4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఆప్ అణచివేతకు ఈడీ యత్నం
మాది అవినీతి పార్టీగా చూపాలనుకుంటున్నారు
కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్
దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తమది అవినీతి పార్టీ అన్న తప్పుడు ముసుగును దేశం ముందు ఆ దర్యాప్తు సంస్థ సృష్టిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విధానానికి సంబంధించిన కేసులో తన అరెస్టును తప్పుబట్టారు. ఒక సిట్టింగ్ సీఎంను అరెస్టు చేసేందుకు నాలుగు వాంగ్మూలాలు సరిపోతాయా అని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తును తానేమీ వ్యతిరేకించడం లేదని, కావాల్సినన్నాళ్లూ ఆ సంస్థ తనను కస్టడీలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక రౌజ్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఎదుట గురువారం స్వయంగా వాదనలు వినిపించారు. అనంతరం- కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని మరో నాలుగు రోజులపాటు కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు తిరిగి ఆయన్ను తమ ముందు హాజరుపరచాలని అధికారులను ఆదేశించింది.
ఇంకా ప్రశ్నించాల్సి ఉందన్న ఈడీ
మద్యం విధానానికి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ ఈ నెల 21న అరెస్టయ్యారు. ఆరు రోజుల కస్టడీ గడువు ముగియనుండటంతో తిరిగి గురువారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కొత్త రిమాండ్ పిటిషన్ను దాఖలు చేశారు. గత అయిదు రోజుల్లో కేజ్రీవాల్ వాంగ్మూలాలను నమోదు చేశామని, కానీ ఆయన డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో మరింత లోతుగా, మరికొందరితో కలిపి ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ను మరో ఏడు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. అనంతరం- ఏప్రిల్ 1 వరకు ఆయనకు ఈడీ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. కేసులోని ఓ సాక్షి భాజపాకు భారీగా సొమ్మును విరాళం రూపంలో అందించినట్లు కేజ్రీవాల్ ఆరోపించారని ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.
కేజ్రీవాల్ ఏం వాదించారంటే..
కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి అనుమతితో కేజ్రీవాల్ హిందీలో దాదాపు 10 నిమిషాలపాటు వాదనలు వినిపించారు. ‘‘మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఇప్పటిదాకా సీబీఐ 31 వేల పేజీలను కోర్టుకు సమర్పించింది. 294 మంది సాక్షులను విచారించింది. ఈడీ 162 మందిని ప్రశ్నించింది. 25 వేల పేజీల నివేదిక సమర్పించింది. ఈ పత్రాలు, నివేదికలన్నింటినీ కలిపి పరిశీలిస్తే.. అసలు నన్నెందుకు అరెస్టు చేశారు? నా పేరు కేవలం నాలుగు వాంగ్మూలాల్లోనే ఉంది. ఒక సిట్టింగ్ సీఎంను అరెస్టు చేసేందుకు నాలుగు స్టేట్మెంట్లు సరిపోతాయా?’’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తన పేరు ప్రస్తావన ఉన్న నాలుగు వాంగ్మూలాల గురించి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
1. సి.అరవింద్ వాంగ్మూలం
దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా వ్యక్తిగత కార్యదర్శి సి.అరవింద్ ఒక వాంగ్మూలం ఇచ్చారు. నా(కేజ్రీవాల్) అధికారిక నివాసంలో నా సమక్షంలో తనకు సిసోదియా కొన్ని పత్రాలు ఇచ్చారని ఆయన చెప్పారు. నా ఇంటికి చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు తమ కార్యదర్శులతో కలిసి వస్తుంటారు. ఎవరు ఎవరికి ఏమిస్తున్నారో నాకెలా తెలుస్తుంది?
2. మాగుంట శ్రీనివాసులరెడ్డి వాంగ్మూలం
రెండో వాంగ్మూలం.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇచ్చింది. ఆయన ఒకరోజు నా కార్యాలయానికి వచ్చి, దిల్లీలో చారిటబుల్ ట్రస్ట్ తెరవాలనుకుంటున్నట్లు చెప్పారు. భూముల అంశం మా పరిధిలోకి రాదన్నాను. 2023 ఫిబ్రవరిలో ఆయన కుమారుణ్ని ఈడీ అరెస్టు చేసింది. నాకు వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చేలా ఒత్తిడి చేసింది. ఈడీకి మాగుంట ఇచ్చిన మూడు వాంగ్మూలాల్లో ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకున్నారు.
3. మాగుంట రాఘవ వాంగ్మూలం
మరో వాంగ్మూలం మాగుంట రాఘవది. ఆయన మొత్తం ఏడు స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో ఆరు నాకు వ్యతిరేకంగా లేవు. కానీ నాకు వ్యతిరేకంగా ఏడో వాంగ్మూలం ఇచ్చిన వెంటనే రాఘవ జైలు నుంచి విడుదలయ్యారు.
4. శరత్చంద్రారెడ్డి వాంగ్మూలం
నాలుగో వాంగ్మూలం శరత్చంద్రారెడ్డిది. తన అరెస్టుకు ముందు రెండు వాంగ్మూలాల్లోగానీ, అరెస్టయ్యాక ఇచ్చిన 9 వాంగ్మూలాల్లోగానీ ఆయన నాకు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. ఆరు నెలలపాటు జైల్లో మగ్గాక.. 2023 ఏప్రిల్ 25న మరో వాంగ్మూలం ఇచ్చారు. నాకు వ్యతిరేకంగా చెప్పిన ఒకేఒక్క విషయం ఏంటంటే.. ‘విజయ్ నాయర్తో కలిసి దిల్లీ సీఎంను కలిసేందుకు వెళ్లా’ అని.
ఈడీ ప్రధాన ఉద్దేశాలు ఆ రెండే..
ఒక సిట్టింగ్ సీఎంను అరెస్టు చేసేందుకు ఈ నాలుగు వాంగ్మూలాలు సరిపోతాయా? ఆప్ రూ.100 కోట్ల ముడుపులు తీసుకుందంటూ ఈడీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాల్లేవు. ఈడీ దర్యాప్తు మొదలయ్యాకే.. మద్యం విధానానికి సంబంధించిన అసలు కుంభకోణం ప్రారంభమైంది.
‘అదంతా కేజ్రీవాల్ ఊహ’
కేజ్రీవాల్ వాదనలను అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) ఎస్.వి.రాజు తోసిపుచ్చారు. దిల్లీ సీఎం పేరును తమ వాంగ్మూలాల్లో తర్వాత ప్రస్తావించినవారంతా అందుకు కారణాలను వెల్లడించారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్న పత్రాలనే కోర్టులో ప్రవేశపెడుతున్నారన్నది కేజ్రీవాల్ ఊహేనన్నారు.
నా భర్తను వేధిస్తున్నారు..
కేజ్రీవాల్ సతీమణి సునీత ఆరోపణ
దిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన సతీమణి సునీత ఆందోళన వ్యక్తంచేశారు. ఆయనను అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. గురువారం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచేందుకు ఈడీ అధికారులు తీసుకురాగా అక్కడికి వచ్చిన సునీత విలేకర్లతో మాట్లాడారు. తన భర్త ఆరోగ్యం బాగోలేదని, చక్కెరస్థాయులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈడీ అధికారులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ దౌర్జన్యం ఎంతోకాలం సాగదని, ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. పాత ఆరోపణలనే ఆప్ పదేపదే చెబుతూ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని భాజపా అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ఆరోపించారు.
కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో మద్యం సీసాతో వచ్చిన రాఘవ్కుమార్ తివారీ అనే వ్యక్తిని దిల్లీ పోలీసులు కోర్టు వెలుపల అడ్డుకున్నారు. న్యాయవాది తరహా దుస్తుల్లో వచ్చిన ఆ వ్యక్తిని పోలీసు స్టేషన్కు తరలించి ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు