వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది.
ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు
సాధ్యం కాదన్న ఈసీ
ఈవీఎంలలోని ఓట్లతో స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై తీర్పు రిజర్వు
దిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ప్రజాబాహుళ్యంలో ఉన్న సమాచారానికి, ఎన్నికల సంఘం(ఈసీ) చెబుతున్న వివరాలకు పొంతన కుదరడంలేదని పేర్కొంది. ఈ అంతరాన్ని నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో (ఈవీఎం) నమోదైన ఓట్లను... వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం గురువారం రోజంతా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడం గురించి ఆరా తీసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్కు ముందు వాటి తనిఖీ, ఆ తర్వాత సీల్చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి కోర్టుకు హాజరైన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీతీశ్ కుమార్ వ్యాస్ ధర్మాసనానికి వివరించారు.
‘ఓటింగ్ తర్వాత ఓటరుకు వీవీప్యాట్ నుంచి వచ్చే స్లిప్పు అందజేయడం సాధ్యమవుతుందా?’ అని ధర్మాసనం ప్రశ్నించగా...అలా ఇవ్వడం వల్ల రహస్య ఓటింగ్ విధాన లక్ష్యం దెబ్బతింటుందని, పోలింగ్ కేంద్రం వెలుపలకు వెళ్లాక అది ఎంతగా దుర్వినియోగం అవుతుందో ఊహించలేమని ఎన్నికల అధికారి తెలిపారు. ‘వీవీప్యాట్ బాక్సులో నిక్షిప్తమైన స్లిప్పులు అన్నింటిని లెక్కించడానికి అధిక సమయం ఎందుకు పడుతుంది. యంత్రాల ద్వారా వేగంగా లెక్కించడం ఎందుకు సాధ్యం కాదు’ అని ధర్మాసనం ఆరా తీసింది. వీవీప్యాట్ల స్లిప్పులు పలుచటి కాగితంతో, అంటుకునేలా ఉంటాయి కనుక లెక్కించడానికి అనువుగా ఉండవని ఎన్నికల అధికారి వివరించారు. ఎన్నికల ప్రక్రియపై ఓటరు విశ్వాసాన్ని పాదుకొల్పేలా చేయాల్సిన అవసరం ఉందని, సందేహాలకు తావివ్వరాదని ధర్మాసనం తెలిపింది. అయితే, పిటిషనర్లు కోరుతున్న బ్యాలెట్ విధానానికి మళ్లడం అనేది తిరోగమన సూచనే అవుతుందని ఈసీ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎం విధానాన్ని త్యజించాయని ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సంతోష్ పాల్ తెలుపగా....విదేశాలన్నీ భారత్కన్నా ఆధునికంగా ఉన్నాయని భావించరాదంటూ ధర్మాసనం చురకలు వేసింది. ఎన్నికల సంఘం చెబుతున్న సాంకేతిక అంశాలన్నింటినీ అవగాహన చేసుకోలేకపోయినప్పటికీ ఆ సంస్థ ఇస్తున్న వివరణ ఓటరును సంతృప్తిపరిచేలా ఉందా లేదా అనేది గుర్తించాలని, మంచి ప్రయత్నం ఉంటే హర్షించాలని పిటిషనర్లకు సూచించింది. ఈవీఎంపై చిహ్నాన్ని వేలితో నొక్కిన తర్వాత వీవీప్యాట్ల వద్ద ఓటును సరిచూసుకునే సమయంలో లైటు ఎప్పుడూ వెలిగేలా ఉండాలని, ఏడు సెకన్లపాటు మాత్రమే స్లిప్పు కనిపిస్తుంది కనుక అనుమానానికి తావులేకుండా చేయాలని ప్రశాంత్ భూషణ్ సూచించారు.
వీవీప్యాట్ నుంచి బయటకు వచ్చే స్లిప్పును ఓటరు తన చేతిలోకి తీసుకుని, ఓటు సక్రమంగానే నమోదైందని గుర్తించాక తానే అక్కడి బాక్సులో వేసే ఏర్పాటు ఉండాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది నిజాం పాషా తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
‘కాసర్గోడ్ మాక్పోల్’పై ఈసీ వివరణ
ఈవీఎంల నిర్వహణపై సందేహాలను వ్యక్తంచేసిన ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్....కేరళలో జరిగిన మాక్పోల్ గురించి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘కాసర్గోడ్లో మాక్ పోలింగ్కు వినియోగించిన ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్లలోని స్లిప్పులతో సరిపోల్చగా భాజపాకు అదనంగా ఓట్లు వచ్చాయి’ అని తెలిపారు. మాక్ పోలింగ్ ఫలితాలపై వచ్చిన ఆరోపణలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీతీశ్ కుమార్ వ్యాస్ తోసిపుచ్చారు. మాక్ పోలింగ్ తర్వాత నాలుగు ఈవీఎంలు అదనంగా ఒక్కో స్లిప్పును ముద్రించాయన్నారు. అంతకుముందు వాటిని తనిఖీ చేసిన ఇంజినీర్లు స్లిప్పుల ముద్రణ పూర్తి కాకముందే ఈవీఎంలను ఆన్ చేయడం వల్ల మిగిలిన స్లిప్పులు ప్రింటయ్యాయని అందువల్ల అదనపు ఓట్లుగా కనిపించాయని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించామని, దీనికి వారు సంతృప్తి చెందారని వివరించారు. ఆ తర్వాత వెయ్యి ఓట్లు వేసి సరిచూడగా సవ్యంగానే ఉన్నట్లు తేలిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
వడగండ్ల వాన కారణంగా దిల్లీకి చేరాల్సిన విస్తారా విమానం తిరిగి భువనేశ్వర్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. -
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్.. విదేశాలకు పారిపోయాడనే వార్తల నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందించాడు. -
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
హసన సెక్స్ కుంభకోణం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. -
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
‘వందే మెట్రో’ (Vande Metro) పేరుతో సమీప నగరాల మధ్య సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
Salman Khan House Firing Case: సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
హెచ్పీజెడ్ టోకెన్ యాప్ (HPZ Token App) పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడిన కేసులో సీబీఐ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేసింది. -
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
Deepfake videos: లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి