సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు.
దిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. ఈ రెండు పరీక్షలను ఒక సబ్జెక్టుకు ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని, స్కోర్ల నార్మలైజేషనుతో అవసరం ఉండదన్నారు. సాధారణీకరణ విధానం సమంజసంగా లేదని, పరీక్షల్లో తమ పనితీరుపై అది ప్రభావం చూపుతున్నట్లు విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒకే పేపరుకు రెండు మూడు రోజులు పరీక్ష నిర్వహించేవారమని, తద్వారా విద్యార్థులకు వీలైనంత వరకు మొదటి ఎంపిక కేంద్రం లభించేదన్నారు. ఈ ఏడాది నుంచి ఓఎంఆర్ విధానం అనుసరిస్తున్నందున విద్యాసంస్థల్లో పెద్దసంఖ్యలో కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, దేశవ్యాప్తంగా ఒకేరోజున పరీక్ష నిర్వహణకు ఇది అనుకూలంగా ఉంటుందని జగదీప్ కుమార్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్