శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు

బిట్‌కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తుచేసింది.

Published : 19 Apr 2024 05:16 IST

దిల్లీ: బిట్‌కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తుచేసింది. ఇందులో జుహూలోని ఓ నివాస ఫ్లాట్‌ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు పుణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. ముంబయికి చెందిన ‘వేరియబుల్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థ 2017లో ‘గెయిన్‌ బిట్‌కాయిన్‌’పేరుతో మోసపూరిత పథకం నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, దిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయట పడడంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు, ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ సంస్థను స్థాపించేందుకు కుంభకోణం ప్రధాన సూత్రధారి అయిన అమిత్‌ భరద్వాజ్‌ నుంచి కుంద్రా 285 బిట్‌ కాయిన్లు పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చకున్నా రూ.150 కోట్ల విలువైన 285 కాయిన్లు ప్రస్తుతం రాజ్‌కుంద్రా దగ్గరే ఉన్నాయని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు