సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది.
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. సమయం: వ్యక్తిగత అభిరుచులు, కుటుంబ జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించేది. ఆరోగ్యం: శారీరక, మానసిక ఉత్తేజాన్ని అందించేది. మనం చేసే వృత్తి ఈ నాలుగింటినీ అందిస్తేనే మనం ఆనందంగా జీవించగలం. చాలా ఉద్యోగాలు తొలి రెండింటిని ఆకర్షణీయంగా చూపుతూ ఊరిస్తాయి. కానీ చివరి రెండింటిని మన నుంచి దూరం చేస్తాయి. అలాంటి ఉద్యోగాల విషయంలో పునరాలోచన అవసరం.
‘ఎక్స్’లో జేమ్స్ క్లియర్, రచయిత
విద్యార్థులతో ఈ పుస్తకాన్ని చదివించండి
ప్రస్తుతం నేను ‘కాన్సెప్షువల్ ఫిజిక్స్’ అనే పుస్తకం చదువుతున్నాను. దీన్ని హైస్కూల్ టీచర్ పాల్ హెవిట్ రాశారు. విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో అద్భుతంగా వివరించారు. క్లిష్టమైన అంశాలను అరటిపండు వలిచి పెట్టినట్లు చాలా సులువుగా అర్థమయ్యేలా కళ్లకు కట్టారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో ఈ పుస్తకాన్ని చదివించాలి. సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, గణిత సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది.
యూట్యూబ్లో నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు
పిల్లలున్న జంటలకు ఏకాంతం అవసరం
పిల్లలున్న జంటలకు సలహా. ఉద్యోగం, ఇంటి పని, పిల్లల బాగోగులతో మీరెంత తీరిక లేకుండా ఉన్నా సరే, వారానికి ఓ పూట 3-4 గంటలు మీ ఇద్దరి ఏకాంతం కోసం కేటాయించాలి. ఇది మనసు విప్పి మాట్లాడుకోవడానికి, కలసి భోంచేయడానికి, భవిష్యత్తు ప్రణాళికకు, గాబరా లేని శృంగారానికి పనికొస్తుంది. ఏకాంతాన్ని వాయిదా వేస్తే, మెల్లిగా ఇద్దరూ అలసిపోయి, ఒకరికొకరు తోడుగా కాకుండా భారంగా మారి, కొన్నాళ్లకు పొరపొచ్చాలు పొడచూపుతాయి. ప్రతిసారీ ఇలాంటి ఏకాంతాన్ని పొందడం సాధ్యం కాదు కానీ ప్రయత్నించాలి.
‘ఎక్స్’లో శ్రీకాంత్ మిర్యాల, సైకియాట్రిస్ట్
అనుభవాలతో జ్ఞానం ఏకీకృతమైతేనే ప్రయోజనం
ప్రపంచంలోని అన్ని సమస్యలకూ మన దగ్గర పరిష్కారాలు కనిపిస్తున్నాయి కానీ మన సమస్యలను మనం పరిష్కరించుకోలేకపోతున్నామెందుకు? నిజానికి మనలో జ్ఞానానికి లోటు లేదు. కానీ దురదృష్టం ఏమిటంటే మన జ్ఞానం మన అనుభవాలకు సమాంతరంగా నడుస్తోంది. ఆ రెండూ ఎక్కడా కలవడం లేదు. అవి కలవాలంటే మనలో పరివర్తన అవసరం. అనుభవాల్లో జ్ఞానాన్ని ఏకీకృతం చేయడాన్ని పరిపక్వత అంటారు. స్వీయ అవగాహన ద్వారా మాత్రమే పరిపక్వతను సాధించొచ్చు.
యూట్యూబ్లో మహత్రియా రా, ఆధ్యాత్మికవేత్త
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..
నేడు తిహాడ్ జైల్లో లొంగిపోనున్న సందర్భంగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ నాయకులను, కార్యకర్తలనుద్దేశించి ఎక్స్లో తన సందేశాన్ని వెలువరించారు. -
పుణె కారు ప్రమాదం..దర్యాప్తునకు 100మంది పోలీసులు
పుణె కారు ప్రమాదం కేసులో దర్యాప్తును వేగవంతం చేయడానికి 100మంది సిబ్బందితో కూడిన బృందాలను రంగంలోకి దింపినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. -
7 నిమిషాల్లో 15 వేల మెరుపులు
ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. -
మరణ వాంగ్మూలానికి తిరుగులేదు: సుప్రీం
ఓ వ్యక్తి మరణ వాంగ్మూలం నిజమైనదని కోర్టు విశ్వసిస్తే నిందితుడికి శిక్ష వేయడానికి అదొక్కటే చాలని, దానికి వేరెవరి ధ్రువీకరణ అక్కర్లేదని సుప్రీం కోర్టు మే 15న స్పష్టం చేసింది. -
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని దిల్లీ కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. -
సల్మాన్ఖాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగ్గర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ఖాన్పై దాడి లక్ష్యంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పక్కాగా కుట్రలు పన్నుతోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు ఆయన కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
సంక్షిప్త వార్తలు (7)
సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి సంబంధించి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. సుప్రీంకోర్టు అంతర్గత విభాగంగా ఇది పని చేయనుంది. -
ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
రెండు ఇండిగో విమానాలకు సంబంధించి వచ్చిన బాంబు బెదిరింపులు శనివారం అధికారులతో పాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. చివరకు ఆ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
మహారాష్ట్రలోని పుణెలో మైనర్ దురుసు డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో పోలీసులు శనివారం బాలుడి తల్లిని అరెస్టుచేశారు. ప్రమాద సమయంలో ఆ మైనర్ మద్యం తాగలేదని నిరూపించేందుకు ఆమె రక్త నమూనాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం పూర్తయింది. ఇక్కడి వివేకానంద రాక్ మెమోరియల్ మండపంలో గురువారం సాయంత్రం ధ్యానాన్ని ప్రారంభించిన ఆయన.. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూర్తి చేశారు. -
కేరళ, అస్సాంలకు భారీ వరద
రెండు తుపానుల కారణంగా కేరళ, అస్సాంలను భారీ వరదలు ముంచెత్తుతున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, తదుపరి పరిణామాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈ రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. -
‘అగ్నిపథ్’లో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి రాహుల్ లేఖ
సైనిక నియామకాలకు ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ పథకంలో చేరి అమరులయ్యే సైనికుల కుటుంబాలకు అందించే ప్రయోజనాల్లో వివక్ష ఉంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రతకు సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం
దిల్లీలోని ముంగేశ్పుర్ వాతావరణ కేంద్రంలో ఇటీవల అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించడంపై కేంద్రం స్పందించింది. దానికి సెన్సర్ సరిగా పని చేయకపోవడమే కారణమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
-
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేశ్కుమార్ మీనా సమీక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..