సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది.
సిసోదియా కస్టడీ 26 వరకు పొడిగింపు
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఇప్పటికే విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో ఈడీ ఆయన్ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరుపర్చగా ఈ నెల 26 వరకు జుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో మనీశ్ సిసోదియాకు విధించిన సీబీఐ కస్టడీ సైతం 26నే ముగియనుండడం గమనార్హం. మరోవైపు 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నిధుల నిర్వహణ చేపట్టారన్న ఆరోపణలతో ఇటీవల ఈడీ అదుపులోకి తీసుకున్న చన్ప్రీత్ సింగ్కు సైతం ఈ నెల 23 వరకు జుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఈ ఎన్నికల్లో సౌత్ గ్రూప్ నుంచి రూ.వంద కోట్ల వరకు అక్రమంగా డబ్బులు చేతులు మారాయంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
పారిశ్రామిక మద్యంపై రాష్ట్రాలదే అధికారం
సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వ వాదనలు
దిల్లీ: పారిశ్రామిక మద్యంపై రాష్ట్రాలకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు విన్నవించింది. వాటిని కేంద్రం హరించజాలదని స్పష్టంచేసింది. ‘మత్తు కలిగించే మద్యం’కు విస్తృత అర్థాన్ని ఇవ్వాలని, అందులో పారిశ్రామిక మద్యాన్ని కూడా చేర్చాలని, అలాగే దాన్ని రాష్ట్రాల శాసనాధికార పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించింది. ఆల్కహాల్ కలిగిన అన్ని ద్రవాలనూ ‘మత్తు కలిగించే మద్యం’ పరిధిలోకి తీసుకురావాలని కోరింది. ‘మత్తు కలిగించే ద్రవం’ పరిధిలోకి పారిశ్రామిక మద్యం, ఆల్కహాల్ కలిగిన అన్ని ద్రవాలు వస్తాయని శాసనపరమైన చరిత్ర చెబుతోందని యూపీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దినేశ్ త్రివేది తెలిపారు. పారిశ్రామిక మద్యం ఉత్పత్తిపై నియంత్రణ అధికారం కేంద్రానికే ఉంటుందని 1997లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు 9 మంది సభ్యుల ధర్మాసనం ముందుకొచ్చాయి.
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వడపళని, న్యూస్టుడే: వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. ఈనెల 19నుంచి 30వరకు వీఐటీ వేలూరు, చెన్నై, ఏపీ(అమరావతి), భోపాల్లో పరీక్షలుంటాయని సంస్థ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 125 నగరాలతోపాటు దుబాయి, మస్కట్, ఖతార్, కువైట్, సింగపూర్, కౌలాలంపూర్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావచ్చని స్పష్టం చేసింది.
మే3న ఫలితాలు: మే 3న www.vit.ac.in వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేసి.. అదేరోజు ఆన్లైన్లో కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు. లక్షలోపు ర్యాంకున్నవారు కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోని టాపర్లు, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారికి(ఒక విద్యార్థి, ఒక విద్యార్థినికి) వందశాతం ఫీˆజు మినహాయింపు ఉంటుంది. ‘సపోర్ట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్్స’ (ఎస్టీఏఆర్ఎస్) పథకం కింద హాస్టల్ మెస్లోనూ మినహాయింపు ఉంటుందని సంస్థ పేర్కొంది.
రూ.100 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. నలుగురు నైజీరియన్ల అరెస్ట్
నొయిడా: గ్రేటర్ నొయిడాలో ఓ ఇంటి నుంచి రూ.వంద కోట్ల విలువచేసే 26 కిలోల ఎండీఎంఏ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో ఉంటున్న నలుగురు నైజీరియన్లను అరెస్టు చేసినట్లు గురువారం వెల్లడించారు. మరో రూ.50 కోట్ల విలువ చేసే ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని ఇళ్లలో విదేశీయులు డ్రగ్స్ తయారీ ల్యాబులు ఏర్పాటు చేసుకొంటున్నారని చెప్పారు.
ఆరు ఐఐటీలకు కొత్త డైరెక్టర్లు
దిల్లీ: దేశంలోని ఆరు ఐఐటీలకు గురువారం కొత్త డైరెక్టర్లు నియమితులయ్యారు. విద్యాశాఖలోని సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కాన్పుర్ ఐఐటీకి మహీంద్ర అగర్వాల్, గువాహటి ఐఐటీకి దేవేంద్ర జలిహాల్, జోధ్పుర్ ఐఐటీకి అవినాశ్ కుమార్ అగర్వాల్, ధన్బాధ్ ఐఐటీకి సుకుమార్ మిశ్ర, గోవా ఐఐటీకి డీఎస్ కట్టి, ఐఐటీ-బీహెచ్యూకు అమిత్ పాత్ర నేతృత్వం వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?