మీ క్షమాపణలను అంగీకరించలేం
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురు బాబా రామ్దేవ్, కంపెనీ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది.
అసత్య ప్రమాణాలతో అన్ని హద్దులూ దాటారు
‘పతంజలి కేసు’లో రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక
దిల్లీ: పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురు బాబా రామ్దేవ్, కంపెనీ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది. వారిద్దరి క్షమాపణల్లో నిజాయతీ కనిపించడంలేదని, వాటిని అంగీకరించబోమని స్పష్టం చేసింది. అసత్య ప్రమాణాలకు గాను తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని గట్టిగా హెచ్చరించింది. కొవిడ్కు అల్లోపతిలో నివారణ లేదని పతంజలి ప్రకటనలు వెలువరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా కళ్లు మూసుకుందని ప్రశ్నించింది. రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ వారంలోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 10న మరోసారి వారిద్దరూ న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసులో కోర్టు ధిక్కరణ చర్యల షోకాజ్ నోటీసులకు సంబంధించి రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు.
విచారణ సందర్భంగా రామ్దేవ్ బాబా బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. క్షమాపణలు చెప్పాలని, అయితే వాటిని అంగీకరించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన కేసులో గతంలో సమర్పించిన ప్రమాణ పత్రాలకు రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ కట్టుబడి ఉండలేదని ఆక్షేపించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారని, అన్ని హద్దులనూ దాటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు తెలియజేస్తూ గత నెల పతంజలి సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్పై స్పందిస్తూ.. ‘చిత్తశుద్ధి కొరవడిన క్షమాపణలను అంగీకరించలేకపోతున్నాం. అవి నమ్మశక్యంగా లేవ’ని వ్యాఖ్యానించింది. చివరిసారిగా మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయడానికి వారం గడువు ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ నెల పదో తేదీకి విచారణను వాయిదా వేసింది.
తమ సంస్థ ఉత్పత్తుల తయారీ, వాటి ప్రచారం, వాణిజ్య ప్రకటనల విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ గత ఏడాది నవంబరు 21న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ హామీ ఇచ్చింది. తమ ఔషధాల ప్రభావశీలతను వివరించడం కోసం ఇతర వైద్య విధానాలను కించపరచబోమనీ తెలిపింది. అయితే, ఆ వాగ్దానాలను పతంజలి పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఔషధాలు, సౌందర్యలేపనాలు(మేజిక్ రెమెడీస్) చట్టానికి కాలం చెల్లిందన్న ఆచార్య బాలకృష్ణ అభిప్రాయాన్ని ధర్మాసనం తిరస్కరించింది. పతంజలి ఉత్పత్తులన్నీ ఆ చట్టం పరిధిలోకే వస్తాయని స్పష్టంచేసింది. అన్నింటికన్నా చట్టమే ఉన్నతమైనదని వ్యక్తులు గ్రహించేలా చేయడమే కోర్టు ధిక్కరణ చర్యల లక్ష్యమని జస్టిస్ హిమా కోహ్లీ పేర్కొన్నారు. ఒకసారి కోర్టుకు అఫిడవిట్ సమర్పించిన తర్వాత దానిలోని అంశాలకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై జరిగిన భౌతిక దాడి సిగ్గుచేటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. -
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
ఆ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో టెండర్ దక్కాలంటే మంత్రిగారికి 1.5శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంట. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ ఈడీ కోర్టుకు వెల్లడించింది. -
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
ప్రధాని మోదీపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నా ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ