పోస్టల్ బ్యాలెట్ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది.
దిల్లీ: పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. కదలలేని స్థితిలో ఉన్న తనకు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని 78 ఏళ్ల మహిళ అభ్యర్థించారు. తొలుత ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించగా....ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారినీ న్యాయస్థానం ఆదేశించింది. అయితే, ఆమె శారీరక వైకల్యం 40శాతంగా ఉందన్న వైద్యుల ధ్రువీకరణ పత్రం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ మంజూరుకు అర్హురాలు కాదని రిటర్నింగ్ అధికారి ఆ అభ్యర్థనను మే 1న తిరస్కరించారు. ఆమె మళ్లీ హైకోర్టుకు వెళ్లగా...ధర్మాసనం ఈ నెల 6న పిటిషన్ను తిరస్కరించింది. ఆమె ఓటు వేయాల్సిన బిలాస్పుర్ నియోజకవర్గ పోలింగ్ 7న ముగుస్తున్నందున 24 గంటల వ్యవధిలో పోస్టల్ బ్యాలెట్ జారీ సాధ్యం కాదని పేర్కొంది. దీనిని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేయగా జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తగు శారీరక వైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. సంబంధిత నియోజకవర్గంలో పోలింగ్ తేదీ కూడా ముగిసిన తర్వాత ఈ పిటిషన్కు విచారణార్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుందని, ఈ లోగా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపినా ధర్మాసనం సమ్మతించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు
బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు జాప్యం చేస్తున్నారని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలంటూ కేంద్ర హోంశాఖ, ఆయా గవర్నర్ల... -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?