దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు.
ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచన
తిరువనంతపురం: యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయం సభ్యులు శనివారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈ సత్కార సభకు యువత అధిక సంఖ్యలో హాజరవుతారని ఊహించాను. కానీ, ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. యువతరాన్ని ప్రార్థనా మందిరాల వైపు ఆకర్షితులయ్యేలా గ్రంథాలయాలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు?’ అని తన ఆలోచనను పంచుకున్నారు. ఆలయాలు కేవలం పెద్దవారి కోసమే కాదని, యువత కూడా వచ్చేలా చేయడంతో వాటిని సమాజాన్ని మార్చే ప్రభావవంతమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. -
7 నిమిషాల్లో 15 వేల మెరుపులు
ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. -
మరణ వాంగ్మూలానికి తిరుగులేదు: సుప్రీం
ఓ వ్యక్తి మరణ వాంగ్మూలం నిజమైనదని కోర్టు విశ్వసిస్తే నిందితుడికి శిక్ష వేయడానికి అదొక్కటే చాలని, దానికి వేరెవరి ధ్రువీకరణ అక్కర్లేదని సుప్రీం కోర్టు మే 15న స్పష్టం చేసింది. -
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని దిల్లీ కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. -
సల్మాన్ఖాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగ్గర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ఖాన్పై దాడి లక్ష్యంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పక్కాగా కుట్రలు పన్నుతోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు ఆయన కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
సంక్షిప్త వార్తలు (7)
సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి సంబంధించి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. సుప్రీంకోర్టు అంతర్గత విభాగంగా ఇది పని చేయనుంది. -
ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
రెండు ఇండిగో విమానాలకు సంబంధించి వచ్చిన బాంబు బెదిరింపులు శనివారం అధికారులతో పాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. చివరకు ఆ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
మహారాష్ట్రలోని పుణెలో మైనర్ దురుసు డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో పోలీసులు శనివారం బాలుడి తల్లిని అరెస్టుచేశారు. ప్రమాద సమయంలో ఆ మైనర్ మద్యం తాగలేదని నిరూపించేందుకు ఆమె రక్త నమూనాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం పూర్తయింది. ఇక్కడి వివేకానంద రాక్ మెమోరియల్ మండపంలో గురువారం సాయంత్రం ధ్యానాన్ని ప్రారంభించిన ఆయన.. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూర్తి చేశారు. -
కేరళ, అస్సాంలకు భారీ వరద
రెండు తుపానుల కారణంగా కేరళ, అస్సాంలను భారీ వరదలు ముంచెత్తుతున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, తదుపరి పరిణామాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈ రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. -
‘అగ్నిపథ్’లో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి రాహుల్ లేఖ
సైనిక నియామకాలకు ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ పథకంలో చేరి అమరులయ్యే సైనికుల కుటుంబాలకు అందించే ప్రయోజనాల్లో వివక్ష ఉంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రతకు సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం
దిల్లీలోని ముంగేశ్పుర్ వాతావరణ కేంద్రంలో ఇటీవల అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించడంపై కేంద్రం స్పందించింది. దానికి సెన్సర్ సరిగా పని చేయకపోవడమే కారణమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
-
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి
-
రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
జగమొండి ప్రజ్వల్.. విచారణకు సహకరించడం లేదన్న సిట్