బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఎస్ఎల్ఎస్టీ-2016 కేసులో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి పరీక్ష ద్వారా జరిపిన పాతిక వేలకుపైగా నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 9-12 తరగతులకు ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బంది నియామకం కోసం బెంగాల్ సర్కారు ఎస్ఎల్ఎస్టీ-2016 నిర్వహించింది. నాటి నోటిఫికేషన్లో మొత్తం 24,640 ఖాళీలను పేర్కొంది. 23 లక్షల మందికిపైగా పరీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వం చివరకు 25,753 మందికి ఉద్యోగాలిచ్చింది. ఆ నియామక ప్రక్రియలో- అర్హుల జాబితాలో లేనివారికి, ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించినవారికి నియామక పత్రాలు ఇవ్వడం వంటి తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ దాఖలైన 350 పిటిషన్లపై.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటుచేసిన డివిజన్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. గత నెల 20న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. నియామక ప్రక్రియలో అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి, మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని అందులో ఆదేశించింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పక్షంరోజుల్లోగా కొత్త నియామక ప్రక్రియను ప్రారంభించాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)కు ధర్మాసనం సూచించింది.
ఆర్టికల్-14, 16లకు విరుద్ధం
ఎస్ఎల్ఎస్టీ-2016 నియామకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్-14 (చట్టం ముందు అందరూ సమానులే), ఆర్టికల్-16 (ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో వివక్షను నిషేధించడం)లకు విరుద్ధంగా జరిగాయని జస్టిస్ దెబాంగ్సు బసాక్, జస్టిస్ శబ్బర్ రశీదీల ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టబద్ధంగా ఎంపికైనవారికి ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్నప్పటికీ.. మొత్తం నియామకాలను రద్దు చేయడం తప్ప తమ ముందు మరో ఐచ్ఛికం లేదని తీర్పులో పేర్కొంది. మోసపూరిత విధానంలో ఎంపికైనవారిని ఉద్యోగాల్లో కొనసాగిస్తే.. భవిష్యత్తు తరాల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని గుర్తుచేసింది. ఎస్ఎల్ఎస్టీ-2016 వ్యవహారంలో ఇప్పటికే నమోదు చేసిన నాలుగు కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. నాడు 24,640కి మించి ఇతర ఖాళీలకు ఎంపికైనవారిని, నియామక గడువు ముగిశాక ఉద్యోగం పొందినవారిని, ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించినా ఉద్యోగం వచ్చినవారిని అవసరమైతే కస్టడీలోకి తీసుకొని మరీ విచారణ జరపాలని సూచించింది. అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం అదనపు పోస్టులను సృష్టించడంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని పేర్కొంది. అప్పుడే ఈ కుంభకోణం ఎంత పెద్దదో తెలుస్తుందని అభిప్రాయపడింది.
12% వార్షిక వడ్డీతో వేతనాలు వెనక్కి ఇవ్వాలి
24,640కి మించి సృష్టించిన ఖాళీలకు ఎంపికైనవారు, నియామక గడువు ముగిశాక ఉద్యోగం పొందినవారు, ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించినా ఉద్యోగం వచ్చినవారు.. ఇప్పటిదాకా తాము పొందిన వేతనాలను, ఇతర ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 12% వార్షిక వడ్డీతో నాలుగు వారాల్లోగా తిరిగి చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. తాజా తీర్పుపై స్టే విధించాలంటూ బెంగాల్ ఎస్ఎస్సీ సహా మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది. ఎస్ఎల్ఎస్టీ-2016 కుంభకోణంలో బెంగాల్ విద్యాశాఖ మాజీ మంత్రి పార్థ ఛటర్జీతోపాటు మరికొందరు అధికారులను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది.
వారిని ఉరితీయాలి
గంగోపాధ్యాయ
హైకోర్టు తీర్పుతో మమత సర్కారు అవినీతి మరోసారి బహిర్గతమైందని భాజపా విమర్శించింది. ఆమె సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గత నెలలో కలకత్తా హైకోర్టు జడ్జి పదవిని వీడి భాజపాలో చేరిన అభిజీత్ గంగోపాధ్యాయ స్పందిస్తూ.. ఎస్ఎల్ఎస్టీ-2016 కుంభకోణంలో అసలు దోషులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆరోపించారు. వారందర్నీ ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. ఈయన నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనమే గతంలో ఎస్ఎల్ఎస్టీ-2016 కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి గమనార్హం.
సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం
-మమత
ఎస్ఎల్ఎస్టీ-2016 ద్వారా నియమించిన బోధన, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయినవారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్గంజ్లో మాట్లాడుతూ ఈ విషయంపై ఆమె స్పందించారు. 8 ఏళ్ల వేతనాన్ని కేవలం 4 వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కొందరు భాజపా నేతలు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని మమత ఆరోపించారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయిస్తామని బెంగాల్ ఎస్ఎస్సీ ఛైర్మన్ సిద్ధార్థ్ ముజుందర్ కూడా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు