రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు.
కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్పై సానుభూతి
దిల్లీ మంత్రి ఆతిశీ వ్యాఖ్యలు
దిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదన్న లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆతిశీ ఈ మేరకు స్పందించారు. ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా ఆయన (లెఫ్టినెంట్ గవర్నర్) మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని గుర్తు చేశారు. ఏ ఇతర అవకాశం లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీంకోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసిందన్నారు. ‘ఈడీ మీ చేతిలో ఉంది. వారికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు అయ్యే నేతలు బెయిల్ పొందలేరు. దీనికింద అందరు విపక్ష సీఎంలు అరెస్టవుతారు. అప్పుడు వారు రాజీనామా చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం.. ఇదే వారి ఫార్ములా’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ఆప్నకు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని ఆతిశీ అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం అవుతోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆప్ నేత దీపక్ సింగ్లా ఇంట్లో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించింది.
ఆప్ గోవా శాఖ అధ్యక్షుడికి ఈడీ సమన్లు
ఆప్ గోవా శాఖ అధ్యక్షుడు అమిత్ పాలేకర్తోపాటు మరికొందరు నేతలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం విధానంలో మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 28న గోవాలోని పంజిమ్లో గల తమ కార్యాలయంలో హాజరుకావాలంటూ కోరింది. 2022లో జరిగిన గోవా శాసనసభ ఎన్నికల్లో అమిత్ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ ప్రకటించింది. ఇటీవల ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రానికి అక్రమ నగదు పంపినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, తనతో సహా తమ పార్టీ నేతలంతా ఎటువంటి దర్యాప్తునెదుర్కోవడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈడీ సమన్లు జారీ కావడం విశేషం.
దిల్లీ అసెంబ్లీలో ఆప్ నేతల ఆందోళన
పసుపు రంగు టీ-షర్టులు ధరించి, కేజ్రీవాల్ మాస్కులు పెట్టుకుని దిల్లీ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్ సహా ఆప్ ఎమ్మెల్యేలంతా బుధవారం దిల్లీ అసెంబ్లీకి హాజరయ్యారు. శాసనసభ కార్యక్రమాలు ప్రారంభం కాగానే ఆప్ నేతలంతా వెల్లోకి దూసుకొచ్చారు. భాజపా నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 వరకూ శాసనసభ వాయిదాపడింది. అనంతరం భాజపా దిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు శాసనసభ వెలుపల ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తన మంత్రులకు ఉత్తర్వులు పంపిన అంశంపై దర్యాప్తు చేపట్టాలంటూ భాజపా ప్రతినిధి బృందం దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోడాకు వినతి పత్రం సమర్పించింది.
ఆందోళనకు లాయర్ల పిలుపు.. దిల్లీ హైకోర్టు ఆగ్రహం
కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ కోర్టు ప్రాంగణాల్లో ఆందోళనలకు ఆప్ న్యాయ విభాగం పిలుపునిచ్చింది. దీనిపై దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టుల్లో నిరసనలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. న్యాయస్థానాల కార్యకలాపాలను ఆపకూడదు. అలా ఎవరైనా చేస్తే అది ప్రమాదకర చర్యే. ఈ అంశంపై గురువారం విచారణ చేపడతాం’’ అని కోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ నిర్దోషి అని తేలేవరకూ న్యాయవాదులెవరూ ఆయనకు మద్దతుగా ఎటుంటి ఆందోళనలకు దిగొద్దంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో కోరింది.
అప్పుడు లాలూ-రబ్రీ.. ఇప్పుడు కేజ్రీవాల్-సునీత
దిల్లీ: మద్యం కుంభకోణంలో నిజానిజాలను తన భర్త గురువారం (మార్చి 28) కోర్టులో బయటపెట్టనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత బుధవారం చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ స్పందించారు. ‘లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు రబ్రీ దేవీ ప్రకటనలు చేసేవారు. క్రమంగా సీఎం కుర్చీని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్- సునీతా కేజ్రీవాల్ వ్యవహారం అలానే ఉంది. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరాహార దీక్షలు చేసేవారు. కానీ, ఇప్పుడు ఆయనే అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఆప్నకు చెందిన ఎంపీ, మంత్రులు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ అందరూ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న సీఎం కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. కేజ్రీవాల్కు ముఖ్యమంత్రి పదవిపై ఎంత వ్యామోహం అంటే ఆయన జైల్లో ఉండి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు’ అని అనురాగ్ ఠాకుర్ అన్నారు. కేజ్రీవాల్ కూర్చునేచోటు నుంచే సునీత వీడియో రికార్డు చేసినట్లు కనిపించిందని.. బిహార్లో రబ్రీ దేవి మాదిరిగానే సునీత కూడా మారనున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
Manipur: మణిపుర్లో మరోసారి మిలిటెంట్లు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులతో విరుచుకుపడ్డారు. -
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం