సంక్షిప్త వార్తలు (8)
మథురలోని శ్రీకృష్ణజన్మభూమి ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అనుమతి అమలుపై నిలుపుదల (స్టే) ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది.
మథుర షాహీ ఈద్గా మసీదులో కోర్టు పర్యవేక్షిత సర్వేపై స్టే పొడిగింపు
దిల్లీ: మథురలోని శ్రీకృష్ణజన్మభూమి ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అనుమతి అమలుపై నిలుపుదల (స్టే) ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. మసీదు తరలింపు సహా ఆ వివాదానికి సంబంధించి ఇతర కేసుల విచారణ ప్రక్రియను హైకోర్టులో కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రిపై థరూర్ వ్యాఖ్యలు ‘ఉల్లంఘనే’: ఈసీ
తిరువనంతపురం: భాజపా నేత, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగానే పరిగణిస్తున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి నిరాధారమైన, అవాంఛితమైన విమర్శలు చేయవద్దని థరూర్ను గట్టిగా హెచ్చరించింది. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై శశిథరూర్ అసత్య, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. అయితే, తాను చంద్రశేఖర్ పేరు కానీ, భాజపా పేరు కానీ ప్రస్తావించలేదన్న థరూర్ వాదనలను ఈసీ తోసిపుచ్చింది.
ఖైదీలకు సౌకర్యాల్లో వివక్ష లేదు
ఆప్ ఆరోపణలపై దిల్లీ జైళ్ల శాఖ డీజీ స్పందన
దిల్లీ: తిహాడ్ జైల్లో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, నేరస్థుడి కంటే దారుణంగా చూస్తున్నారన్న ఆప్ ఆరోపణలను దిల్లీ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్(డీజీ) సంజయ్ బనివాల్ ఖండించారు. పీటీఐ ఎడిటర్స్కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఖైదీలకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి వివక్ష లేదన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. దిల్లీ పాలనకు సంబంధించి వచ్చే వారం నుంచి ఇద్దరు మంత్రులతో కేజ్రీవాల్ భేటీ అవుతారన్న వార్తలపైనా డీజీ స్పందించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి కేవలం రెండు రకాల దస్త్రాలపైనే సంతకాలు చేయవచ్చని.. అవి న్యాయపరమైన, ఫిర్యాదులకు సంబంధించినవే ఉండాలన్నారు. రాజకీయ స్వభావం కలిగినవి ఉండకూడదని చెప్పారు. ఈ నేపథ్యంలో జైలు నుంచే కేజ్రీవాల్ తదుపరి ఆదేశాలు ఎలా ఇవ్వనున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఎన్నికల బాండ్ల పథకం రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
ఆ తీర్పును పునఃసమీక్షించాలని అభ్యర్థన
దిల్లీ: రాజకీయ పార్టీలకు అజ్ఞాతంగా నిధులు అందించే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఫిబ్రవరి 15నాటి ఈ తీర్పు ద్వారా పార్లమెంటుకున్న విశేషమైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక విధానాల పరిధిని మించి సర్వోన్నత న్యాయస్థానానికే అధికారం ఉందని స్పష్టం చేసినట్లయ్యిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేసిన వ్యక్తులకు ఆ పథకం వల్ల వారికి చట్టపరంగా కలిగిన నష్టమేమిటో గుర్తించడంలో న్యాయస్థానం విఫలమైందని పిటిషనర్, న్యాయవాది మాథ్యూస్ జె.నెడుంపర పేర్కొన్నారు.
మణిపుర్ నిరాశ్రయులకు ఓటు వేసే అవకాశం కల్పించాలని పిటిషన్
ఆలస్యంగా వచ్చారని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
దిల్లీ: జాతుల వైరంతో అట్టుడికిన మణిపుర్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకుంటున్న నిరాశ్రయులకు ఓటు వేసే సదుపాయం కల్పించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. మణిపుర్ నివాసి నౌలక్ ఖామ్సువంతంగ్ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర విచారణ జరిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, దానికి సంబంధించిన వివిధ ప్రక్రియలు ప్రారంభమైన తర్వాత చివరి నిమిషంలో పిటిషనర్ కోర్టుకు వచ్చారని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మణిపుర్లో ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలుగుతుందని అభిప్రాయపడింది. అందువల్ల ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వలేమని తెలిపింది. సుమారు 18వేల మంది మణిపుర్వాసులు నిరాశ్రయులయ్యారని, ప్రస్తుతం వారున్న రాష్ట్రాల్లో ఓటింగ్లో పాల్గొనేలా సదుపాయాలు కల్పించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.
జిల్లా కోర్టుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ల అమలుపై నోటీసులు
కేంద్రం, రాష్ట్రాలు, హైకోర్టులకు జారీచేసిన సర్వోన్నత న్యాయస్థానం
దిల్లీ: జిల్లా కోర్టుల న్యాయాధికారుల నియామకాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ల అమలుపై కేంద్రం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, హైకోర్టులకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం-2016 నిర్దేశించినట్లుగా ఈ రిజర్వేషన్లు అమలుకావడంలేదంటూ పిటిషన్ దాఖలు కాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించింది. జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ చట్ట నిబంధనలు దేశమంతటా ఒకే రీతిగా అమలయ్యేలా చూసేందుకు నిపుణుల కమిటీని నియమించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలకు సమాధానమివ్వాలని ధర్మాసనం నోటీసుల్లో ఆదేశించింది.
తల్లిదండ్రుల పేరుతో గుర్తింపును నిర్ధారించుకునే హక్కు: దిల్లీ హైకోర్టు
దిల్లీ: సొంత పేరు మీద కానీ, ఫలానా వ్యక్తి కుమార్తెగా లేక కుమారుడిగా కానీ గుర్తింపును నిర్ధారించుకునే మౌలిక హక్కు ప్రతి పౌరుడికీ ఉందని దిల్లీ హైకోర్టు ఉద్ఘాటించింది. ఒక బాలిక తండ్రి మరణించడంతో సీబీఎస్ఈ ధ్రువీకరణపత్రంలో తండ్రి పేరు బదులు బాబాయి పేరు నమోదైంది. దీనిపై వివాదం నెలకొంది. తండ్రి పేరును సరైన అక్షరాలతో ముద్రిస్తూ బాలికకు కొత్తగా 10, 12వ తరగతి మార్కుల పత్రాలను అందించాలని సీబీఎస్ఈని హైకోర్టు ఆదేశించింది. ఆధార్ తదితర అధికార పత్రాల్లో నమోదైన తండ్రి పేరులో తేడాలు ఉన్నాయని ఈ సందర్భంగా న్యాయస్థానం గమనించింది. ప్రాంతీయ భాషలోని పేరును ఆంగ్లంలోకి మార్చేటప్పుడు తేడాలు రావచ్చని పేర్కొంది. శ్రీవాస్తవ్ అనే పేరును పొరపాటున శ్రీవాస్తవగా నమోదు చేయవచ్చని వ్యాఖ్యానించింది. ఇలాంటి అంశాల్లో అతి పట్టింపు సరికాదని, ఆధార్, నివాస ధ్రువీకరణపత్రం వంటివి పరిశీలించాక పిటిషనర్ తండ్రి పేరు గురించి సందిగ్ధతకు తావు లేదని స్పష్టంచేసింది. బాలికకు కొత్తగా మార్కుల పత్రాలను అందించాలని సీబీఎస్ఈని ఆదేశించింది.
ఐటీ నోటీసులపై ఏచూరి అభ్యంతరం
నిలుపుదల చేయాలని సీఈసీకి లేఖ
దిల్లీ: కేరళలోని త్రిశ్శూర్ జిల్లా సీపీఎం కమిటీకి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నోటీసు పంపడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఇలాంటి చర్య చేపట్టడం ‘సమానావకాశాల సూత్రానికి’ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్కు లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకూ ఐటీ శాఖ నోటీసును నిలుపుదలలో ఉంచాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!