సంక్షిప్త వార్తలు (7)
మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. అన్నదాతల రుణాలను మాఫీ చేయకపోగా వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ వసూలు చేస్తూ భారం మోపుతోంది.
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. అన్నదాతల రుణాలను మాఫీ చేయకపోగా వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ వసూలు చేస్తూ భారం మోపుతోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన భాజపా.. పదేళ్ల పాలనలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కూడా కల్పించలేదు. దీంతో వ్యవసాయం భారమై భాజపా పాలనలో లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు తెస్తాం.
ప్రియాంకా గాంధీ
ఇదే నిజమైన కేరళ స్టోరీ
కేరళను లక్ష్యంగా చేసుకొని పదేపదే విద్వేషపూరిత ప్రచారాలు కొనసాగిస్తున్న తరుణంలో, వాటిని తిప్పికొట్టేలా మలయాళీలు ఒక్కటై నిజమైన కేరళ స్టోరీని చూపించారు. సౌదీ అరేబియాలో మరణ శిక్షను ఎదుర్కొంటున్న కేరళ వ్యక్తి అబ్దుల్ రహీంను జైలు నుంచి విడిపించడానికి మానవతా హృదయంతో రూ.34 కోట్ల విరాళాలు ఇచ్చారు. కేరళ ప్రజల విలువలను చాటిచెప్పిన ఈ ఘటన విభజన గోడలను బద్దలుకొట్టింది. మానవతా లక్ష్యం కోసం చేతులు కలిపిన వారందరికీ కృతజ్ఞతలు.
పినరయి విజయన్
చిన్న అడుగులతోనే పెద్ద మార్పు
మీ జీవితాన్ని క్రమంగా మార్చుకోవడానికి ఇవి పాటించండి: 1.రోజుకు 10 నిమిషాలైనా వ్యాయామం చేయండి 2.ఒక పేజీ అయినా చదవండి 3.కనీసం 30 సెకన్లు ధ్యానం చేయండి 4.ఫోన్ చూసే సమయాన్ని వీలైనంత తగ్గించండి 5. రోజూ 10 నిమిషాలు ముందుగా నిద్రలేవండి 6.భోజనంలో ఒక్క ఆరోగ్యకరమైన పదార్థాన్నైనా చేర్చండి. చిన్న అడుగులే పెద్ద మార్పునకు దారిస్తాయి.
హర్ష్ గోయెంకా
బెంగాల్ పీడీఎస్ కుంభకోణం.. రూ.150 కోట్ల ఆస్తుల జప్తు
దిల్లీ: ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్)లో అవకతవకలు, నగదు అక్రమ చలామణి కేసులో పశ్చిమబెంగాల్ ఆహారశాఖ మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్, మరో ఇద్దరికి సంబంధించిన రూ.150 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని జప్తు చేసినట్లు ఈడీ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ ముగ్గురినీ ఈడీ ఇప్పటికే అరెస్టు చేయగా ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జప్తు చేసిన ఆస్తుల్లో ఇళ్లు, హోటళ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి.
మణిపుర్లో కాల్పుల కలకలం
ఒకరికి గాయాలు
ఇంఫాల్: మణిపుర్లోని థౌబల్ జిల్లా హెయ్రోక్ గ్రామంలో సాయుధ గ్రామ వాలంటీర్లు, గుర్తు తెలియని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున దుండగులు గ్రామంపై కాల్పులకు పాల్పడగా.. సాయుధ వాలంటీర్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నింగ్థౌజమ్ జేమ్స్ సింగ్ అనే వ్యక్తికి తూటా తగిలింది. వెంటనే అతణ్ని ఇంఫాల్లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. థౌబల్ సరిహద్దులోని కాకచింగ్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రంపపు మిల్లును తగలబెట్టారు.
నామినేషన్ పత్రాలను ఏకపక్షంగా తిరస్కరించరాదు
సుప్రీంకోర్టులో పిటిషన్
దిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను చిన్నచిన్న కారణాలతో ఏకపక్షంగా తిరస్కరించే అధికారాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ల నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ దిశగా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. బిహార్లోని బాంకా లోక్సభ స్థానానికి జవహర్ కుమార్ ఝా అనే వ్యక్తి వేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇకపై విద్యార్థినులకు నెలసరి సెలవులు
పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రకటన
పంజాబ్: చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం (పీయూ) 2024-25 విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయ విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పీయూ ఉప కులపతి రేణువిగ్ ఈ ప్రతిపాదనను ఆమోదించారు. విద్యార్థినులు ఒక సెమిస్టర్కు గరిష్ఠంగా నాలుగు సెలవులు తీసుకునేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అయితే సెమిస్టర్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ లేదా ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సెలవులు మంజూరు చేయరు. రుతుక్రమ సెలవులు పొందేందుకు విద్యార్థినులు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఫారంను నింపి డిపార్టుమెంట్ ఛైర్పర్సన్ లేదా డైరెక్టర్ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలోనే మొదటిసారిగా 2023 జనవరిలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులను ప్రకటించింది. అనంతరం హైదరాబాద్లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, అస్సాంలోని గుహవాటి విశ్వవిద్యాలయం, తేజ్పుర్ విశ్వవిద్యాలయం తమ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.
కేజ్రీవాల్ ‘ఆలోచనలను’ నిర్బంధించలేరు: మాన్
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను జైల్లో పెట్టవచ్చేమో కానీ ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఆప్ చేసే ఆలోచనలు దిల్లీ, పంజాబ్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాన్.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రమాదకర మార్గంలో ప్రయాణించి.. బ్యాలెట్ సదుపాయం కల్పించి
మహారాష్ట్రలో వృద్ధుల ఓట్ల కోసం అధికారులు పాట్లు
గడ్చిరోలి: లోక్సభ ఎన్నికల్లో ఇద్దరు వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించేందుకు మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన ఎన్నికల అధికారులు సాహసమే చేశారు. మెలికలు తిరుగుతూ ఉండే ప్రమాదకరమైన అడవి మార్గం గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు. గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గానికి చెందిన కిష్టయ్య మదరబోయిన(100), కిష్టయ్య కోమెర(86)లకు ఈ సదుపాయం కల్పించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల