బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఎస్ఎల్ఎస్టీ-2016 కేసులో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి పరీక్ష ద్వారా జరిపిన పాతిక వేలకుపైగా నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 9-12 తరగతులకు ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బంది నియామకం కోసం బెంగాల్ సర్కారు ఎస్ఎల్ఎస్టీ-2016 నిర్వహించింది. నాటి నోటిఫికేషన్లో మొత్తం 24,640 ఖాళీలను పేర్కొంది. 23 లక్షల మందికిపైగా పరీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వం చివరకు 25,753 మందికి ఉద్యోగాలిచ్చింది. ఆ నియామక ప్రక్రియలో- అర్హుల జాబితాలో లేనివారికి, ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించినవారికి నియామక పత్రాలు ఇవ్వడం వంటి తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ దాఖలైన 350 పిటిషన్లపై.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటుచేసిన డివిజన్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. గత నెల 20న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. నియామక ప్రక్రియలో అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి, మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని అందులో ఆదేశించింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పక్షంరోజుల్లోగా కొత్త నియామక ప్రక్రియను ప్రారంభించాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)కు ధర్మాసనం సూచించింది.
ఆర్టికల్-14, 16లకు విరుద్ధం
ఎస్ఎల్ఎస్టీ-2016 నియామకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్-14 (చట్టం ముందు అందరూ సమానులే), ఆర్టికల్-16 (ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో వివక్షను నిషేధించడం)లకు విరుద్ధంగా జరిగాయని జస్టిస్ దెబాంగ్సు బసాక్, జస్టిస్ శబ్బర్ రశీదీల ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టబద్ధంగా ఎంపికైనవారికి ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్నప్పటికీ.. మొత్తం నియామకాలను రద్దు చేయడం తప్ప తమ ముందు మరో ఐచ్ఛికం లేదని తీర్పులో పేర్కొంది. మోసపూరిత విధానంలో ఎంపికైనవారిని ఉద్యోగాల్లో కొనసాగిస్తే.. భవిష్యత్తు తరాల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని గుర్తుచేసింది. ఎస్ఎల్ఎస్టీ-2016 వ్యవహారంలో ఇప్పటికే నమోదు చేసిన నాలుగు కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. నాడు 24,640కి మించి ఇతర ఖాళీలకు ఎంపికైనవారిని, నియామక గడువు ముగిశాక ఉద్యోగం పొందినవారిని, ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించినా ఉద్యోగం వచ్చినవారిని అవసరమైతే కస్టడీలోకి తీసుకొని మరీ విచారణ జరపాలని సూచించింది. అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం అదనపు పోస్టులను సృష్టించడంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని పేర్కొంది. అప్పుడే ఈ కుంభకోణం ఎంత పెద్దదో తెలుస్తుందని అభిప్రాయపడింది.
12% వార్షిక వడ్డీతో వేతనాలు వెనక్కి ఇవ్వాలి
24,640కి మించి సృష్టించిన ఖాళీలకు ఎంపికైనవారు, నియామక గడువు ముగిశాక ఉద్యోగం పొందినవారు, ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించినా ఉద్యోగం వచ్చినవారు.. ఇప్పటిదాకా తాము పొందిన వేతనాలను, ఇతర ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 12% వార్షిక వడ్డీతో నాలుగు వారాల్లోగా తిరిగి చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. తాజా తీర్పుపై స్టే విధించాలంటూ బెంగాల్ ఎస్ఎస్సీ సహా మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది. ఎస్ఎల్ఎస్టీ-2016 కుంభకోణంలో బెంగాల్ విద్యాశాఖ మాజీ మంత్రి పార్థ ఛటర్జీతోపాటు మరికొందరు అధికారులను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది.
వారిని ఉరితీయాలి
గంగోపాధ్యాయ
హైకోర్టు తీర్పుతో మమత సర్కారు అవినీతి మరోసారి బహిర్గతమైందని భాజపా విమర్శించింది. ఆమె సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గత నెలలో కలకత్తా హైకోర్టు జడ్జి పదవిని వీడి భాజపాలో చేరిన అభిజీత్ గంగోపాధ్యాయ స్పందిస్తూ.. ఎస్ఎల్ఎస్టీ-2016 కుంభకోణంలో అసలు దోషులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆరోపించారు. వారందర్నీ ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. ఈయన నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనమే గతంలో ఎస్ఎల్ఎస్టీ-2016 కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి గమనార్హం.
సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం
-మమత
ఎస్ఎల్ఎస్టీ-2016 ద్వారా నియమించిన బోధన, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయినవారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్గంజ్లో మాట్లాడుతూ ఈ విషయంపై ఆమె స్పందించారు. 8 ఏళ్ల వేతనాన్ని కేవలం 4 వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కొందరు భాజపా నేతలు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని మమత ఆరోపించారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయిస్తామని బెంగాల్ ఎస్ఎస్సీ ఛైర్మన్ సిద్ధార్థ్ ముజుందర్ కూడా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు. -
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు తెలిపింది. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక ఆరోపణలు
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు అక్కడి రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక హరే స్ట్రీట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
దక్షిణ భారత్ దిశగా రాకాసి కెరటాలు..
లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు రాష్ట్రాల వైపు రాకాసి కెరటాలు తరుముకొస్తున్నాయని.. రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనుందని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కాయిస్) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. -
దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్డబ్ల్యూడీ-200బి సిద్ధం
రక్షణశాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్ను తయారు చేసినట్లు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (7)
మహాత్మాగాంధీ ‘కపటి’ అని గుజరాత్ కాంగ్రెస్ నేత, రాజ్కోట్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆయన కంటే రాహుల్గాంధీ మెరుగని పేర్కొన్నారు. -
ఖైదీ కడుపులో సెల్ఫోన్
కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న పరశురామ్ అనే ఖైదీ సెల్ఫోన్ మింగేశాడు. తనకు కడుపునొప్పి వస్తోందని నెల రోజులుగా జైలు అధికారులకు చెప్పగా.. స్థానిక ప్రభుత్వ మెగ్గాన్ ఆసుపత్రికి తరలించారు. -
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!