కేంద్ర మంత్రికి నామినేషన్‌ రుసుం చెల్లించిన విద్యార్థులు

లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని అత్తింగళ్‌ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్‌ బరిలో దిగారు.

Published : 30 Mar 2024 03:56 IST

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని అత్తింగళ్‌ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్‌ బరిలో దిగారు. ఆయన నామినేషన్‌ డిపాజిట్‌ సొమ్ము చెల్లించేందుకు విద్యార్థులు ముందుకు రావడం విశేషం. ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ గంగ’ ద్వారా వీరంతా సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరువనంతపురంలోని భాజపా కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈమేరకు ఎన్నికల డిపాజిట్‌ మొత్తాన్ని అందజేశారు. విద్యార్థులు చూపిన కృతజ్ఞతాభావం తనను కదిలించిందని మురళీధరన్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని