సంక్షిప్త వార్తలు (5)
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించిన హైకోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోమవారం వెెనక్కి తీసుకున్నారు.
సుప్రీంకోర్టులో సోరెన్ పిటిషన్ ఉపసంహరణ
దిల్లీ: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించిన హైకోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోమవారం వెెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు మార్చి 2న ముగిశాయి. హైకోర్టు ఆయన అభ్యర్థనను ఫిబ్రవరి 28న నిరాకరించింది. బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే ముగిసిపోయినందున పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని హేమంత్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సోమవారం విచారణ ప్రారంభమైన వెంటనే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ సభ్యులుగా ఉన్న ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం సమ్మతించింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
23 శునక జాతుల నిషేధంపైకేంద్రానికి దిల్లీ హైకోర్టు తాఖీదు
దిల్లీ: మనుషులపై దాడిని సాకుగా చూపుతూ 23 రకాల జాతుల శునకాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి అధ్యయనం నిర్వహించకుండానే నిషేధించాలన్న నిర్ణయానికి రావడం పెంపుడు శునకాల వ్యాపారం చేస్తున్న, సంబంధిత వృత్తిలో నిమగ్నమైన వారి హక్కులను హరించడమేనని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ ఆరోపించారు. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ కేంద్రానికి నోటీసు జారీ చేశారు. ఈ పిటిషన్పై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని ఆదేశించారు. 23 రకాల శునక జాతుల పెంపకం, విక్రయాలను నిషేధించాలంటూ మార్చి 12న రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
రూ.21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు
దిల్లీ: భారత్ నుంచి రక్షణ రంగ ఎగుమతులు జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.21,083 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ రంగంలో రూ.21 వేల కోట్ల మార్కును అధిగమించడం ఇదే తొలిసారని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 32.5 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.
రైళ్లలో రాయితీల్లేక వృద్ధులపై నాలుగేళ్లలో రూ.5,875 కోట్ల భారం
స.హ.చట్ట దరఖాస్తుతో వెల్లడి
దిల్లీ: రైళ్లలో ప్రయాణించే వయోవృద్ధులకు ఇచ్చే రాయితీలను ఎత్తివేయడంతో నాలుగేళ్లలో వారు రూ.5,875 కోట్ల అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఆ మేరకు రైల్వేకు ఆదాయం పెరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన స.హ.చట్ట ఉద్యమకారుడు చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తులకు సమాధానంగా రైల్వేశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా లాక్డౌన్ తర్వాత 2020 మార్చి 20 నుంచి వయోవృద్ధుల రాయితీలను రైల్వే ఎత్తివేసింది. అంతకుముందు స్త్రీలకు 50%, పురుషులకు 40% తగ్గింపు లభించేది. 20.3.2020 నుంచి 31.1.2024 మధ్య 13 కోట్ల మంది వృద్ధులు, 9 కోట్ల మంది వృద్ధురాళ్లు, 33,700 మంది ట్రాన్స్జెండర్ వృద్ధులు రైళ్లలో ప్రయాణించి రూ.13,287 కోట్ల ఆదాయాన్ని సమకూర్చారు.
ఈసీ రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయడానికి మిగిలి ఉన్న ఏకైక ఆశాకిరణం ఎన్నికల సంఘం(ఈసీ). సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఈసీ తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రజాస్యామ్య విలువలను కాపాడే రక్షణ కవచంలా నిలవాలి. ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటేనే ఈసీ గౌరవం, ప్రతిష్ఠ చెక్కుచెదరకుండా ఉంటాయి.
అఖిలేశ్ యాదవ్
జీవితం సంఘర్షణలమయం
జీవితం సంఘర్షణలతో నిండి ఉంటుంది. మనుషులకు సాటివారితోనే కాక ప్రకృతి, సమాజం, మతం, సాంకేతికతతోనూ సంఘర్షించే వాతావరణం ఏర్పడుతుంటుంది. అంతేకాదు.. తమతో తమకే సంఘర్షణ ఎదురవుతుంటుంది. ఈ పోరాటాలకు దూరంగా ఉండటంలో కాదు, వాటికి స్పందించే తీరు, వాటిని అధిగమించి ముందుకు వెళ్లే విధానంలోనే జీవిత పరమార్థం దాగి ఉంది.
హర్ష్ గోయెంకా
తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి
విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ త్వరగా వ్యాప్తి చెందుతాయి. వాటిని అడ్డుకొనే బాధ్యత మనందరిపైనా ఉంది. వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయండి. అసత్యాలను, తప్పుడు సమాచారాన్ని గుర్తిస్తే ఇతరులను అప్రమత్తం చేయండి. వాటి ప్రభావాలపై మీ స్నేహితులకు, సన్నిహితులకు అవగాహన కల్పించండి.
ఐక్యరాజ్య సమితి
అది బలహీనతకు నిదర్శనం
రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు అమేఠీ, రాయ్బరేలీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలి. అక్కడి నుంచి పోటీ చేయకపోవడం బలహీనతకు నిదర్శనం. వారు అక్కడి నుంచి గెలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రశాంత్ భూషణ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి