మంది ఓటర్ల కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ను 2019లో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్లో..
2022లో ఉత్తరాఖండ్లోని ఛమోలీ జిల్లా దుమాక్, కాల్గోత్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సీఈసీ రాజీవ్ కుమార్ సందర్శించారు. ఇందుకోసం ఆయన 3 రోజుల్లో 8 కిలోమీటర్ల దూరం కొండలపై ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ఆయన ఈ ప్రాంతాల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఇచ్చే పారితోషికాన్ని రెట్టింపు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్