రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు.
కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్పై సానుభూతి
దిల్లీ మంత్రి ఆతిశీ వ్యాఖ్యలు
దిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదన్న లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆతిశీ ఈ మేరకు స్పందించారు. ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా ఆయన (లెఫ్టినెంట్ గవర్నర్) మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని గుర్తు చేశారు. ఏ ఇతర అవకాశం లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీంకోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసిందన్నారు. ‘ఈడీ మీ చేతిలో ఉంది. వారికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు అయ్యే నేతలు బెయిల్ పొందలేరు. దీనికింద అందరు విపక్ష సీఎంలు అరెస్టవుతారు. అప్పుడు వారు రాజీనామా చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం.. ఇదే వారి ఫార్ములా’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ఆప్నకు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని ఆతిశీ అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం అవుతోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆప్ నేత దీపక్ సింగ్లా ఇంట్లో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించింది.
ఆప్ గోవా శాఖ అధ్యక్షుడికి ఈడీ సమన్లు
ఆప్ గోవా శాఖ అధ్యక్షుడు అమిత్ పాలేకర్తోపాటు మరికొందరు నేతలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం విధానంలో మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 28న గోవాలోని పంజిమ్లో గల తమ కార్యాలయంలో హాజరుకావాలంటూ కోరింది. 2022లో జరిగిన గోవా శాసనసభ ఎన్నికల్లో అమిత్ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ ప్రకటించింది. ఇటీవల ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రానికి అక్రమ నగదు పంపినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, తనతో సహా తమ పార్టీ నేతలంతా ఎటువంటి దర్యాప్తునెదుర్కోవడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈడీ సమన్లు జారీ కావడం విశేషం.
దిల్లీ అసెంబ్లీలో ఆప్ నేతల ఆందోళన
పసుపు రంగు టీ-షర్టులు ధరించి, కేజ్రీవాల్ మాస్కులు పెట్టుకుని దిల్లీ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్ సహా ఆప్ ఎమ్మెల్యేలంతా బుధవారం దిల్లీ అసెంబ్లీకి హాజరయ్యారు. శాసనసభ కార్యక్రమాలు ప్రారంభం కాగానే ఆప్ నేతలంతా వెల్లోకి దూసుకొచ్చారు. భాజపా నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 వరకూ శాసనసభ వాయిదాపడింది. అనంతరం భాజపా దిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు శాసనసభ వెలుపల ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తన మంత్రులకు ఉత్తర్వులు పంపిన అంశంపై దర్యాప్తు చేపట్టాలంటూ భాజపా ప్రతినిధి బృందం దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోడాకు వినతి పత్రం సమర్పించింది.
ఆందోళనకు లాయర్ల పిలుపు.. దిల్లీ హైకోర్టు ఆగ్రహం
కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ కోర్టు ప్రాంగణాల్లో ఆందోళనలకు ఆప్ న్యాయ విభాగం పిలుపునిచ్చింది. దీనిపై దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టుల్లో నిరసనలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. న్యాయస్థానాల కార్యకలాపాలను ఆపకూడదు. అలా ఎవరైనా చేస్తే అది ప్రమాదకర చర్యే. ఈ అంశంపై గురువారం విచారణ చేపడతాం’’ అని కోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ నిర్దోషి అని తేలేవరకూ న్యాయవాదులెవరూ ఆయనకు మద్దతుగా ఎటుంటి ఆందోళనలకు దిగొద్దంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో కోరింది.
అప్పుడు లాలూ-రబ్రీ.. ఇప్పుడు కేజ్రీవాల్-సునీత
దిల్లీ: మద్యం కుంభకోణంలో నిజానిజాలను తన భర్త గురువారం (మార్చి 28) కోర్టులో బయటపెట్టనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత బుధవారం చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ స్పందించారు. ‘లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు రబ్రీ దేవీ ప్రకటనలు చేసేవారు. క్రమంగా సీఎం కుర్చీని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్- సునీతా కేజ్రీవాల్ వ్యవహారం అలానే ఉంది. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరాహార దీక్షలు చేసేవారు. కానీ, ఇప్పుడు ఆయనే అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఆప్నకు చెందిన ఎంపీ, మంత్రులు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ అందరూ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న సీఎం కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. కేజ్రీవాల్కు ముఖ్యమంత్రి పదవిపై ఎంత వ్యామోహం అంటే ఆయన జైల్లో ఉండి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు’ అని అనురాగ్ ఠాకుర్ అన్నారు. కేజ్రీవాల్ కూర్చునేచోటు నుంచే సునీత వీడియో రికార్డు చేసినట్లు కనిపించిందని.. బిహార్లో రబ్రీ దేవి మాదిరిగానే సునీత కూడా మారనున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి