రైలు ప్రయాణికుడి సెల్ఫీతో.. డెత్ మిస్టరీ ఛేదించిన పోలీసులు
మహారాష్ట్రలోని కల్యాణ్లో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి ఫోను అపహరించేందుకు దొంగ ప్రయత్నించాడు.
ముంబయి: మహారాష్ట్రలోని కల్యాణ్లో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి ఫోను అపహరించేందుకు దొంగ ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో చిక్కి హత్యకేసు కింద అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జాహిద్ జైదీ రైలులో సెల్ఫీ వీడియో తీసుకొంటూ ఉండగా.. ఓ దొంగ ఫోను అపహరించే ప్రయత్నం చేశాడు. జాహిద్ వెంటనే అప్రమత్తం కావడంతో దొంగ పారిపోయాడు. ఈ తతంగమంతా సెల్ఫీ వీడియోలో రికార్డ్ అయింది. వైరల్గా మారిన ఈ వీడియో కల్యాణ్ రైల్వే పోలీసుల దృష్టికి వెళ్లి నిందితుణ్ని అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న ఫోను స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. ఇటీవల చోటుచేసుకున్న అనుమానాస్పద మృతికి అసలు కారణం తెలిసింది. ‘‘నిందితుణ్ని ఠాణెకు చెందిన జాదవ్గా గుర్తించాం. అతడి వద్ద ఉన్న మొబైల్ను స్విచ్చాన్ చేసి.. అది పుణెకు చెందిన ప్రభాస్ భాంగేకు చెందినదిగా గుర్తించాం. బ్యాంకు ఉద్యోగి అయిన ప్రభాస్ హోలీ కోసం పుణె నుంచి కల్యాణ్లోని తన ఇంటికి వచ్చాడు. అనంతరం మార్చి 25 అర్ధరాత్రి పుణెకు తిరిగివెళుతూ విఠల్వాడి రైల్వేస్టేషనులో రైలు నుంచి పడి మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా భావించాం. ప్రభాస్ ఫోన్ను జాదవే దొంగిలించాడు. ఆ ఫోను తిరిగి లాక్కోడానికి చేసిన ప్రయత్నంలో కదులుతున్న రైలులోంచి కిందపడి ప్రభాస్ మరణించాడు’’ అని పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.