రాజ్యసభతో మన్మోహన్ 33 ఏళ్ల అనుబంధానికి నేటితో తెర
రాజ్యసభ నుంచి మంగళ, బుధవారాల్లో మొత్తం 54 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ (91)తోపాటు 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు.
54 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు
దిల్లీ: రాజ్యసభ నుంచి మంగళ, బుధవారాల్లో మొత్తం 54 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ (91)తోపాటు 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో కొందరు మళ్లీ ఎగువ సభకు వచ్చే అవకాశం లేదు. రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్ మన్మోహన్సింగ్ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం బుధవారంతో ముగియనుంది. ఆర్థికవ్యవస్థలో పలు సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్సింగ్ 1991 అక్టోబరులో మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసి, 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు దేశ ప్రధానిగా సేవలందించారు. మన్మోహన్ ఖాళీ చేయనున్న స్థానంలో ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తొలిసారిగా పార్లమెంటు ఎగువసభలో అడుగుపెట్టనున్నారు.
కేంద్ర మంత్రుల్లో ధర్మేంద్ర ప్రధాన్ (విద్యాశాఖ), మన్సుఖ్ మాండవీయ (ఆరోగ్యం), పురుషోత్తం రూపాల (పశుసంవర్ధకం), రాజీవ్ చంద్రశేఖర్ (ఐటీ), వి.మురళీధరన్ (విదేశీ వ్యవహారాల సహాయమంత్రి), నారాయణ రాణె (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్), ఎల్.మురుగన్ (సమాచార ప్రసారశాఖ సహాయమంత్రి)ల రాజ్యసభ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ (పర్యావరణం), అశ్వినీ వైష్ణవ్ (రైల్వే)ల పదవీకాలం బుధవారం ముగియనుంది. ఈ 9 మందిలో అశ్వినీ వైష్ణవ్ మినహా మిగతా 8 మంది తాజా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైష్ణవ్, మురుగన్లకు రాజ్యసభ సభ్యులుగా మరో అవకాశం ఇచ్చారు. అలాగే సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు జయాబచ్చన్కు సైతం ఆ పార్టీ మరో అవకాశం ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు..
పదవీ విరమణ పొందనున్న 54 మంది రాజ్యసభ సభ్యుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఈ జాబితాలో ఉండగా.. తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర రిటైర్డ్ కానున్నారు. ఇందులో భారాసకు చెందిన వద్దిరాజు రవిచంద్ర మళ్లీ ఎన్నికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
కర్ణాటక రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోలపై దుమారం రేగడంతో.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై వేటుపడింది. -
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. -
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
నకిలీ వీడియో ఘటనపై భాజపా అగ్రనేత అమిత్ షా (Amit Shah).. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ఆ పార్టీ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. -
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)పై జరిగిన హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ హస్తం ఉందంటూ యూఎస్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. -
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: వెనుక నుంచి దాడి చేయడంపై తనకు నమ్మకం లేదని ప్రధాని మోదీ అన్నారు. బాలాకోట్పై దాడుల అనంతరం ముందుగా పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే యావత్ ప్రపంచానికి తెలియజేశామన్నారు. -
అలోక్ శుక్లాకు ప్రతిష్ఠాత్మక గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్
‘ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ సమితి’ కన్వీనర్ అలోక్ శుక్లా ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్’ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్లా గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. -
ప్రైవేటు వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా?
సందేశ్ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. -
బెయిల్ కోసం విచారణ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
తన అరెస్టు, కస్టడీని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ కోసం విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. -
‘శాస్త్ర’లో యూనివర్సిటీ డే వేడుకలు
ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను భవిష్యత్తుకు తగినట్లు తీర్చిదిద్దాలని ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ డాక్టర్ అభయ్ జెరె సూచించారు. -
ఆసుపత్రుల్లో రుసుముల నిర్ధారణపై మీ వైఖరేంటి?
ఆసుపత్రుల్లో వైద్యసేవల రుసుములను నిర్ధారించే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) రూల్స్-2012లోని 9వ నిబంధనను అమలు చేయరాదన్న పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. -
పత్రికాస్వేచ్ఛ అణచివేత ధోరణి తగదు
పత్రికాస్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్కు లేఖ రాసింది. -
భోజ్శాల సర్వేకు మరో 8వారాల గడువు
భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్ఐ)కి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇందౌర్ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. -
ఇక ఏటా పాఠ్యపుస్తకాల సవరణ
దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం పరిమితికి సవరణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం సవరించింది. కరవు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమల్లోకి వచ్చింది. -
యూజీసీ నెట్ తేదీలో మార్పు
యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. -
ఖలిస్థానీ తీవ్రవాదులను ఉపేక్షించడంపై కెనడాకు భారత్ తీవ్ర నిరసన
భారత్ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్న కెనడా తీరుపై మన విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టీవార్ట్ వీలర్ను సోమవారం పిలిపించుకుని తీవ్ర నిరసన తెలిపింది. -
కేజ్రీవాల్, ఆతిశీలపై పరువు నష్టం దావా
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రి ఆతిశీలపై సోమవారం దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. వారిద్దరూ భాజపా, ఆ పార్టీ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తాన్యా బామనీయాల్ ఎదుట కాషాయ పార్టీ దిల్లీ శాఖ మీడియా ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఫిర్యాదు దాఖలు చేశారు. -
శ్రీలంక సీతమ్మగుడికి సరయూ జలాలు
శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠకు భారత్ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు. -
చంద్రయాన్-3 ప్రయోగంలో 4 సెకన్ల జాప్యం
చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3.. ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకన్లపాటు ఆలస్యంగా బయలుదేరింది. -
బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి
అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల 22న జారీచేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం సీజేఐ ఛాంబర్లో విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది. -
నీట్-పీజీ ఇంటర్న్షిప్ కటాఫ్ పొడిగింపు సాధ్యంకాదు: సుప్రీం
ఈ ఏడాది జూన్ 23న జరిగే నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్షిప్ కటాఫ్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత