సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్కు 20 ఏళ్ల జైలు
పాలన్పుర్: మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. డ్రగ్స్ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి రాజస్థాన్కు చెందిన ఓ న్యాయవాదిని ఇరికించారని భట్పై అభియోగం. ఆ సమయంలో ఆయన బానస్కాంటా ఎస్పీగా ఉన్నారు. 1990లో జరిగిన జామ్నగర్ కస్టోడియల్ మృతి కేసులో ప్రస్తుతం సంజీవ్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఆ శిక్ష పూర్తయిన వెంటనే ప్రస్తుత శిక్ష ప్రారంభమవుతుందని న్యాయస్థానం తెలిపింది.
దీదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా నేత ఘోష్పై కేసు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని కించపరిచేలా భాజపా నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై గురువారం కేసు నమోదైంది. దుర్గాపుర్ కోర్టులో ఓ న్యాయవాది, మరో వ్యక్తి చేసిన ఫిర్యాదుల మేరకు దిలీప్ ఘోష్పై సెక్షన్ 504, 509 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి, అవమానకరమైనవి అంటూ ఘోష్కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసిన మరుసటిరోజే కేసు నమోదు కావడం గమనార్హం.
కంగనాపై సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు.. నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్కుదిల్లీ ఎల్జీ ఆదేశం
దిల్లీ: బాలీవుడ్ నటి, భాజపా లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వి.కె.సక్సేనా దృష్టిసారించారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని దిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ ఆరోరాను ఆదేశించారు. ఈ మేరకు రాజ్ నివాస్ అధికారులు గురువారం వెల్లడించారు. భాజపా నాయకురాలు బాంసురీ స్వరాజ్ చేసిన ఫిర్యాదు మేరకు ఎల్జీ ఈ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మద్యం కుంభకోణం కేసులో గోవా ఆప్ నేతల విచారణ
పణజీ: మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆప్ గోవా యూనిట్ అధ్యక్షుడు అమిత్ పాలేకర్తోపాటు మరో ముగ్గురు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై ఉన్న కేసుకు సంబంధించి పాలేకర్, రామ్రావ్ వాగ్, దత్త ప్రసాద్ నాయక్, అశోక్ నాయక్లను ఈడీ విచారణకు పిలిచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఏఎఫ్ఎస్పీఏ రద్దును నాడు వి.కె.సింగ్ అడ్డుకున్నారు: ఒమర్
సోపోర్: యూపీఏ-2 హయాంలో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) రద్దు కాకుండా నాడు సైన్యాధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత భాజపా నేత జనరల్ వి.కె.సింగ్ అడ్డుకున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.‘‘హోం మంత్రి అమిత్ షాకు ఇప్పుడు ఏఎఫ్ఎస్పీఏ గుర్తుకొచ్చింది. దాని రద్దు కోసం నేను సీఎంగా ఉన్న 2011 నుంచి పోరాడుతున్నా. నాడు వ్యతిరేకత జనరల్ వి.కె.సింగ్ నుంచే వచ్చింది. ఆయన అప్పుడు సైన్యాధిపతి. ఇప్పుడు మీ మంత్రివర్గ సహచరుడు. ఎందుకు అప్పుడు అడ్డుకున్నారో ఆయన్ని అడగండి. ఇప్పుడు మీరు ఏఎఫ్ఎస్పీఏ రద్దు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు’’ అని ఒమర్ పేర్కొన్నారు.
భారత్తో వాణిజ్య సంబంధాలు పునఃప్రారంభించం: పాక్
ఇస్లామాబాద్: భారత్తో వాణిజ్య సంబంధాలు పునఃప్రారంభించే ఆలోచన తమ దేశానికి లేదని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికారి ముంతాజ్ జహ్రా బలోచ్ స్పష్టం చేశారు. ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ భారత్తో పాకిస్థాన్ వాణిజ్యాన్ని పునరుద్ధరించే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని లండన్ పర్యటనలో భాగంగా పేర్కొన్నారు. పొరుగు దేశాల పట్ల తమ వైఖరిలో మార్పు ఉంటుందని, తమ దేశ వ్యాపారవేత్తలు భారత్తో వ్యాపారాన్ని మళ్లీ కొనసాగించాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇది జరిగిన కొన్ని రోజులకే పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయం ఈ విధంగా స్పందించడం గమనార్హం. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పాక్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
అమెరికా వైఖరి అవాంఛితం
దిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు అవాంఛితమని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. స్వతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థలు మన దేశానికి గర్వకారణమని, విదేశీ శక్తుల ప్రభావం నుంచి వాటిని రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘దేశ ఎన్నికల, చట్టపరమైన ప్రక్రియల్లో బాహ్యశక్తుల ప్రమేయం ఆమోదయోగ్యం కాదు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర నిరసన తెలియజేశాం’ అని వెల్లడించారు. దేశంలో చట్ట ప్రకారమే న్యాయప్రక్రియ నడుస్తుందన్నారు.
అరుణాచల్పై అమెరికా వ్యాఖ్యలకు చైనా అభ్యంతరం
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమేనంటూ ఇటీవల అమెరికా స్పష్టం చేయడాన్ని చైనా సైన్యం గురువారం తప్పుబట్టింది. తమ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి పరిపక్వత కలిగిన యంత్రాంగం, సమాచార సాధనాలు, చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునే సామర్థ్యం ఉన్నాయని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగమేనని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి కర్నల్ వూ కియాన్ మరోసారి పేర్కొన్నారు.
ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్ ఘనత కాదు
రచయిత గురుచరణ్ దాస్
దిల్లీ: మూడు దశాబ్దాల కిందట (1991లో) అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చారని.. కాంగ్రెస్ పార్టీకి వాటితో సంబంధం లేదని ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత గురుచరణ్ దాస్ తెలిపారు. తన పుస్తకం ‘‘ది డైలమా ఆఫ్ యాన్ ఇండియన్ లిబరల్’’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం ఉత్తినే సంస్కరణలు చేసుకొంటూపోయాం. పీవీ, మన్మోహన్ ప్రభృతులు ఈ విషయంలో సొంత పార్టీని (కాంగ్రెస్) కూడా ఒప్పించలేకపోయారు. కాబట్టి, కాంగ్రెస్కు సంస్కరణలతో సంబంధం లేదు. వాస్తవానికి పీవీతో ఆ పార్టీకి పొసగలేదు’’ అన్నారు.
గృహనిర్బంధంలో మీర్వాయిజ్!
శ్రీనగర్: హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు అంజుమన్ అకౌఫ్ జామియా మసీదు తెలిపింది. గురువారం ఆయన అలీ మసీదులో ప్రసంగం చేయాల్సి ఉందని, కానీ ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధంలో ఉంచారని ఒక ప్రకటనలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
Manipur: మణిపుర్లో మరోసారి మిలిటెంట్లు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులతో విరుచుకుపడ్డారు. -
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం