సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది.
సిసోదియా కస్టడీ 26 వరకు పొడిగింపు
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఇప్పటికే విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో ఈడీ ఆయన్ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరుపర్చగా ఈ నెల 26 వరకు జుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో మనీశ్ సిసోదియాకు విధించిన సీబీఐ కస్టడీ సైతం 26నే ముగియనుండడం గమనార్హం. మరోవైపు 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నిధుల నిర్వహణ చేపట్టారన్న ఆరోపణలతో ఇటీవల ఈడీ అదుపులోకి తీసుకున్న చన్ప్రీత్ సింగ్కు సైతం ఈ నెల 23 వరకు జుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఈ ఎన్నికల్లో సౌత్ గ్రూప్ నుంచి రూ.వంద కోట్ల వరకు అక్రమంగా డబ్బులు చేతులు మారాయంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
పారిశ్రామిక మద్యంపై రాష్ట్రాలదే అధికారం
సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వ వాదనలు
దిల్లీ: పారిశ్రామిక మద్యంపై రాష్ట్రాలకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు విన్నవించింది. వాటిని కేంద్రం హరించజాలదని స్పష్టంచేసింది. ‘మత్తు కలిగించే మద్యం’కు విస్తృత అర్థాన్ని ఇవ్వాలని, అందులో పారిశ్రామిక మద్యాన్ని కూడా చేర్చాలని, అలాగే దాన్ని రాష్ట్రాల శాసనాధికార పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించింది. ఆల్కహాల్ కలిగిన అన్ని ద్రవాలనూ ‘మత్తు కలిగించే మద్యం’ పరిధిలోకి తీసుకురావాలని కోరింది. ‘మత్తు కలిగించే ద్రవం’ పరిధిలోకి పారిశ్రామిక మద్యం, ఆల్కహాల్ కలిగిన అన్ని ద్రవాలు వస్తాయని శాసనపరమైన చరిత్ర చెబుతోందని యూపీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దినేశ్ త్రివేది తెలిపారు. పారిశ్రామిక మద్యం ఉత్పత్తిపై నియంత్రణ అధికారం కేంద్రానికే ఉంటుందని 1997లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు 9 మంది సభ్యుల ధర్మాసనం ముందుకొచ్చాయి.
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వడపళని, న్యూస్టుడే: వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. ఈనెల 19నుంచి 30వరకు వీఐటీ వేలూరు, చెన్నై, ఏపీ(అమరావతి), భోపాల్లో పరీక్షలుంటాయని సంస్థ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 125 నగరాలతోపాటు దుబాయి, మస్కట్, ఖతార్, కువైట్, సింగపూర్, కౌలాలంపూర్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావచ్చని స్పష్టం చేసింది.
మే3న ఫలితాలు: మే 3న www.vit.ac.in వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేసి.. అదేరోజు ఆన్లైన్లో కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు. లక్షలోపు ర్యాంకున్నవారు కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోని టాపర్లు, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారికి(ఒక విద్యార్థి, ఒక విద్యార్థినికి) వందశాతం ఫీˆజు మినహాయింపు ఉంటుంది. ‘సపోర్ట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్్స’ (ఎస్టీఏఆర్ఎస్) పథకం కింద హాస్టల్ మెస్లోనూ మినహాయింపు ఉంటుందని సంస్థ పేర్కొంది.
రూ.100 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. నలుగురు నైజీరియన్ల అరెస్ట్
నొయిడా: గ్రేటర్ నొయిడాలో ఓ ఇంటి నుంచి రూ.వంద కోట్ల విలువచేసే 26 కిలోల ఎండీఎంఏ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో ఉంటున్న నలుగురు నైజీరియన్లను అరెస్టు చేసినట్లు గురువారం వెల్లడించారు. మరో రూ.50 కోట్ల విలువ చేసే ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని ఇళ్లలో విదేశీయులు డ్రగ్స్ తయారీ ల్యాబులు ఏర్పాటు చేసుకొంటున్నారని చెప్పారు.
ఆరు ఐఐటీలకు కొత్త డైరెక్టర్లు
దిల్లీ: దేశంలోని ఆరు ఐఐటీలకు గురువారం కొత్త డైరెక్టర్లు నియమితులయ్యారు. విద్యాశాఖలోని సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కాన్పుర్ ఐఐటీకి మహీంద్ర అగర్వాల్, గువాహటి ఐఐటీకి దేవేంద్ర జలిహాల్, జోధ్పుర్ ఐఐటీకి అవినాశ్ కుమార్ అగర్వాల్, ధన్బాధ్ ఐఐటీకి సుకుమార్ మిశ్ర, గోవా ఐఐటీకి డీఎస్ కట్టి, ఐఐటీ-బీహెచ్యూకు అమిత్ పాత్ర నేతృత్వం వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
హసన సెక్స్ కుంభకోణం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. -
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
‘వందే మెట్రో’ (Vande Metro) పేరుతో సమీప నగరాల మధ్య సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
Salman Khan House Firing Case: సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
హెచ్పీజెడ్ టోకెన్ యాప్ (HPZ Token App) పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడిన కేసులో సీబీఐ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేసింది. -
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
Deepfake videos: లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు.
తాజా వార్తలు (Latest News)
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు