సుశీల్‌ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్‌ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్‌ నేత సుశీల్‌ మోదీ ఇంటికి వెళ్లారు.

Published : 21 May 2024 04:28 IST

పట్నా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్‌ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్‌ నేత సుశీల్‌ మోదీ ఇంటికి వెళ్లారు. క్యాన్సర్‌తో బాధపడుతూ సుశీల్‌ మోదీ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన మోదీ పార్టీ కార్యకర్తలతో సమావేశమై తుది రెండు దశల పోలింగుపై చర్చలు జరిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని