దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ రాతలు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్ ఈ మేరకు స్పందించింది.
అది భాజపా పనేనంటూ ఆప్ ఆరోపణ
దిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్ ఈ మేరకు స్పందించింది. ఈ అంశంపై చర్చించేందుకు తమకు సమయం కేటాయించాలంటూ ఎన్నికల కమిషన్కు ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసింది. బెదిరింపుల విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టామని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. దిల్లీలోని మొత్తం ఏడు ఎంపీ స్థానాల్లోనూ ఓడిపోతున్నామని అర్థమైన భాజపా తీవ్ర ఆందోళనకు గురై కేజ్రీవాల్ లక్ష్యంగా పలు రకాలుగా కుట్రలు పన్నుతోందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. దిల్లీలో ఆమె సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘మార్చి 21న ఆయన్ను (కేజ్రీవాల్ను) అరెస్టు చేశారు. తిహాడ్ జైల్లో పెట్టాక 15 రోజుల పాటు ఆయనకు ఇన్సులిన్ ఇవ్వలేదు. మేం కోర్టుకు వెళ్లాం. కారాగారం నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని స్వాతి మాలీవాల్పై దాడి కేసును ప్రయోగించారు. అయితే బయటకు వచ్చిన వీడియోలు ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చడంతో ఆ కుట్ర విఫలమైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, పటేల్ నగర్ మెట్రో స్టేషన్లలో సీఎంను బెదిరిస్తూ ఓ వ్యక్తి రాతలకు పాల్పడ్డాడు. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియోలో వెల్లువెత్తాయి. ఆయా స్టేషన్లు 24 గంటలూ సీసీటీవీ, భద్రత సిబ్బంది నీడలో ఉంటాయి. అయినా పోలీసులు ఎందుకు స్పందించడంలేదు? సైబర్ విభాగం ఎక్కడుంది. ఇదంతా చూస్తుంటే భాజపా పన్నాగమనే అర్థమవుతోంది’’ అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న చిత్రాలను బట్టి మెట్రో రైళ్లలో కొన్ని, రైల్వే స్టేషన్లలోని సైన్ బోర్డులపై కొన్ని రాతలున్నట్టు తెలుస్తోంది. వాటిలోని కొన్ని రాతలు ఇన్స్టాగ్రాం హ్యాండిల్గా అవతరించాయి. ఇప్పటి వరకూ మొట్టమొదట ఎవరు వీటిని షేర్ చేశారన్నది తెలియరాలేదు.
సానుభూతి కోసం కేజ్రీవాల్పై దాడికి ఆప్ ఎత్తుగడ : భాజపా
ఆప్ తాజా ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్కు భద్రతను రెట్టింపు చేయాలని భాజపా దిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న దిల్లీలో జరగబోయే ఎన్నికల్లో నగర ప్రజల సానుభూతి పొందేందుకు కేజ్రీవాల్పై దాడి జరిగే విధంగా ఆయన, ఆప్ ఏర్పాట్లు చేసుకుంటాయని ఆరోపించారు. ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. మాలీవాల్పై దాడి కేసులో కేజ్రీవాల్ తన మౌనాన్ని ఎప్పుడు వీడతారని సచ్దేవా నిలదీశారు.
కేజ్రీవాల్ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించండి
ప్రత్యేక జడ్జికి ఈడీ వినతి
దిల్లీ: మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజాకు సోమవారం విజ్ఞప్తి చేసింది. జూన్ 2న లొంగిపోయిన అనంతరం ఆయన్ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. కేజ్రీవాల్కు విధించిన కస్టడీ గడువు సోమవారంతో ముగిసిపోయిన నేపథ్యంలో ఈడీ తాజాగా కోర్టును ఆశ్రయించింది. జూన్ 1వ తేదీ వరకూ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు అదే నెల 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. మద్యం విధానం కుంభకోణంలో కేజ్రీవాల్, సహనిందితురాలు భారాస నాయకురాలు కె.కవితలను విచారించేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు వివరించింది. తమ వాదనను బలపరిచేలా వారిద్దరికి వ్యతిరేకంగా రూపొందించిన అదనపు అభియోగపత్రాలను సమర్పించింది. వాటిపై ఈడీ వాదనలను న్యాయమూర్తి మంగళవారం కూడా విననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి