సంక్షిప్త వార్తలు
అయోధ్యలో రామ మందిరం నిర్మించడం సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలకు ఇష్టం లేదు. ప్రజల సెంటిమెంటును ప్రధాని మోదీ గౌరవించి ఆలయాన్ని నిర్మించారు.
ఎస్పీ, కాంగ్రెస్లకు రామ మందిరం ఇష్టం లేదు
ముజఫర్నగర్ (యూపీ): అయోధ్యలో రామ మందిరం నిర్మించడం సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలకు ఇష్టం లేదు. ప్రజల సెంటిమెంటును ప్రధాని మోదీ గౌరవించి ఆలయాన్ని నిర్మించారు. ఇండియా కూటమిలోని నేతలంతా కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. వారి కుంభకోణాల విలువ రూ.12 లక్షల కోట్లు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
సగం మంది జైల్లో.. సగం మంది బెయిలుపై..
జైపుర్: వారసత్వ రాజకీయాలకు ఇండియా కూటమి పెట్టింది పేరు. ఆ కూటమిలోని నేతలు అవినీతి కేసుల్లో ఇరుక్కుని సగం మంది జైల్లో సగం మంది బెయిలుపై ఉన్నారు. ‘ఇండియా’ అంటే అవినీతిపరులను రక్షించే కూటమి. ఇందులోని పార్టీల నేతలంతా కుటుంబాల నుంచే వస్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం, సంజయ్సింగ్ బెయిలుపై ఉన్నారా లేదా.. కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా జైల్లో ఉన్నారా లేదా?
భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా
అమేఠీ నుంచి రాహుల్ పారిపోయారు
పట్నా: అమేఠీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పారిపోయారు. వయనాడ్లో పోటీ చేస్తున్నారు. అక్కడా గట్టి పోటీని ఆయన ఎదుర్కొంటున్నారు. వయనాడ్లో ముస్లింలు, క్రిస్టియన్లు అధికంగా ఉన్నారనే ఆయన అక్కడకు వెళ్లారు. ధైర్యముంటే అమేఠీలో రాహుల్ పోటీ చేయాలి.
భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్
వైభవ్ గహ్లోత్ కోసం పని చేస్తా
దిల్లీ: అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ కోసం 100%ప్రచారం చేస్తా. 2004లో వచ్చిన ఫలితాలే ఈసారి వచ్చి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. గత ఎన్నికల్లోనూ వైభవ్కు టికెట్ ఇప్పించా. ఆయన తరఫున ప్రచారం చేసినా దురదృష్టవశాత్తూ ఓడిపోయారు. ఈసారి జలోర్లో ఆయన పోటీ చేస్తున్నారు. మళ్లీ ప్రచారం చేస్తా.
రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్
అవినీతిపరులను అక్కున చేర్చుకుంటున్న భాజపా
ప్రతిపక్షాలపై భాజపా ఓ వైపు అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. మరోవైపు అవినీతి మరకలు ఉన్న నేతలను చేర్చుకుంటూనే ఉంటుంది. 2014 నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది ప్రతిపక్ష నేతలు కాషాయ పార్టీలో చేరారు. వారిలో 23 మందికి శిక్ష నుంచి మినహాయింపు లభించింది!
కపిల్ సిబల్
సహాయక సిబ్బందిపై దాడులు బాధాకరం
ఇజ్రాయెల్ దాడిలో వరల్డ్ సెంట్రల్ కిచెన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరుగురు సిబ్బందితోపాటు మరొకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ఇప్పటివరకూ ఈ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయిన సహాయక సిబ్బంది సంఖ్య 196కు చేరింది. అందులో 175 మంది ఐక్యరాజ్య సమితికి చెందినవారే కావడం బాధాకరం.
ఆంటోనియో గుటెరస్
వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాం
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాం. మధుమేహంతో బాధపడే వృద్ధులు ఇన్సులిన్ కోసం నెలకు 400 డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. మేము దాన్ని 35 డాలర్లకు తగ్గించగలిగాం. 40 లక్షల మంది విద్యార్థులకు 14400 కోట్ల డాలర్ల విద్యా రుణాలను రద్దు చేశాం.
బైడెన్
సముద్రాలపై నిర్లక్ష్యం తగదు
భూమిపై ఉండే ఆక్సిజన్లో 50 శాతాన్ని సముద్రాలు ఉత్పత్తి చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల్లో 30 శాతాన్ని సముద్రాలే పీల్చుకుంటాయి. మానవాళికి ఇంతటి మేలు చేసే సముద్రాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. వాటిని కాపాడుకోకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
యునెస్కో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు